Kothagudem Municipal Corporation : కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా..!
- కొత్తగూడెంలో సీపీఐ ఆధిక్యం
- మెజారిటీ లేక క్యాంపు రాజకీయాలు
- బీఆర్ఎస్ కింగ్మేకర్ పాత్ర
- రీకౌంటింగ్లతో ఉద్రిక్తత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోగా, కొత్తగూడెం కార్పొరేషన్లో మాత్రం సీపీఐ (CPI) అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇప్పటికే క్యాంపు రాజకీయాలు వేడెక్కాయి.
మొత్తం 60 డివిజన్లు ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ మిత్రపక్షాలతో కలిసి 25 స్థానాల్లో విజయం సాధించి ముందంజలో ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ 21 డివిజన్లను కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ 9 స్థానాల్లో గెలుపొంది కింగ్ మేకర్గా మారింది. బీజేపీ, సీపీఎం తలో స్థానాన్ని గెలుచుకోగా, ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. స్వతంత్రులలో ముగ్గురు ఇప్పటికే సీపీఐకి మద్దతు ప్రకటించే అవకాశం ఉండటంతో ఎర్రజెండా పీఠం ఎక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Also Read
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
- Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
IND Playing 11 vs PAK: సంజు, రింకు అవుట్.. సర్ప్రైజ్ ఎంట్రీ, పాకిస్థాన్పై ఆడే భారత్ తుది జట్టు ఇదే!
కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడానికి సీపీఐ , కాంగ్రెస్ పార్టీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. తమ అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు సీపీఐ ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. మరోవైపు, బీఆర్ఎస్ గెలిచిన 9 స్థానాలు ఇక్కడ అత్యంత కీలకం కానున్నాయి. కాంగ్రెస్తో ఉన్న విభేదాల దృష్ట్యా బీఆర్ఎస్ శ్రేణులు సీపీఐకి మద్దతు ఇచ్చే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. పాల్వంచ మున్సిపాలిటీని కొత్తగూడెంలో విలీనం చేసిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు కావడంతో ఈ విజయం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.
ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ విజయాలను నమోదు చేసింది. అయితే ఫలితాల వెల్లడి సమయంలో కొన్ని చోట్ల రీకౌంటింగ్ వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి కేవలం 3 ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయిన చోట రీకౌంటింగ్ నిర్వహిస్తూ, తమకు అవకాశం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. వైరా, సత్తుపల్లి, కల్లూరులో కూడా ఇదే తరహా వివాదాలు కొనసాగుతున్నాయి.
Miss India- Miss Universe : టాలీవుడ్ తెరపై మిస్ ఇండియా, మిస్ యూనివర్శ్, మిస్ బ్యూటీఫుల్స్
తాజావార్తలు
-
Vaibhav: అది సార్ ‘వైభవ్ సూర్యవంశీ’ అంటే.. తిట్టిన నోళ్లే జైజైలు కొట్టాయి.. ఫిదా అయిన లంక ఆటగాళ్లు..
-
Cricket Helmet History: క్రికెట్ హెల్మెట్ వెనుక ఆసక్తికర కథ.. ఎలా పుట్టిందో తెలుసా..
-
Ammonia Gas Leak : తమిళనాడులో ఘోరం.. అమ్మోనియా లీక్.. 7 మంది మృతి.!
-
Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
-
Anil Ravipudi: రక్త తిలకం దిద్దిన వెంకటేష్.. రాయలసీమ బ్యాక్డ్రాప్లో ‘అనిల్ మార్క్’ నవ్వుల వర్షం!
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!