Parents killed Son: దారుణం.. డబ్బు కోసం కుమారుడిని చంపిన తల్లిదండ్రులు.. ఎక్కడంటే?
- జార్ఖండ్లోని రాంచీలో దారుణ ఘటన
- డబ్బు కోసం కుమారుడిని చంపిన తల్లిదండ్రులు
- మంగళవారం అర్ధరాత్రి హత్య
- పరారీలో నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్లోని రాంచీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇక్కడ డబ్బు కోసం తల్లిదండ్రులు తమ కుమారుడిని హత్య చేశారు. విషయం ఠాకూర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్రాటు గ్రామంలో చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి ఇక్కడ ఓ యువకుడిని అతని తండ్రి, సవతి తల్లి కలిసి చంపేశారు.
READ MORE: Ram Gopal Varma: ఆర్జీవీపై వరుస ఫిర్యాదులు.. మరో కేసు నమోదు..
Also Read
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
పోలీసుల వివరాల ప్రకారం.. పట్రాటు గ్రామానికి చెందిన ఫులేశ్వర్ పహాన్, అతని మూడో భార్య సునీతాదేవి మద్యం తాగి తమ కుమారుడిని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అతను డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో వారిద్దరూ తమ 25 ఏళ్ల కుమారుడు మదన్ పహాన్ తలపై గుడ్డ కప్పి పిస్టల్లో కాల్చేశారు. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు పాల్పడిన తర్వాత నిందితులిద్దరూ పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హత్యకు ఉపయోగించిన పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మిగతా కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితులిద్దరినీ పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. మదన్ పంజాబ్లోని ఓ పౌల్ట్రీ ఫామ్లో చాలా ఏళ్లుగా పనిచేశాడు. నెల రోజుల క్రితం ఇంటికి వచ్చాడు.
READ MORE:Patnam Narender Reddy Wife: పోలీసులపై చర్యలు తీసుకోండి.. హైకోర్టులో పట్నం శృతి పిటిషన్..
మదన్ పహాన్ వివాహం రామ్గఢ్లోని పట్రాటులో నిశ్చయమైంది. బుధవారం ఎంగేజ్మెంట్ వేడుక ఉంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. నిందితుడు ఫులేశ్వర్ పహాన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతనికి మొదటి భార్యకు వివాహమైన ఒక కుమార్తె ఉంది. మదన్ అతని రెండవ భార్య కుమారుడు. ఇద్దరు భార్యల మరణానంతరం నిందితుడు ఫులేశ్వర్ పహాన్ సునీతాదేవిని మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!