Telangana: కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు పెట్టుకుంటే రాష్ట్ర అబివృద్ధి కొరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డబ్బులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు అని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. గత పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఇచ్చిన డబ్బుల లెక్కను సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పాలి అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో గత ప్రభుత్వం చేసిన అవినీతిని బయట పెట్టాలని రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నాను అని ఆయన కోరారు. అదిలాబాద్ సభలో సీఎం రేవంత్ ప్రధాని మోడినీ పెద్దన్న అని సంబోధిస్తునే.. రాష్ట్ర అభివృద్దికి సహకారం అందించాలని అడిగారు అనే విషయాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
Read Also: BRS: బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కేసీఆర్ మీటింగ్ కు ఖమ్మం ఎమ్మెల్యే డుమ్మా..
ఇక, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చింది.. ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది అనేది చూసుకోవాలి అని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మొదట్లో కేసీఆర్ మోడినీ పొగడ్తలతో ముంచెత్తారు.. కానీ, ఆ తర్వాత కేసీఆర్ మారిపోయి.. కనీసం మోడీ టూర్స్ లో ప్రోటోకాల్ కూడా పాటించలేదు అని విమర్శలు గుప్పించారు. అయితే, కేసీఆర్ లాగా సీఎం రేవంత్ రెడ్డి సడెన్గా మారొద్దని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.