Kothagudem Municipal Corporation : కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా..!
- కొత్తగూడెంలో సీపీఐ ఆధిక్యం
- మెజారిటీ లేక క్యాంపు రాజకీయాలు
- బీఆర్ఎస్ కింగ్మేకర్ పాత్ర
- రీకౌంటింగ్లతో ఉద్రిక్తత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోగా, కొత్తగూడెం కార్పొరేషన్లో మాత్రం సీపీఐ (CPI) అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇప్పటికే క్యాంపు రాజకీయాలు వేడెక్కాయి.
మొత్తం 60 డివిజన్లు ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ మిత్రపక్షాలతో కలిసి 25 స్థానాల్లో విజయం సాధించి ముందంజలో ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ 21 డివిజన్లను కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ 9 స్థానాల్లో గెలుపొంది కింగ్ మేకర్గా మారింది. బీజేపీ, సీపీఎం తలో స్థానాన్ని గెలుచుకోగా, ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. స్వతంత్రులలో ముగ్గురు ఇప్పటికే సీపీఐకి మద్దతు ప్రకటించే అవకాశం ఉండటంతో ఎర్రజెండా పీఠం ఎక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Also Read
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
IND Playing 11 vs PAK: సంజు, రింకు అవుట్.. సర్ప్రైజ్ ఎంట్రీ, పాకిస్థాన్పై ఆడే భారత్ తుది జట్టు ఇదే!
కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడానికి సీపీఐ , కాంగ్రెస్ పార్టీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. తమ అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు సీపీఐ ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. మరోవైపు, బీఆర్ఎస్ గెలిచిన 9 స్థానాలు ఇక్కడ అత్యంత కీలకం కానున్నాయి. కాంగ్రెస్తో ఉన్న విభేదాల దృష్ట్యా బీఆర్ఎస్ శ్రేణులు సీపీఐకి మద్దతు ఇచ్చే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. పాల్వంచ మున్సిపాలిటీని కొత్తగూడెంలో విలీనం చేసిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు కావడంతో ఈ విజయం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.
ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ విజయాలను నమోదు చేసింది. అయితే ఫలితాల వెల్లడి సమయంలో కొన్ని చోట్ల రీకౌంటింగ్ వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి కేవలం 3 ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయిన చోట రీకౌంటింగ్ నిర్వహిస్తూ, తమకు అవకాశం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. వైరా, సత్తుపల్లి, కల్లూరులో కూడా ఇదే తరహా వివాదాలు కొనసాగుతున్నాయి.
Miss India- Miss Universe : టాలీవుడ్ తెరపై మిస్ ఇండియా, మిస్ యూనివర్శ్, మిస్ బ్యూటీఫుల్స్
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..