Mohammad Rizwan: జట్టు ప్రదర్శనపై ఎలాంటి సాకులు వెతకడం లేదు..
- ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఒక్క మ్యాచ్ కూడా గెలువని పాకిస్తాన్
- టోర్నీ నుంచి నిష్క్రమించిన పాక్
- స్పందించిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్
- మా ప్రదర్శనపై సాకులు వెతకడం లేదు- రిజ్వాన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి పాకిస్తాన్ జట్టు ముందుగానే నిష్క్రమించింది. బంగ్లాదేశ్తో ఈరోజు జరగాల్సిన నామమాత్రపు మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకుందామనుకున్న పాక్.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది. దీంతో.. పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి ఔటయింది. ఈ క్రమంలో.. పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ స్పందించాడు. తమ ప్రదర్శనపై సాకులు వెతకడం లేదని అన్నారు. ఈ టోర్నీలో తమ అభిమానుల అంచనాలను అందుకోలేదని రిజ్వాన్ నిరాశ వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ గ్రూప్ Aలో మూడు మ్యాచ్లలో రెండు ఓటములతో1.087 నికర రన్ రేట్తో చివరి స్థానంలో నిలిచింది. దీంతో.. టోర్నమెంట్ చరిత్రలో చెత్త రికార్డును సాధించిన మొదటి ఆతిథ్య దేశంగా పాకిస్తాన్ నిలిచింది.
Read Also: CM Chandrababu: ఉగాది పండుగ రోజు నుంచి పీ4 విధానం ప్రారంభించనున్న ఏపీ సర్కార్
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
తమ జట్టుపై చాలా ఎక్కువ అంచనాలు ఉన్నాయని.. కానీ వాటిని తాము అందుకోలేకపోయామని రిజ్వాన్ చెప్పాడు. ఇది తమకు నిరాశ కలిగించిందన్నారు. న్యూజిలాండ్తో తమ తదుపరి మ్యాచ్లో తమ తప్పులను సరిదిద్దుకుంటామని రిజ్వాన్ తెలిపాడు. మరోవైపు.. గాయాలు, ఒత్తిడి కారణంగా జట్టు మెరుగ్గా రాణించలేకపోయిందని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో బాగా రాణించిన సయీమ్ అయూబ్, ఫఖర్ జమాన్ గాయపడ్డాడు.. కానీ జట్టు ఓటములకు దీనిని సాకుగా చెప్పడం లేదని తెలిపాడు.
Read Also: Hyderabad: పెండిగ్ చలానా కోసం నా కారు ఆపుతావా? నీకు ఎన్ని గుండెలు..!
జట్టు క్రికెట్ మెరుగుదల గురించి రిజ్వాన్ మాట్లాడుతూ.. “పాకిస్తాన్ జట్టు బలాన్ని మనం కచ్చితంగా గుర్తించాలి. ఇతర జట్లతో పోటీ పడటానికి మేము అవగాహన, వృత్తి నైపుణ్యాలను నేర్చుకోవాలి” అని రిజ్వాన్ పేర్కొన్నాడు. 29 సంవత్సరాల తర్వాత సొంతగడ్డపై ఈ టోర్నమెంట్ ఆడిన పాకిస్తాన్.. తమ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి జట్టు మధ్యలోనే నిష్క్రమించింది. దీంతో.. పాకిస్తాన్ జట్టుపై ఆ దేశ అభిమానులే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పరిస్థితిని పునరావృతం కాకుండా చూసుకోవడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) జాతీయ జట్టులో పెద్ద పునర్నిర్మాణం చేయాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!