Minister KTR : 70 లక్షల రైతులు రైతుబంధు అందుకుంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రం రాకముందు వేములవాడ ఎట్లా ఉండే ఇప్పుడు మీరు చూడండన్నారు. తొమ్మిదన్నర ఏళ్లలో రెండేళ్లు కరోనాకి పోయింది ఏడాది ఎన్నికలకు పోయిందన్నారు. ఆరున్నర సంవత్సరాలలో కేసీఆర్ ఏం చేశాడో మీ కళ్ళ ముందు ఉందన్నారు. మీ ఇంటి కుటుంబ సభ్యులతోనే ఆలోచన చేయండన్నారు. కేసీఆర్ సీఎం కాకముందు వేములవాడలో కరెంటు ఎట్లా ఉందన్నారు.. ఈరోజు గోదావరి జలాలు ఇచ్చిన తర్వాత పుట్లకు పుట్లు వడ్లు పండుతున్నాయన్నారు మంత్రి కేటీఆర్. 2014 ముందు ఏం పథకాలు ఉన్నాయి సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం పథకాలు ఉన్నాయి ఆడబిడ్డలు ఆలోచించాలన్నారు. కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతి ఆడబిడ్డకు లక్ష 16 రూపాయలను కళ్యాణ షాదీ ముబారక్ ఇస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. సర్కార్ దావకానకు మేము రాను అనే పరిస్థితులు పోయి… వంద పడక ఆసుపత్రి తిప్పాపూర్ లో ఏర్పాటు చేసాం… పేదలకు కాన్పులు చేస్తూ వైద్య సేవ అందుబాటులోకి రావడం మాకు ఆనందంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్.
అంతేకాకుండా..’70 లక్షల రైతులు రైతుబంధు అందుకుంటున్నారు. 13 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చాం. 11 ఛాన్స్ ఇస్తే 55 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు. మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని ఇప్పుడు వస్తున్నారు.. విద్య బాగయింది, వైద్యం బాగైంది, సంక్షేమం అందింది, సాగునీరు అందింది… అయినా కేసీఆర్ ఏం చేయలేదని అబద్ధాలు మాట్లాడుతున్నారు. తెల్ల రేషన్ కార్డును ప్రతి ఒక్కరికి అన్నపూర్ణ పథకం ద్వారా సన్న బియ్యం ఇస్తాం. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యాక… 18 సంవత్సరాల నిండిన యువతులకు 3000 రూపాయలు ఇస్తాం. పెన్షన్ 5000 రూపాయలు ఇస్తాం. మన్మోహన్ సింగ్ నీతో ఐతలేదని ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు 1200 చేశాడు సిలిండర్. హనుమంతుని గుడి లేని ఊరు లేదు… కెసిఆర్ సంక్షేమం అందని ఇల్లు లేదు. బంతి భోజనంలో ఉన్నవారికి అన్ని అందినట్లుగానే దళిత బంధు, బీసీ బందు లాంటి అనేక సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తాం. 55 ఏళ్లు ఒక రూపాయి కూడా గుడికి ఇవ్వలేదు. రాజన్న గుడి వేములవాడ పట్టణం అభివృద్ధి మా బాధ్యత. వేములవాడ గోదావరి జిలాల ను గుడి చెరువులోకి కూడా తీసుకువచ్చాం. 1965 ఒక తప్పు చేసినం… బలవంతం లగ్గం లోకి బయటకు రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. మరోసారి వాళ్లకు అవకాశం ఇవ్వకుండా మీరు ఆలోచించాలి.’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read
- Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
- Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
తాజావార్తలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!