Minister Shridhar Babu: సామాజిక పారిశ్రామికవేత్తలకు రాజధానిగా తెలంగాణను తీర్చిదిద్దుతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు. టెక్నాలజీ పరంగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సమ్మిళితమయ్యే సామాజిక ప్రభావాన్ని సృష్టించడంపై దృష్టి సారించి, సమాజానికి ఉత్తమమైన వాటిని చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు కీసర బాల వికాస క్యాంపస్లో సోషల్ స్టార్టప్ ఎక్స్పోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అరవింద్ ఐ కేర్ సిస్టమ్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేష్ ప్రజ్ఞ, బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ విష్ణురాజు, వ్యవస్థాపకుడు బాల టి.సినగరెడ్డి గింగరాస్, బాల వికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి సింగారెడ్డి, బాల వికాస సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సిబుల్ బిజినెస్ (CSRB) సీనియర్ డైరెక్టర్ రాహుల్ భరద్వాజ్ పాల్గొన్నారు.
Bihar Crisis: నితీష్కు కూటమి నేతల ఫోన్లు.. అటువైపు నుంచి ఆన్సర్ ఇదే..!
Also Read
- OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
- OTR: రాఖీతో పొలిటికల్ బంధం బలపడుతుందా..
- Ram Mohan Naidu: 'పీ4' విధానంలో శ్రీకాకుళం జిల్లాకు 'ఎ' గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్కు తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వం త్వరలో కొత్త ఎంఎస్ఎంఇ పాలసీని తీసుకురాబోతోందని, దీనిపై దృష్టి సారించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే సంవత్సరాల్లో తెలంగాణను సామాజిక పారిశ్రామికవేత్తల రాజధానిగా మార్చే లక్ష్యంతో సామాజిక వ్యవస్థాపకత వృద్ధిని సమగ్రపరచడంపై ప్రభుత్వం దృష్టిసారిస్తుందని మంత్రి పేర్కొన్నారు. “రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచనాత్మకంగా, సామాజిక సంక్షేమాన్ని పెంపొందించే విషయంలో కోటీశ్వరులు కావాలని తాము కోరుకుంటున్నామన్నారు. సమాజాభివృద్ధికి కట్టుబడి, అట్టడుగు స్థాయిలో సామాజిక మార్పును నడిపిస్తున్న బాల వికాస వంటి సంస్థల సహకారంతో ఇది సాధ్యమైంది” అని ఆయన అన్నారు.
KTR: ఆటో ఎక్కిన కేటీఆర్.. ఎందుకో తెలుసా..?
సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ – ఇంపల్స్ 2024, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టిఎస్ఐసి) భాగస్వామ్యంతో బాల వికాస సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సిబుల్ బిజినెస్ (సీఎస్ఆర్బి) వార్షిక ఫ్లాగ్షిప్ ఈవెంట్ నిర్వహించారు. శనివారం హైదరాబాద్ కీసరలోని బాల వికాస క్యాంపస్లో సామాజిక వ్యవస్థాపకత, రంగాన్ని బలోపేతం చేయడం పర్యావరణ వ్యవస్థకు భారీ విజయాన్ని అందించింది. టి హబ్, ఉపాయ సోషల్ వెంచర్స్, కాస్పియన్, ఇంపాక్ట్ హబ్ హైదరాబాద్ కాండిడేట్, యాక్షన్ ఫర్ ఇండియా వంటి ప్రముఖ ఇన్స్టిట్యూషన్లతో పాటు టీఎస్, కెజి రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సీబిఐటీ వంటి కీలక ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్ లీడర్లు ఈ ఈవెంట్కు మద్దతునిచ్చాయి.
తాజావార్తలు
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
-
OTR: రాఖీతో పొలిటికల్ బంధం బలపడుతుందా..
-
TGIIC : రాయదుర్గం భూములకు జాక్పాట్.. రూ.2,833 కోట్ల రాబడి
-
Ram Mohan Naidu: ‘పీ4’ విధానంలో శ్రీకాకుళం జిల్లాకు ‘ఎ’ గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
-
Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!