IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక
- 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- అప్రమత్తంగా ఉండాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. వర్షాల తీవ్రత ఏమాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు. భారత వాతావరణ శాఖ (IMD) జూలై 26న గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది.
ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Also Read
- PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
- PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
- Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
- Ketan Agrawal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతన్, సియాల తర్వాత మరొకరి అరెస్ట్..
ఐఎండీ అంచనా ప్రకారం.. మహారాష్ట్ర, ఒడిశాలో శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుజరాత్, ఛత్తీస్గఢ్, కొంకణ్-గోవా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే గుజరాత్లో వర్షాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. పాటన్ జిల్లాలోని సంతల్పూర్ ప్రాంతంలో గత 24 గంటల్లో ఏకంగా 390 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలోని రాధన్పూర్, డియోడార్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి.
మరో పలు రాష్ట్రాలకు వర్ష సూచన
జూలై 26న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం-మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అండమాన్-నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.
వర్షాలకు కారణమేంటి?
ప్రస్తుతం నైరుతి రాజస్థాన్పై అల్పపీడన ప్రాంతం కొనసాగుతుండగా, వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండు అల్పపీడన వ్యవస్థలను కలుపుతూ మధ్య భారతదేశం మీదుగా రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర భారతదేశంపై చురుకుగా ఉన్న పశ్చిమ విక్షోభం కూడా దీనికి తోడవడంతో దేశవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి.
వరదల ముప్పు
రాబోయే 24 గంటల్లో గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలతో పాటు జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే నేల తడిసిపోవడంతో మరింత భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు నీరు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!