Bihar: పోలీస్ క్వార్టర్లో ఇన్స్పెక్టర్ కొడుకు ఉరివేసుకుని ఆత్మహత్య..కారణం?
- అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ కుమారుడు ఆత్మహత్య
- బీహార్ రాష్ట్రం నలందలో ఘటన
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగింత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ రాష్ట్రం నలందలోని అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్ ఆవరణలోని క్వార్టర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజ్గిర్లో జరిగిన హాకీ మ్యాచ్లో ఏఎస్ఐ డ్యూటీలో ఉండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసు కుమారుడు మహిళల హాకీ మ్యాచ్ చూడాలనుకున్నా చూడలేకపోయాడని సమాచారం. ఈ ఘటన బెనా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
READ MORE: AUS vs IND: భారత్ను అడ్డుకోవడం కష్టమే.. ఆస్ట్రేలియాకు ఆడమ్ హెచ్చరికలు!
Also Read
- Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
- Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
- IND-A Vs SL-A: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
మృతి చెందిన యువకుడిని మాధేపురా జిల్లాకు చెందిన ధర్మేష్ కుమార్ కుమారుడు రూపేష్ కుమార్ (20)గా గుర్తించారు. ధర్మేష్ కుమార్ బెనా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా హాకీ మ్యాచ్ సందర్భంగా స్పోర్ట్స్ అకాడమీలో విధుల నిమిత్తం వెళ్లారు. అంతలోపే ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా రూపేష్ కుమార్ తాత కప్లేశ్వర్ దాస్ మాట్లాడుతూ.. “బుధవారం తన తండ్రి రాజ్గిర్ క్రీడా మైదానంలో విధులు నిర్వహిస్తున్నాడు. తన డ్యూటీ ముగించుకుని, అతను క్వార్టర్ నంబర్ 3కి తిరిగి వచ్చాడు. ఇంట్లో ఉన్న తన కొడుకును పిలిచి, తలుపు తెరవమని అడిగాడు. ఎంత శబ్ధం చేసిన కుమారుడు స్పందించకపోవడంతో సమీపంలోని పోలీసులు కలిసి తలుపులు పగులగొట్టారు. ఇంట్లోకి రాగానే ఆ గది దృశ్యం చూసి చలించిపోయాడు.” అని పేర్కొన్నారు.
READ MORE: Patnam Narender Reddy Wife: పోలీసులపై చర్యలు తీసుకోండి.. హైకోర్టులో పట్నం శృతి పిటిషన్..
అయితే.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అతను మ్యాచ్ చూడటానికి మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరాడు. కానీ ఎందుకో ఇంటికి తిరిగి వచ్చి ఈ స్టెప్ తీసుకున్నాడు. ఈ కేసులో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు బేనా పోలీస్ స్టేషన్ ఇంచార్జి సామ్రాట్ దీపక్ తెలిపారు. గదిలోంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని.. ఆత్మహత్యకు గల కారణాలు, ఇతర వాస్తవాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
తాజావార్తలు
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
-
Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
-
Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!