Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
- ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి
- కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రప్రతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సలహా మేరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి అదనంగా విద్యాశాఖ బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో తన శాఖలను నిర్వహిస్తున్న ప్రహ్లాద్ జోషి.. ఇకపై కేంద్ర విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించనున్నారు.
నీట్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో పారదర్శకతపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన నిరసనలు గత కొన్ని వారాలుగా కొనసాగుతున్నాయి. ఈ ఉద్యమాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం సోషల్ మీడియా వేదిక ఎక్స్లో విడుదల చేసిన లేఖలో.. దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Also Read
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
తన రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ‘‘జంతర్మంతర్తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఏర్పడిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు ఉపయోగించుకోకూడదు. దేశ ఐక్యత దెబ్బతినకూడదు. భారతదేశంలోని ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు.’’ అని పేర్కొన్నారు. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని గౌరవ ప్రధాని మోడీకి తన రాజీనామాను సమర్పించినట్లు వెల్లడించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించే వరకు ప్రహ్లాద్ జోషి అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.
నీట్ పరీక్షల వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావడం, పేపర్ లీకేజీలపై కఠిన చట్టం తీసుకురావడం, ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటి చర్యలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విద్యాశాఖ బాధ్యతలు ప్రహ్లాద్ జోషికి అప్పగించడంతో ఆ సంస్కరణల అమలు ఆయన పర్యవేక్షణలో కొనసాగనుంది.
తాజావార్తలు
-
Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
-
Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
-
Giorgia Meloni: 3% ఓట్ల పార్టీ నుంచి ప్రధాని వరకు.. జార్జియా మెలోని సరికొత్త రికార్డుకు చేరువ
-
Welcome To The Jungle OTT: పొట్ట చెక్కలయ్యే కామెడీతో 192 కోట్ల గ్రాస్.. ఓటీటీలో 24 గంటల్లోనే నంబర్ 1 ట్రెండింగ్!
-
Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. ‘చిరు’ పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?