Maoists: మావోయిస్టులు నకిలీ కరెన్సీని ముద్రిస్తున్నారా..? ఆపరేషన్లో కీలక ఆధారాలు..
- నకిలీ కరెన్సీని ముద్రిస్తున్నా మావోయిస్టులు..
- ఛత్తీస్గఢ్ ఆపరేషన్లో కీలక ఆధారాలు..
- సుక్మాలో పట్టుబడిన ఇంక్- ఫేక్ కరెన్సీ..
- నగదు కొరతతోనే ఫేక్ కరెన్సీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు నకిలీ కరెన్సీని ముద్రిస్తున్నారా..? అంటే ఔననే సమాధానాలే వినిపిస్తు్న్నాయి. తాజాగా భద్రతా బలగాలు జరిపిన ఆపరేషన్లో ఇందుకు సంబంధించిన సామాగ్రి పట్టుబడటం కలకలం రేపింది. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో నకిలీ కరెన్సీని ముద్రించేందుకు ఉపయోగించే పరికరాలను తొలిసారిగా భద్రతా బలగాలు కనిపెట్టాయి. స్థానిక మార్కెట్లో ఈ విషయం ప్రభావం చూపిస్తుందని ఆందోలన వ్యక్తం చేశారు.
Read Also: Police: మహిళా కానిస్టేబుల్తో హోటల్ గదిలో పట్టుబడిన డీఎస్పీ.. కానిస్టేబుల్గా డిమోషన్..
Also Read
- West Bengal: బెంగాల్లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం
- DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
- CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
కొరాజ్గూడ అడవుల్లో సుక్మా పోలీసుల, జిల్లా రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ జరిపిన సెర్చ్ ఆపరేషన్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టులు అడవుల్లో నకిలీ కరెన్సీని ముద్రిస్తున్నారనే నిఘా సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ జరిగింది. మావోయిస్టులు తప్పించుకున్నప్పటికీ, భద్రతా దళాలు కరెన్సీ ప్రింటింగ్ మిషన్లు, ఇంక్, టెంప్లేట్లతో పాటు రూ.50, రూ. 100, రూ. 200, రూ.500 విలువ కలిగిన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. తుపాకీ, వైర్లెస్ సెట్, భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు లభించాయి.
ఇటీవల కాలంలో దండకారణ్యంలో భద్రతా కార్యకలాపాలు ఎక్కువ కావడంతో మావోయిస్టులు నగదు కొరతను ఎదుర్కొంటున్నట్లు అనుమానిస్తు్న్నారు. దీంతోనే వారు నకిలీ కరెన్సీని ముద్రించాల్సి వస్తోందని జిల్లా పోలీస్ చీఫ్ కిరణ్ చవాన్ వివరించారు. మావోయిస్టులు తరుచుగా వారసంత, గ్రామాల్లోని మార్కెట్లలో సామాగ్రిని కొనుగోలు చేస్తారు. వీటిలో నకిలీ కరెన్సీని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇది స్థానిక మార్కెట్లను అస్థిరపరచొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని వారు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ కరెన్సీని తిరస్కరించాలని అధికారులు కోరారు. 2022 నుంచి మావోలు నగదు కొరతను తీర్చుకునేందుకు కరెన్సీని ముద్రిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి. ప్రతీ ఏరియా కమిటీలో ఒక సభ్యుడు నకిలీ కరెన్సీని ముద్రించేలా శిక్షణ పొందారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Chiru – Bobby Movie: ‘చిరు 158’లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ‘జైలర్’ డీవోపీ!
-
West Bengal: బెంగాల్లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం
-
Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది చూసేయండి!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..