Minister KTR : దుబ్బాకలో ఈ సారి రఘునందన్ రావు ఇంటికే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దుబ్బాకలో ఈ సారి రఘునందన్ రావు ఇంటికేనని ఆయన వ్యాఖ్యానించారు. రఘునందన్ రావుని లుచ్చా మాటలు అని ఆయన ఆరోపించారు. నిరుద్యోగికి 3 వేల నిరుద్యోగి భృతి అన్నాడు ఇచ్చాడా అని ఆయన ప్రశ్నించారు. దుబ్బాకకి ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు తెచ్చాడా.. ఇంత బఫున్, జోకర్ మాటలు నమ్ముతారా అని మంత్రి కేటీఆర్ అన్నారు. అసైన్డ్ భూములు ఉన్న వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని, దొంగ మాటలు, మాయ చేసి ఓ వెయ్యి ఓట్లతో ఉప ఎన్నికలో గెలిచాడన్నారు మంత్రి కేటీఆర్. దుబ్బాక ఎన్నిక తెలంగాణ తలరాతను మారుస్తుందని, కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు…పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు అని ఆయన అన్నారు.
Also Read : Atchannaidu: మత్స్యకారుల బతుకుల్ని ఆగం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే సొంతం..
Also Read
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
- 10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
అంతేకాకుండా..’24 గంటల కరెంట్ ఎక్కడుందో చూపించు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్, కాంగ్రెస్ నాయకులు కరెంట్ వైర్లని గట్టిగా పట్టుకోండి. కరెంట్ ఉందొ లేదో తెలుస్తుంది… పీడ పోతుంది. తెలంగాణ లో పేద రైతులు ఉన్నారు…మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారు. ఎద్దు తెలియదు, వ్యవసాయం తెలియదు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి. పబ్బు తెలుసు, గబ్బు తెలుసు వీళ్లకు. కాంగ్రెస్ లో రేవంత్ మూడు గంటల కరెంట్ చాలు అంటాడు. భట్టి ధరణి రద్దు చేస్తాం అంటాడు. ఉత్తమ్ రైతు బంధు దండగ అంటాడు. ఇక్కడున్న ఎమ్మెల్యే ఒర్రుబోతు..టీవీలలో కూర్చొని ఒకటే ఒర్రుతాడు. కాంగ్రెస్ వాళ్ళకి కర్ణాటక నుంచి డబ్బులు వస్తున్నాయి. గుజరాత్ నుంచి బిజెపి వాళ్లకి డబ్బులు వస్తున్నాయి. తెలంగాణాని ఢిల్లీ గద్దల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ, అమిత్ షా, యోగి భోగి వెనుక 15 కేంద్రమంత్రులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే, డీకే, సిద్ధ రామయ్య అందరూ బయలు దేరారు. ఎవరు వచ్చినా సింహం సింగిల్ గా వస్తుంది. ఎవడో కాంగ్రెస్ కార్యకర్త ప్రభాకర్ అన్నను కత్తితో పొడిచాడు. మనం ఓటు అనే ఆయుధంతో వాళ్ళకి పోటు పొడవాలి. గాడిదలకు గడ్డి వేసి అవులకు పాలు పిండితే వస్తుందా.’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read : Neha sharma : బీచ్ లో సందడి చేస్తున్న బర్త్డే బ్యూటీ నేహా శర్మ..
తాజావార్తలు
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?