Minister Shridhar Babu: సామాజిక పారిశ్రామికవేత్తలకు రాజధానిగా తెలంగాణను తీర్చిదిద్దుతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు. టెక్నాలజీ పరంగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సమ్మిళితమయ్యే సామాజిక ప్రభావాన్ని సృష్టించడంపై దృష్టి సారించి, సమాజానికి ఉత్తమమైన వాటిని చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు కీసర బాల వికాస క్యాంపస్లో సోషల్ స్టార్టప్ ఎక్స్పోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అరవింద్ ఐ కేర్ సిస్టమ్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేష్ ప్రజ్ఞ, బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ విష్ణురాజు, వ్యవస్థాపకుడు బాల టి.సినగరెడ్డి గింగరాస్, బాల వికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి సింగారెడ్డి, బాల వికాస సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సిబుల్ బిజినెస్ (CSRB) సీనియర్ డైరెక్టర్ రాహుల్ భరద్వాజ్ పాల్గొన్నారు.
Bihar Crisis: నితీష్కు కూటమి నేతల ఫోన్లు.. అటువైపు నుంచి ఆన్సర్ ఇదే..!
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్కు తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వం త్వరలో కొత్త ఎంఎస్ఎంఇ పాలసీని తీసుకురాబోతోందని, దీనిపై దృష్టి సారించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే సంవత్సరాల్లో తెలంగాణను సామాజిక పారిశ్రామికవేత్తల రాజధానిగా మార్చే లక్ష్యంతో సామాజిక వ్యవస్థాపకత వృద్ధిని సమగ్రపరచడంపై ప్రభుత్వం దృష్టిసారిస్తుందని మంత్రి పేర్కొన్నారు. “రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచనాత్మకంగా, సామాజిక సంక్షేమాన్ని పెంపొందించే విషయంలో కోటీశ్వరులు కావాలని తాము కోరుకుంటున్నామన్నారు. సమాజాభివృద్ధికి కట్టుబడి, అట్టడుగు స్థాయిలో సామాజిక మార్పును నడిపిస్తున్న బాల వికాస వంటి సంస్థల సహకారంతో ఇది సాధ్యమైంది” అని ఆయన అన్నారు.
KTR: ఆటో ఎక్కిన కేటీఆర్.. ఎందుకో తెలుసా..?
సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ – ఇంపల్స్ 2024, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టిఎస్ఐసి) భాగస్వామ్యంతో బాల వికాస సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సిబుల్ బిజినెస్ (సీఎస్ఆర్బి) వార్షిక ఫ్లాగ్షిప్ ఈవెంట్ నిర్వహించారు. శనివారం హైదరాబాద్ కీసరలోని బాల వికాస క్యాంపస్లో సామాజిక వ్యవస్థాపకత, రంగాన్ని బలోపేతం చేయడం పర్యావరణ వ్యవస్థకు భారీ విజయాన్ని అందించింది. టి హబ్, ఉపాయ సోషల్ వెంచర్స్, కాస్పియన్, ఇంపాక్ట్ హబ్ హైదరాబాద్ కాండిడేట్, యాక్షన్ ఫర్ ఇండియా వంటి ప్రముఖ ఇన్స్టిట్యూషన్లతో పాటు టీఎస్, కెజి రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సీబిఐటీ వంటి కీలక ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్ లీడర్లు ఈ ఈవెంట్కు మద్దతునిచ్చాయి.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!