Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- సీతారామ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు
- రీడిజైన్పై కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు
- పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేస్తాం
- ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని సీతమ్మ సాగర్, సీతారామ ప్రాజెక్టులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం పరిశీలించారు. ప్రాజెక్టు సందర్శన అనంతరం గోదావరి తీరంలో మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గోదావరిలో ప్రవహిస్తున్న జలాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలనే సంకల్పంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఇటీవల దేవాదుల ప్రాజెక్టును సందర్శించామని, నేడు సీతారామ ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించామని తెలిపారు. తెలంగాణలో చివరి ప్రాజెక్టు అయిన సీతారామ ద్వారా గోదావరి నీటిని గరిష్టంగా సద్వినియోగం చేసుకుంటామని ప్రకటించారు.
వైఎస్సార్ హయాంలోనే పునాది.. కేసీఆర్ పాలనలో వ్యయం పెంపు
గతంలో సీతారామ ప్రాజెక్ట్ స్థానంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘దుమ్ముగూడెం రాజీవ్ సాగర్’, ‘రుద్రంకోట ఇందిరా సాగర్’ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రణాళికలు రూపొందించారని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. అయితే, గత కేసీఆర్ ప్రభుత్వం రీ-డిజైనింగ్ పేరుతో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుల వ్యయాన్ని భారీగా పెంచిందని విమర్శించారు. రీ-డిజైనింగ్ నెపంతో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఏకంగా రూ. 24,000 కోట్లకు పెంచేసి ఖజానాపై అదనపు భారం మోపారని దుయ్యబట్టారు.
Also Read
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
వెనక్కి తగ్గేదే లేదు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టులపై ఇప్పటికే భారీగా నిధులు ఖర్చు చేశారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ప్రజాధనం ఇప్పటికే అధిక మొత్తంలో వ్యయం కావడం వల్ల ఇప్పుడు ఈ ప్రాజెక్టులను నిలిపివేయడం సాధ్యం కాదని, అందుకే వీటిని ఎలాగైనా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందన్నారు. సీతారామ ప్రాజెక్టులో పెండింగ్లో ఉన్న మిగిలిన పనులన్నింటినీ యుద్ధప్రతిపాదికన, అత్యంత త్వరితగతిన పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. గోదావరి జలాలను మళ్లించడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాను పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేసి రైతాంగాన్ని ఆదుకుంటామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
-
JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
-
Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
-
YS Jagan: పార్లమెంట్ వ్యూహాలపై వైసీపీ భేటీ.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం.. సర్కార్పై తీవ్ర ఆరోపణలు..
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!