Minister Amarnath: మేం దేనికైనా సిద్దం.. కలిసి వస్తున్న పార్టీలను ఎదుర్కొనేందుకు సిద్దం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భీమిలీలో వైసీపీ పార్టీ నిర్వహిస్తున్న ఎన్నికల శంఖారావం సిద్ధం బహిరంగ సభ దగ్గర ఎన్టీవీతో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. మేం దేనికైనా సిద్దం.. అభివృద్ధి చూపించేందుకు సిద్దం.. కలిసి వస్తున్న రాజకీయ పార్టీలను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. వైనాట్ 175 నినాధం మొదటి నుంచి వినిపిస్తున్నాం.. నేడు అదే నినాధంతో సిద్దమౌతున్నాను అని ఆయన వెల్లడించారు. రెండు సీట్లు టీడీపీ ప్రకటిస్తే, రెండు జనసేన ప్రకటించింది.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చెరో 175 సీట్లు చొప్పున ప్రకటిస్తే ఏ గొడవ ఉండదు కదా అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. చంద్రబాబుకు ఏ ధర్మం లేదు.. ధర్మానికి అర్దం తెలియదన్నారు. ప్రజల మద్దతుతో ముందుకు వెళ్తాం.. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో లేదు.. రాష్ర్టంలో లేని పార్టీకి అధ్యక్షుడు దానికి తిరిగి సమాదానం చెప్పడం అవసరం లేదన్నారు. ఎవరు ఎక్కడ నుంచి పొటీ చేసినా జగన్ ను చూసి ఓటు వేస్తారు.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అని ఆయన వెల్లడించారు.
Read Also: Ration Card E- KYC: రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు.. మరో నాలుగు రోజులే ఛాన్స్..
Also Read
ఇక, ఎన్టీవీతో ఉత్తరాంధ్ర ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. నాలుగున్నర ఏండ్లలో ఏం చెసామో అది చెప్పి అదరించాలని కోరనున్నాం.. ఎంత మంది ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మాకు జగన్ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అయువుపట్టు అని పేర్కొన్నారు. మాకు ఏ స్టార్ క్యాంపెయినర్ అవసరం లేదు.. ప్రజలు కార్యకర్తలే జగన్ ప్రభుత్వానికి ఆశీర్వదిస్తారు అని ఆయన తెలిపారు. మా భరోసా కూడా అదే.. ఇంకా కూడా నాలుగైదు చోట్ల మార్పులు చేర్పులు ఉంటాయి.. ఎక్కడ పార్టీ పరిస్థితి లోకల్ నాయకత్వం బాలేకుంటే మార్పులు తప్పవు.. 175కి 175 సాధించాలని అనుకుంటున్నాం.. నాయకులు, కార్యకర్తలలో ఎలాంటి అసమ్మతి లేదు అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!