Chiranjeevi For Pawan Kalyan: రంగంలోకి మెగాస్టార్.. పవన్ను గెలిపించండి..
Chiranjeevi For Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.. అయితే, మెగా ఫ్యామిలీ హీరోలు, బుల్లితెర, వెండితెర నటీనటులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.. ఇక, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం తమ్ముడి కోసం రంగంలోకి దిగారు.. తన గురించి కంటే.. జనం గురించే ఎక్కవగా ఆలోచించే తన తమ్ముడు పవన్ కల్యాణ్ను గెలిపించాలని కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు.. తన వీడియోను ట్విట్టర్ (ఎక్స్) ద్వారా వదిలారు చిరంజీవి..
Read Also: PM Modi: ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని సహించబోం.. కర్ణాటక సర్కారుపై ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
జనమే జయం అని నమ్మే జనసేనానిని గెలిపించండి.. అమ్మ కడుపున ఆఖరివాడు.. అందరికి మేలు కోరే విషయంలో మొదటి వాడు.. నా తమ్ముడు పవన్ కల్యాణ్.. తన గురించి కంటే.. జనం గురించే ఎక్కువ ఆలోచిస్తాడు అని పేర్కొన్నారు చిరంజీవి.. అధికారంలోకి రాక ముందే తన సొంత సొమ్ముతో కౌలు రైతులకు సాయం చేశాడు.. జవాన్లకు అండగా నిలిచాడని గుర్తుచేసిన ఆయన.. పవన్ లాంటి నాయకుడే కావాలని సూచించారు. ఇక, పవన్ సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడు.. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చాడని తెలిపారు చిరంజీవి.. పవన్ ఎంతో మందితో మాటలు పడుతుంటే మా అమ్మ బాధ పడుతోంది.. అన్నగా నేనూ బాధ పడుతున్నాను. ఎంతో మంది తల్లుల గురించి పవన్ పోరాటం చేస్తున్నాడు.. బాధ పడొద్దని మా అమ్మకు చెప్పాను అన్నారు..
Read Also: NBK 109: బాలయ్య సినిమా యూకే రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్..
ఇక, అన్యాయాన్ని చూస్తూ ఊరుకుంటే మంచిది కాదని జనం కోసం పవన్ జన సైనికుడయ్యాడన్నారు మెగాస్టార్.. ప్రజల బాగు కోసం పవన్ గొంతు చట్ట సభల్లో వినపడాలన్న ఆయన.. పిఠాపురం ప్రజలు పవన్ కల్యాణ్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.. ప్రజల కోసం సేవకుడిగా.. సైనికుడిగా పవన్ నిలబడతాడు.. అవసరమైతే కలబడతాడు. పవన్ను గెలిపించండి అని ఆ వీడియో ద్వారా కోరారు మెగాస్టార్ చిరంజీవి.. కాగా, ఇప్పటికే పవన్ కల్యాణ్ తరపున పిఠాపురంలో మెగా బ్రదర్ నాగబాబు, ఆయన కుమారుడు వరుణ్ తేజ్, అల్లుడు సాయి ధరమ్ తేజ్తో పాటు.. బుల్లితెర, వెండి తెర నటులు ప్రచారం నిర్వహిస్తోన్న విషయం విదితమే.
జనమే జయం అని నమ్మే జనసేనాని ని గెలిపించండి. pic.twitter.com/zifXEqt30t
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 7, 2024
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!