2000 Note : రూ.2వేల నోటు రద్దు..షేర్ మార్కెట్పై ఎంత ప్రభావం చూపుతుంది ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2000 Note : సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2000 రూపాయల నోటును రద్దు చేసింది. ఈ పింక్ నోటుపై గతేడాది నుంచి పుకార్లు మొదలయ్యాయి. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఈ పుకార్లకు స్వస్తి పలికింది. 19 మే 2023న, శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా రూ.2000 నోటును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 2000 రూపాయల నోట్ల మార్పిడి మే 23 నుంచి ప్రారంభం కానుంది. పౌరులు మళ్లీ బ్యాంకుల ముందు గుమిగూడారు. పౌరులు ఒకేసారి 2000 రూపాయల 10 నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు. అయితే ఈ డీమోనిటైజేషన్ షేర్ మార్కెట్పై ఎంత ప్రభావం చూపుతుంది, పెట్టుబడిదారులను ప్రభావితం చేయవచ్చా? దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.. నిపుణులు ఏమంటున్నారంటే..
నోట్ల రద్దు తర్వాత 2017లో ఆర్బీఐ రూ.2000 నోటును ప్రవేశపెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ ప్రింటింగ్ అథారిటీ లిమిటెడ్ నోట్ల రద్దుకు కొన్ని నెలల ముందు రూ.2000 నోట్లను ముద్రించడం ప్రారంభించింది. ఆ సమయంలో 500 రూపాయల నోటు ఇంకా ముద్రించలేదు.
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
Read Also: Vishnu Kumar Raju: రూ.2 వేల నోట్ల ఉపసంహరణతో వారికి మాత్రమే నష్టం..!
127 రోజుల్లో 26 లక్షలు
RBI సర్క్యులర్ ప్రకారం..రూ 2000 నోట్లను 23 మే 2023 నుండి 30 సెప్టెంబర్ 2023 వరకు మార్చుకోవచ్చు. ఈ పరిమితి ఒక రోజులో 20 వేల రూపాయల వరకు ఉంటుంది. అంటే పౌరులు 127 రోజుల్లో 25,40,000 రూపాయలు డిపాజిట్ చేయవచ్చు.
ప్రస్తుతం ఎన్ని నోట్లు ఉన్నాయంటే..
తాజా సర్క్యూలర్ ప్రకారం రూ.2000 నోట్లు కలిగి ఉన్న వ్యక్తులు సెప్టెంబరు 30 లోగా వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంక్ డేటా ప్రకారం మార్చి 31,2018 నాటికి రూ.6.73 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఇది మొత్తం విడుదలైన నోట్లలో 37.3 శాతం. అయితే మార్చి 31, 2023 నాటికి రూ.2000 నోట్ల వాటా 10.8 శాతానికి తగ్గింది. పైగా ఇవి చలామణిలో నిరంతరం తగ్గుతూనే ఉన్నాయి. నోట్ల మార్పిడికి చాలా కాలం గడువు ఇచ్చారు. బ్యాంకులు, వాణిజ్య బ్రోకరేజీ కేంద్రాలలో కూడా నోట్లను మార్చుకోవచ్చు.
Read Also:2000 Notes Ban: రూ. 2వేల నోట్లు రద్దు.. బంగారం దుకాణాల్లో పెరిగిన రద్దీ
స్టాక్ మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
నోట్ల రద్దు ప్రభావం అన్ని రంగాలపై ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. దీంతో స్టాక్ మార్కెట్పై ఎలాంటి ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్ లావాదేవీలు ఆన్లైన్లో జరుగుతాయి. అందువల్ల మార్కెట్ లో గులాబీ నోటు ప్రభావం కనిపించదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇన్వెస్టర్ల వద్ద ఎక్కువ మొత్తంలో ఈ నోట్లు ఉంటే వారిపై ప్రభావం చూపుతుంది. నల్లధనం పెద్ద మొత్తంలో పోగుపడితే అలాంటి పెట్టుబడిదారులు మార్కెట్కు దూరంగా ఉండవచ్చు.
2016లో పరిస్థితి వేరు
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 2016లో స్టాక్ మార్కెట్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఆ సమయంలో నగదు లావాదేవీలు కూడా జరిగేవి. అలాగే చాలా కాలం తర్వాత.. ఈ డీమోనిటైజేషన్ విషయం జరగడంతో ప్రజలు షాక్ అయ్యారు. దీని ప్రభావం అప్పట్లో స్టాక్ మార్కెట్పై కూడా కనిపించింది. కానీ ఈసారి స్టాక్ మార్కెట్ వెంటనే స్పందించడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు సోమవారం రెండు రోజులు గడిచినా మార్కెట్పై ప్రత్యేక ప్రభావం ఉండదనే వాదన వినిపిస్తోంది.
Read Also:Rs 2000 notes withdrawn: రూ.2 వేల నోట్లపై కొత్త టెన్షన్.. బ్యాంకులో వేస్తే ఐటీ వాళ్లు పట్టుకుంటారా?
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!