UP: మాయావతి దిద్దుబాటు చర్యలు.. వారసుడిగా తిరిగి మేనల్లుడు నియామకం
- మాయావతి దిద్దుబాటు చర్యలు
- వారసుడిగా తిరిగి మేనల్లుడు ఆకాష్ నియామకం
- మే నెలలో తొలగింపు.. జూన్లో తిరిగి నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఎస్పీ అధినేత మాయావతి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మే నెలలో తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను తొలగించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ విమర్శలు శృతిమించడంతో ఈ చర్యలు చేపట్టారు. తాజాగా ఆ చర్యను సవరించారు. తిరిగి రాజకీయ వారసుడిగా ఆకాష్నే నియమించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలను సమీక్షించేందుకు పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్, మేనల్లుడు ఆకాష్ ఆనంద్తో కలిసి ఉన్నారు.
ఇది కూడా చదవండి: Old AC Tips: మీరు పాత ఏసీని వాడుతున్నారా?.. దానిని ఎప్పుడు మార్చాలో తెలుసుకోండి..
Also Read
- Kodali Nani: కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు.!
- CM Revanth Reddy : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్
- Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ 'బ్రెడ్ పకోడా'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- IND vs ENG: సిక్సర్ల వేటలో జోస్ బట్లర్కు సవాల్ విసురుతున్న అభిషేక్ శర్మ.. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే!
ఈ ఏడాది మేలో ఆకాష్ ఆనంద్ను జాతీయ కోఆర్డినేటర్ పదవి నుంచి, ఆమె వారసుడిగా తొలగించారు. మాయావతి తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. రాజకీయ పరిపక్వత వచ్చే వరకు ఆకాష్ను పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ఎక్స్లో రాశారు. మళ్లీ ఇన్ని రోజులకు అదే పదవిలో మేనల్లుడ్ని నియమించారు.
2019లో సమాజ్వాదీ పార్టీతో మాయావతి పార్టీ తెగతెంపులు చేసుకుంది. పార్టీని పునర్వ్యవస్థీకరించడంతో పాటు ఆకాష్ ఆనంద్ను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా నియమించారు. గత ఏడాది డిసెంబర్లో మాయావతి వారసుడిగా ఆకాష్ ఆనంద్ను ఎంపిక చేశారు. అయితే లోక్సభ ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినందుకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించినందుకు ఆకాష్ ఆనంద్పై కేసు నమోదైంది. ‘‘ఈ ప్రభుత్వం బుల్డోజర్ ప్రభుత్వం మరియు దేశద్రోహుల ప్రభుత్వం. తన యువతను ఆకలితో వదిలి, వృద్ధులను బానిసలుగా మార్చే పార్టీ ఉగ్రవాద ప్రభుత్వం. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అలాంటి ప్రభుత్వాన్ని నడుపుతోంది’’ అని ఆకాష్ అన్నారు. ఈ పరిణామంతో ఆకాష్పై మాయావతి వేటు వేశారు.
ఇది కూడా చదవండి: AP Speaker: దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
2019 సార్వత్రిక ఎన్నికల్లో 10 లోక్సభ స్థానాలను గెలుచుకున్న మాయావతి.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయింది. ఆమె మాజీ మిత్రపక్షం, అఖిలేష్ యాదవ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ 37 లోక్సభ స్థానాలను గెలుచుకుని ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఇది కూడా చదవండి: Maoists: మావోయిస్టులు నకిలీ కరెన్సీని ముద్రిస్తున్నారా..? ఆపరేషన్లో కీలక ఆధారాలు..
తాజావార్తలు
-
Kodali Nani: కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు.!
-
CM Revanth Reddy : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IND vs ENG: సిక్సర్ల వేటలో జోస్ బట్లర్కు సవాల్ విసురుతున్న అభిషేక్ శర్మ.. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే!
-
Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
ట్రెండింగ్
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!