Champions Trophy 2025: పాకిస్తాన్లో భారత జెండా వివాదంపై పీసీబీ వివరణ..
- పాకిస్తాన్లో భారత జెండా వివాదంపై పీసీబీ వివరణ
- పాకిస్తాన్లో ఆడే జట్ల జెండాలు మాత్రమే ఎగురవేస్తాం- పీసీబీ
- కనిపించని బంగ్లాదేశ్ జట్టు జెండా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం ముందు కరాచీలోని నేషనల్ స్టేడియంలో భారత జెండా కనిపించకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) వివరణ ఇచ్చింది. ఈ టోర్నీలో పాల్గొనే దేశాల జెండాలను స్టేడియం పైకప్పుపై ఎగురవేస్తున్నట్లు చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే… ఆ వీడియోలో అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా భారత జాతీయ జెండా ఎక్కడా కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అన్ని మ్యాచ్లను దుబాయ్లో ఆడుతుండటంతో.. భారత జెండాను కరాచీలో ఎగురవేయలేదని చాలామంది భావించారు. ఈ వివాదం నేపథ్యంలో పీసీబీ వివరణ ఇచ్చింది. పాకిస్తాన్లో ఆడే జట్ల జెండాలు మాత్రమే ఎగురవేస్తామని పీసీబీ తెలిపింది. ‘2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారతదేశం తన మ్యాచ్లు ఆడటానికి పాకిస్తాన్కు రావడం లేదు. కరాచీలోని నేషనల్ స్టేడియం, రావల్పిండి క్రికెట్ స్టేడియం, లాహోర్లోని గడాఫీ స్టేడియం ఆ వేదికలలో ఆడబోయే దేశాల జెండాలను ఎగురవేసింది” అని పీసీబీ తెలిపింది. మరోవైపు.. బంగ్లాదేశ్ జెండా కూడా ఎగురవేయలేదు. బంగ్లాదేశ్ జట్టు ఇంకా పాకిస్తాన్కు రాలేదు.. దుబాయ్లో భారత్తో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో ఆ దేశపు జెండా కూడా ఎగురవేయలేదని పీసీబీ పేర్కొంది.
Read Also: AP High Court: పీఎస్లలో సీసీ కెమెరాలు.. ఏపీ సర్కార్కు హైకోర్టు కీలక ఆదేశాలు..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
టీమిండియా పాకిస్తాన్కు వెళ్లడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో.. భారత జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు దుబాయ్ లో ఆడేందుకు పీసీబీ, బీసీసీఐ.. ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం 2025 మహిళల ప్రపంచ కప్, 2026 పురుషుల టీ20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ ఇండియాకి వెళ్లదు. 2012-13లో పాకిస్తాన్ వన్డే, టీ20 సిరీస్ల కోసం భారత్ కి వచ్చినప్పటి నుండి.. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు లేవు. టీమిండియా చివరిసారిగా 2008లో ఆసియా కప్ కోసం పాకిస్థాన్లో పర్యటించింది. అనంతరం 2016 టీ20 ప్రపంచ కప్, 2023 వన్డే ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టును భారత్ స్వాగతించింది. అయితే, ఇండియా ఈ టోర్నీ కోసం పాకిస్తాన్ వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది. కాగా.. పాకిస్తాన్ కూడా ఐసిసి ఈవెంట్స్ కోసం భారత్ కి వెళ్లడానికి నిరాకరించనుంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!