KTR: నయవంచన, మోసం అనే పదాలు కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ..
- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
- కాంగ్రెస్ పార్టీ అంటే నయవంచన, మోసంకు పర్యాయపదం అని రుజువు అయింది
- జనవరి 26న రైతు భరోసా పేరుతో మోసం చేయడానికి సిద్ధం అవుతుంది- కేటీఆర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. తాము అనుమానించినట్లు గానే కాంగ్రెస్ పార్టీ అంటే నయవంచన, మోసంకు పర్యాయపదం అని రుజువు అయిందని అన్నారు. జనవరి 26న రైతు భరోసా పేరుతో మోసం చేయడానికి సిద్ధం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. ఎన్నికలకు ఆర్నెళ్లకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు హామీ ఇచ్చింది.. భూయజమానులకు, కౌలు రైతులకు రైతు భరోసాం ఇస్తాం అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారన్నారు. మీరు పదివేలు బిచ్చం వేస్తే మేము పదిహేను వేలు ఇస్తాం అన్నారని చెప్పారు.
Read Also: Andhra Pradesh: న్యూమో వైరస్ గురించి భయాందోళనలు అవసరం లేదు..
Also Read
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
ఇదే మాటను ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ వరంగల్లో చెప్పారని కేటీఆర్ తెలిపారు. పదిహేను వేలు ఎకరానికి ఇస్తాం అని చెప్పి.. పన్నెండు వేలు ఇస్తాం అని నయవంచన చేశారని దుయ్యబట్టారు. ఇలా చేసే తెలంగాణ రైతులను మోసం చేశారు.. నయవంచన, మోసం అనే పదాలు కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ అని విమర్శించారు. రేవంత్ రెడ్డి రైతుల పాలిట రాబందుగా మిగిలి పోతారని కేటీఆర్ తెలిపారు. ఓడ దాటేదాక ఓడ మల్లన్న.. దాటిన తర్వాత బోడ మల్లన్న అనేది కాంగ్రెస్ పార్టీ నైజం అని మరోసారి నిజమైందని ఆరోపించారు.
Read Also: AP Crime: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. గర్భవతైన మైనర్ బాలిక!
ఆరు గ్యారంటీలు అమలు అయ్యే వరకు వెంటబడతాం.. కాంగ్రెస్ నేతలు ఎక్కడ కనబడినా రైతులు నిలదీయాలని కేటీఆర్ తెలిపారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పిలుపు ఇస్తున్నాం.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో నిరసనలు చేస్తామని అన్నారు. రైతులకు సపోర్ట్గా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపు ఇస్తుందని చెప్పారు. జనవరి 26 వరకు చూసి ఉద్యమం ఉధృతం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల గండం తప్పించుకోవడానికి ఇప్పుడు ఇస్తాం అంటున్నారు.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పూర్తిగా ఈ రైతు భరోసా ఆపేస్తారని వెల్లడించారు. ఈ ప్రభుత్వం మీద తమకు నమ్మకం లేదని కేటీఆర్ అన్నారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేయబోతోందని చెప్పారు.
తాజావార్తలు
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!