Giorgia Meloni: ప్రధాని మోడీకి ‘నమస్తే’తో స్వాగతం పలికిన ఇటలీ ప్రధాని.. (వీడియో)
- ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని
- ‘నమస్తే’ అంటూ పలకరించుకున్న ఇరువురు నేతలు
- జీ7 సదస్సుకు హాజరైన ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం ‘నమస్తే’ అంటూ పలకరించుకున్నారు. జార్జియా మెలోని ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారిగా జీ7 సదస్సుకు భారత్కు ఆహ్వానం అందింది.
#WATCH | Italy: Prime Minister of Italy Giorgia Meloni receives Prime Minister Narendra Modi as India participates as an 'Outreach nation' in G7 Summit pic.twitter.com/Sqna3AEu9X
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- Fake Doctors: హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
— ANI (@ANI) June 14, 2024
ఇదిలా ఉంటే.. ఇటలీలోని అపులియాలో జరుగుతున్న 50వ జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ పలువురు ప్రపంచ నేతలను కలిశారు. ఇప్పటికే.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో భేటీ అయ్యారు. ఇద్దరు నాయకులు రక్షణ, అణు, అంతరిక్షం, విద్యతో సహా అనేక ప్రధాన ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపై చర్చించారు. మరోవైపు.. బ్రిటన్ ప్రధాని రిషి సునక్తోనూ ప్రధాని మోడీ భేటీ అయ్యారు. మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో భారత్-యుకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. సెమీకండక్టర్, టెక్నాలజీ, వాణిజ్యం వంటి రంగాల్లో ఇరు దేశాలు సంబంధాలను మరింత బలోపేతం చేసుకోగలవని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Depression & Memory Problem: చిన్నవయసులో అధిక ఒత్తిడికి లోనైతే..జ్ఞాపకశక్తి బలహీనం
మరోవైపు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని కూడా ప్రధాని మోడీ కలిశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడితో జరిగిన భేటీ సానుకూలంగా జరిగిందని.. ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారత్ ఆసక్తిగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. కాగా.. ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు అగ్రనేతలు ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు.
తాజావార్తలు
-
RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
-
IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
-
Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
-
Fake Doctors: హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
-
YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!