Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Prajavani

Off The Record: ప్రజావాణి మూడునాళ్ల ముచ్చటేనా..? కాంగ్రెస్ ప్రభుత్వం లైట్ తీసుకుందా.. ?

Published Date :January 3, 2025 , 10:59 pm
By Sudhakar Ravula
  • వారానికి రెండ్రోజులు మంత్రులు ఫిర్యాదుల స్వీకరణ..
  • గాంధీభవన్‌కు భారీ ఎత్తున వచ్చిన ప్రజలు..
  • సమస్యలను పరిష్కారమయ్యే దిశగా ఆదేశాలు ..
  • ఇప్పటి వరకు 3 వేలకు పైచిలుకు ప్రజలు గాంధీభవన్‌కి..
  • సమస్యలు చెప్పుకునేందుకు క్యూకడుతున్న జనం..
  • ప్రజావాణి కొనసాగుతుందా..? లేదంటే ఎత్తేశారా ?..
  • పిసిసి నుంచి మంత్రుల మధ్య సమన్వయం లేదా? ..
Off The Record: ప్రజావాణి మూడునాళ్ల ముచ్చటేనా..? కాంగ్రెస్ ప్రభుత్వం లైట్ తీసుకుందా.. ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… ప్రజావాణి పేరుతో ప్రజల సమస్యలపై దరఖాస్తులను స్వీకరించింది. పీసీసీ చీఫ్‌గా మహేష్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇదే అనవాయితీ కొనసాగింది. గాంధీభవన్‌లో వారానికి రెండు రోజులు మంత్రులు వచ్చి…ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించాలని నిర్ణయించారు. 2024 సెప్టెంబర్ 27 నుంచి గాంధీభవన్‌లో ప్రజావాణి పేరుతో ఫిర్యాదులను స్వీకరించారు. మొదట ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ్మతో ప్రారంభమైంది. గాంధీభవన్‌కు భారీ ఎత్తున వచ్చిన ప్రజలు…తమ సమస్యలను చెప్పుకున్నారు. దామోదర్ రాజనర్సింహ.. ఉత్తంకుమార్ రెడ్డి..కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇలాంటి మంత్రులు వెంటనే సమస్యలను పరిష్కారమయ్యే దిశగా ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు. దీంతో ప్రజలకి గాంధీభవన్‌లో ప్రజావాణిపై కొంత నమ్మకం పెరిగింది. కానీ గడిచిన నెల రోజులుగా ప్రజావాణి ఉసే ఎత్తడం లేదు.

ప్రజావాణి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3 వేలకు పైచిలుకు ప్రజలు గాంధీభవన్‌కి వచ్చారు. తమ సమస్యలను మంత్రులకు చెప్పుకున్నారు. కానీ డిసెంబర్ 5 నుంచి ఇప్పటి వరకు ప్రజావాణి నిర్వహించలేదు. మంత్రులు కూడా ఇటువైపు రావడం లేదు. కానీ ప్రజలు రోజు గాంధీ భవన్‌కి వచ్చి సమస్యలు చెప్పుకునేందుకు క్యూకడుతున్నారు. ప్రజావాణి కొనసాగుతుందా..? లేదలంటే ఎత్తేశారా..? అనేది కూడా ఎవరికి చెప్పడం లేదు. పిసిసి నుంచి మంత్రుల మధ్య ప్రజావాణి పై సమన్వయం లేదా ..? అనే చర్చ కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతోంది. గాంధీభవన్‌కి గంటన్నర సమయం కూడా కేటాయించలేనంత బిజీగా మంత్రులు ఉన్నారా..? అని విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రజలకు చేరువవ్వటంతో పాటు పార్టీ నేతలకు ఉన్న సమస్యలను చర్చించుకునేందుకు ప్రజావాణి కొంత వెసులుబాటుగా ఉండేది. కానీ డిసెంబర్ 5 2024 నుంచి ఇప్పటి వరకు ప్రజావాణి నిర్వహించలేదు. ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసలకు ఓర్చి గాంధీభవన్‌కి…ఫిర్యాదులతో వచ్చే వారికి నిరాశ ఎదురవుతుంది.

ప్రభుత్వం అన్నాక మంత్రులు కొంత బిజీగా ఉండడం సహజమే. కానీ వారానికి ఇద్దరు మంత్రులు గంటన్నర సమయం గాంధీభవన్‌కి కేటాయించలేక పోతున్నారంటే ఎక్కడో సమన్వయ లోపం ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. అందరిని కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌కి వచ్చి సమస్యలు చెప్పుకోండి అన్న పార్టీ…ఇప్పుడు జనం వస్తున్నా మంత్రులను మాత్రం రప్పించలేకపోతుందనే చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా గాంధీభవన్‌లో ప్రజావాణి ప్రారంభిస్తారా ? ఇలాగే టైం పాస్ చేస్తారా..? అనేది చూడాలి. ప్రజావాణి నిర్వహిస్తే నిర్వహిస్తున్నామని…లేదంటే ప్రజావాణి లేదని ప్రకటన విడుదల చేయకపోవడంతో సమస్యలతో జనం గాంధీభవన్ క్యూబెడుతున్నారు. తీరా ప్రజావాణి లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుతిరిగిపోతున్నారు. ప్రజావాణి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పీసీసీ చీఫ్‌ క్లారిటీ ఇవ్వాలని ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Revanth Reddy
  • congress
  • off the record
  • prajavani
  • telangana

తాజావార్తలు

  • CSK IPL 2026: ఐపీఎల్ 2026కు ముందు సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఈ సీజన్ మొత్తానికి దూరం

  • Massive Water Cloud Discovered in Space: అంతరిక్షంలో భారీ మేఘం.. సముద్రాలన్నింటి కంటే 140 ట్రిలియన్ల రెట్ల ఎక్కువ నీరు..!

  • USA Crime : అమెరికాలో తెలుగు యువకుడు అరెస్ట్.. ఒక్క తప్పు జీవితం తలకిందులు..!

  • Telangana: ఐదుగురిని ప్రభుత్వ విప్‌లుగా నియమించిన తెలంగాణ ప్రభుత్వం..

  • Balineni Srinivasa Reddy Tweet Delete: మాజీ మంత్రి బాలినేని ట్వీట్ ఎపిసోడ్‌లో ట్విస్ట్..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions