Minister Shridhar Babu: సామాజిక పారిశ్రామికవేత్తలకు రాజధానిగా తెలంగాణను తీర్చిదిద్దుతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు. టెక్నాలజీ పరంగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సమ్మిళితమయ్యే సామాజిక ప్రభావాన్ని సృష్టించడంపై దృష్టి సారించి, సమాజానికి ఉత్తమమైన వాటిని చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు కీసర బాల వికాస క్యాంపస్లో సోషల్ స్టార్టప్ ఎక్స్పోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అరవింద్ ఐ కేర్ సిస్టమ్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేష్ ప్రజ్ఞ, బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ విష్ణురాజు, వ్యవస్థాపకుడు బాల టి.సినగరెడ్డి గింగరాస్, బాల వికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి సింగారెడ్డి, బాల వికాస సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సిబుల్ బిజినెస్ (CSRB) సీనియర్ డైరెక్టర్ రాహుల్ భరద్వాజ్ పాల్గొన్నారు.
Bihar Crisis: నితీష్కు కూటమి నేతల ఫోన్లు.. అటువైపు నుంచి ఆన్సర్ ఇదే..!
Also Read
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్కు తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వం త్వరలో కొత్త ఎంఎస్ఎంఇ పాలసీని తీసుకురాబోతోందని, దీనిపై దృష్టి సారించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే సంవత్సరాల్లో తెలంగాణను సామాజిక పారిశ్రామికవేత్తల రాజధానిగా మార్చే లక్ష్యంతో సామాజిక వ్యవస్థాపకత వృద్ధిని సమగ్రపరచడంపై ప్రభుత్వం దృష్టిసారిస్తుందని మంత్రి పేర్కొన్నారు. “రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచనాత్మకంగా, సామాజిక సంక్షేమాన్ని పెంపొందించే విషయంలో కోటీశ్వరులు కావాలని తాము కోరుకుంటున్నామన్నారు. సమాజాభివృద్ధికి కట్టుబడి, అట్టడుగు స్థాయిలో సామాజిక మార్పును నడిపిస్తున్న బాల వికాస వంటి సంస్థల సహకారంతో ఇది సాధ్యమైంది” అని ఆయన అన్నారు.
KTR: ఆటో ఎక్కిన కేటీఆర్.. ఎందుకో తెలుసా..?
సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ – ఇంపల్స్ 2024, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టిఎస్ఐసి) భాగస్వామ్యంతో బాల వికాస సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సిబుల్ బిజినెస్ (సీఎస్ఆర్బి) వార్షిక ఫ్లాగ్షిప్ ఈవెంట్ నిర్వహించారు. శనివారం హైదరాబాద్ కీసరలోని బాల వికాస క్యాంపస్లో సామాజిక వ్యవస్థాపకత, రంగాన్ని బలోపేతం చేయడం పర్యావరణ వ్యవస్థకు భారీ విజయాన్ని అందించింది. టి హబ్, ఉపాయ సోషల్ వెంచర్స్, కాస్పియన్, ఇంపాక్ట్ హబ్ హైదరాబాద్ కాండిడేట్, యాక్షన్ ఫర్ ఇండియా వంటి ప్రముఖ ఇన్స్టిట్యూషన్లతో పాటు టీఎస్, కెజి రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సీబిఐటీ వంటి కీలక ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్ లీడర్లు ఈ ఈవెంట్కు మద్దతునిచ్చాయి.
తాజావార్తలు
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!