Minister Shridhar Babu: సామాజిక పారిశ్రామికవేత్తలకు రాజధానిగా తెలంగాణను తీర్చిదిద్దుతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు. టెక్నాలజీ పరంగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సమ్మిళితమయ్యే సామాజిక ప్రభావాన్ని సృష్టించడంపై దృష్టి సారించి, సమాజానికి ఉత్తమమైన వాటిని చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు కీసర బాల వికాస క్యాంపస్లో సోషల్ స్టార్టప్ ఎక్స్పోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అరవింద్ ఐ కేర్ సిస్టమ్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేష్ ప్రజ్ఞ, బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ విష్ణురాజు, వ్యవస్థాపకుడు బాల టి.సినగరెడ్డి గింగరాస్, బాల వికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి సింగారెడ్డి, బాల వికాస సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సిబుల్ బిజినెస్ (CSRB) సీనియర్ డైరెక్టర్ రాహుల్ భరద్వాజ్ పాల్గొన్నారు.
Bihar Crisis: నితీష్కు కూటమి నేతల ఫోన్లు.. అటువైపు నుంచి ఆన్సర్ ఇదే..!
Also Read
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
- Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
- Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్కు తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వం త్వరలో కొత్త ఎంఎస్ఎంఇ పాలసీని తీసుకురాబోతోందని, దీనిపై దృష్టి సారించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే సంవత్సరాల్లో తెలంగాణను సామాజిక పారిశ్రామికవేత్తల రాజధానిగా మార్చే లక్ష్యంతో సామాజిక వ్యవస్థాపకత వృద్ధిని సమగ్రపరచడంపై ప్రభుత్వం దృష్టిసారిస్తుందని మంత్రి పేర్కొన్నారు. “రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచనాత్మకంగా, సామాజిక సంక్షేమాన్ని పెంపొందించే విషయంలో కోటీశ్వరులు కావాలని తాము కోరుకుంటున్నామన్నారు. సమాజాభివృద్ధికి కట్టుబడి, అట్టడుగు స్థాయిలో సామాజిక మార్పును నడిపిస్తున్న బాల వికాస వంటి సంస్థల సహకారంతో ఇది సాధ్యమైంది” అని ఆయన అన్నారు.
KTR: ఆటో ఎక్కిన కేటీఆర్.. ఎందుకో తెలుసా..?
సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ – ఇంపల్స్ 2024, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టిఎస్ఐసి) భాగస్వామ్యంతో బాల వికాస సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సిబుల్ బిజినెస్ (సీఎస్ఆర్బి) వార్షిక ఫ్లాగ్షిప్ ఈవెంట్ నిర్వహించారు. శనివారం హైదరాబాద్ కీసరలోని బాల వికాస క్యాంపస్లో సామాజిక వ్యవస్థాపకత, రంగాన్ని బలోపేతం చేయడం పర్యావరణ వ్యవస్థకు భారీ విజయాన్ని అందించింది. టి హబ్, ఉపాయ సోషల్ వెంచర్స్, కాస్పియన్, ఇంపాక్ట్ హబ్ హైదరాబాద్ కాండిడేట్, యాక్షన్ ఫర్ ఇండియా వంటి ప్రముఖ ఇన్స్టిట్యూషన్లతో పాటు టీఎస్, కెజి రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సీబిఐటీ వంటి కీలక ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్ లీడర్లు ఈ ఈవెంట్కు మద్దతునిచ్చాయి.
తాజావార్తలు
-
Saroj Khan: మాధురీని ఉదాహరణగా చూపిస్తూ.. కరిష్మాపై ఫైర్ అయిన సరోజ్ ఖాన్..
-
Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. సీఎస్కే, ఎంఐ కాదు టాప్లో కేకేఆర్!
-
Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?