Ration Card E- KYC: రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు.. మరో నాలుగు రోజులే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ration Card E- KYC: తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు కూడా దగ్గర పడుతోంది. ఇక మిగిలింది నాలుగు రోజులు మాత్రమే. జనవరి 31తో గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఎవరైనా ఈకేవైసీ అప్డేట్ చేయకపోతే వెంటనే చేయాలని అధికారులు సూచిస్తున్నారు. మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. గత రెండు నెలలుగా రేషన్ షాపుల్లో E-KYC అప్డేట్ చేయబడుతోంది. KYC అప్డేట్ కోసం ఆధార్ ధృవీకరణ మరియు వేలిముద్రలు సేకరిస్తున్నారు. రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం కాకపోతే వెంటనే చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ-కేవైసీ పూర్తి కాకపోతే రేషన్ సరుకులను తగ్గించే అవకాశం ఉంది. దీంతో రేషన్ లబ్ధిదారులు జనవరి 31లోగా తమ రేషన్ కార్డు, ఆధార్ నంబర్ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది.
Read also: Emmanuel Macron: హెలికాప్టర్లు, జెట్ ఇంజన్ల నుంచి అంతరిక్షం వరకు… భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందాలివే
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తోంది. కానీ బోగస్ రేషన్ కార్డులను ఆధార్ నంబర్తో రేషన్ కార్డుతో అనుసంధానం చేయాలని ఎరివేత సంస్థ నిర్ణయించింది. దీనికి కారణాలు లేకపోలేదు. చాలా పాత కార్డుల్లో చనిపోయిన వారి పేర్లే ఉన్నాయి. దీంతో రేషన్ సరుకులు పక్కదారి పడుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఈకేవైసీ ప్రక్రియను తెరపైకి తెచ్చారు. కుటుంబంలో చాలా మంది లబ్ధిదారులు ఉంటే, వారందరూ EKYC చేయాలి. మరోవైపు కొత్త రేషన్ కార్డుల ఆమోదానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నారు. కానీ EKYC పూర్తయిన తర్వాత… లబ్ధిదారుల విషయంలో మరింత స్పష్టత రానుంది. ఈ డేటాను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితే… కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ వేగవంతం కానుంది.
Read also: Dharani Committee: సచివాలయంలో మరోసారి ధరణి కమిటీ సమావేశం.. పలు సమస్యలపై చర్చ
KYCని ఎలా అప్డేట్ చేయాలి?
* రేషన్ కార్డ్ KYCని అప్డేట్ చేయడానికి, రేషన్ కార్డు యొక్క కుటుంబ సభ్యులందరితో పాటు కుటుంబ యజమాని రేషన్ దుకాణానికి వెళ్లి వారి వేలిముద్రలను ఈ పాస్ మిషన్లో వేయాలి.
* విడివిడిగా రేషన్కార్డు దుకాణానికి వెళితే ప్రాసెస్ చేయలేరు.
* వేలిముద్రలు తీసుకున్న తర్వాత ఈ-పాస్పై లబ్ధిదారుడి ఆధార్ కార్డు నంబర్, రేషన్ కార్డు నంబర్ డిస్ప్లే అవుతుంది.
* ఇ-పాస్ మిషన్లో, గ్రీన్ లైట్ వస్తుంది మరియు EKYC అని వస్తుంది.
* ఒకవేళ రెడ్ లైట్ ఆన్లో ఉంటే లబ్దిదారుడి రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు సరిపోలడం లేదని అర్థం. దీంతో ఆ రేషన్ కార్డును తొలగిస్తారు.
* రేషన్ కార్డులో పేర్లు ఉన్న వారందరూ ఒకేసారి EKYC అప్డేట్ చేసుకోవాలి.
BC Janardhan Reddy: బనగానపల్లె జయహో బీసీ కార్యక్రమంలో వైసీపీపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి ఫైర్..!
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!