Tummala Nageswara Rao: అన్ని శాఖల అధికారులకు మంత్రి తుమ్మల క్లాస్..
- అన్ని శాఖల అధికారులకు క్లాస్ పీకిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- పెద్దవాగు ప్రాజెక్ట్ గండి పడడంతో ప్రాజెక్టును సందర్శించిన మంత్రి
- గుమ్మడవల్లి ప్రభుత్వ కాలేజీలో అధికారులతో సమీక్షలో పాల్గొన్న తుమ్మల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్ట్ గండి పడడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం.. ఆయకట్ట రైతులను పరామర్శించి నీట మునిగిన ఇళ్ళను సందర్శించారు. కొత్తూరు గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందిగా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా.. గుమ్మడవల్లి ప్రభుత్వ కాలేజీలో అధికారులతో సమీక్షలో అన్ని శాఖల అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లాస్ పీకారు. ఇరిగేషన్ అధికారులతో ఆయన మాట్లాడుతూ.. అసలు ప్రాజెక్ట్ గేట్లు ఎందుకని ముందుగా ఎత్తలేదని ప్రశ్నించారు. జూన్, జులైలో ఎందుకు మోటర్లపై పర్యవేక్షణ చేయలేదని అధికారులను అడిగారు. నీరు వస్తుందని తెలుసు కదా.. మీరు అబద్ధం చెప్పిన నేను ప్రజలను అడుగుతానని తుమ్మల పేర్కొన్నారు. ప్రాజెక్ట్ కూలే నాటికి జులై వచ్చి 18 రోజులు అయ్యింది.. ఆ 18 రోజుల్లో మోటార్లు ఎందుకు చెక్ చేయలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kanwar Yatra: అఖిలపక్ష సమావేశంలో “కన్వర్ యాత్ర” వివాదాన్ని లేవనెత్తిన ప్రతిపక్షాలు..
Also Read
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- Bhadradri Kothagudem: నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నం
- Kothagudem Municipal Corporation : కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా..!
- Bomb Blast : జర్రుంటే రైలు పేలుతుండే..! బాంబు కొరికిన కుక్క.. బ్లాస్ట్..!
జులై 17వ తేదీనే గేట్లు ఎత్తి ఉంటే ఇంతటి నష్టం జరిగేది కాదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎప్పటికప్పుడు మీకు ఎన్ని మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవుతుందో తెలుసు.. అయినా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని అధికారులప ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతారం, కొత్తూరు మండల వ్యాప్తంగా 72 ఇళ్ళు నీట మునిగాయి.. 250 మందికి నిత్యం భోజనం, ప్రతి కుటుంబానికి 10 కేజీలు బియ్యం, నిత్యావసర సరుకులు ఏర్పాటు చేయండని తుమ్మల ఆదేశించారు. మీరు మంచిగా చేయకపోతే రానున్న రోజుల్లో డెంగ్యూ, విష జ్వరాలు వస్తాయన్నారు. అందులో వేలేరుపాడు. కుకునూరు, అశ్వారావుపేట మండలాల్లో ఎక్కువుగా ఉంటాయని మంత్రి తెలిపారు.
Lavu Sri Krishna Devarayalu: ఏపీ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో పార్లమెంట్లో వివరిస్తాం..
హెల్త్ డిపార్ట్మెంట్ ఇంటి ఇంటికి తిరిగి వైద్యం చేయండని సూచించారు. ముందుగా నీట మునిగిన ఇళ్ళ వద్దకు మీరే వెళ్ళండి.. డాక్టర్స్ కానీ మొబైల్ వ్యానులు ఇంకా ఏమైనా కావాలంటే వెంటనే కలెక్టర్ పంపిస్తారు ఏ ఒక్కరికి జ్వరం రావద్దని తెలిపారు. అన్ని శాఖలతో సమన్వయంతో ఉంటూ ప్రతి గ్రామానికి తిరగాలి.. ఏ సమస్య ఉన్న కలెక్టర్ చెప్పాలి అంటూ పోలీస్ శాఖకు మంత్రి తుమ్మల సూచించారు. నష్టపోయిన ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి అంటూ వ్యవసాయ శాఖకు ఆదేశం చేశారు. హాస్టల్స్, స్కూల్స్ ప్రతి ఒక్కటి మీరు క్షుణ్ణంగా పరిశీలించి విద్యుత్ సరఫరాలో ఎటువంటి నిర్లక్ష్యం వ్యవహరించకండి అంటూ విద్యుత్ శాఖకు సూచించారు. ఏ ఒక్క పాత స్కూల్, హాస్టల్ బిల్డింగ్స్ ఉండకూడదు.. అవసరమైతే రేకులు షెడ్ వేయించండి.. ఏ ఒక్క పిల్లోడికి ప్రమాదం జరిగిందంటూ వార్తలు రావద్దని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
తాజావార్తలు
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!