2000 Notes Ban: రూ. 2వేల నోట్లు రద్దు.. బంగారం దుకాణాల్లో పెరిగిన రద్దీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2000 Notes Ban: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేల నోటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకుల్లో ఆ నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వరకు గడువు ఇచ్చింది. అప్పటి వరకు ఈ నోట్లు చెలామణిలోనే ఉంటాయి. ఇప్పటి నుంచే జనాలు నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు క్యూ కట్టారు. కానీ ఆర్బీఐ ఓ కండీషన్ పెట్టింది. రోజు పదినోట్లు అంటే రూ.20వేలు మాత్రమే మార్చుకోవాలని సూచించింది. ఈ కండీషన్ తో సామాన్యులకు వచ్చిన ఇబ్బందులేమీ ఉండవు. కానీ వచ్చిన తిప్పలల్లా బడా బాబులకే. దీంతో ఆ నోట్లను ఎలా వదిలించుకోవాలంటూ తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే నోట్లను మార్చుకునేందుకు కొత్త మార్గాలను ఆశ్రయిస్తున్నారు.
Read Also: Rs 2000 notes withdrawn: రూ.2 వేల నోట్లపై కొత్త టెన్షన్.. బ్యాంకులో వేస్తే ఐటీ వాళ్లు పట్టుకుంటారా?
Also Read
- Pawan Kalyan: పవన్ కల్యాణ్కు తెలంగాణ పోలీసుల షాక్.. నో పర్మిషన్..
- Vaibhav Vs Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. ‘ఎంత పని చేశావ్ వైభవ్ సూర్యవంశీ’..
- Oats Roti Recipe: గోధుమ రోటీ బోర్ కొట్టిందా..? ఓట్స్ రోటీ ట్రై చేయండి.. ఆరోగ్యానికి మేలు, రుచిలోనూ సూపర్!
- Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
నోట్ల రద్దు ప్రకటన వచ్చిన దగ్గరనుంచి బంగారం దుకాణాల్లో రద్దీపెరిగింది. తమ దగ్గరనున్న నోట్లను వదిలించుకునేందుకు డబ్బున్న వాళ్లు భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బంగారం ధర చుక్కలనంటుతుంది. ప్రస్తుతం బంగారం ధర అటు ఇటు 63వేలు ఉంది. అంత ధరలో కూడా బంగారం కొనుగోలుకు వెనకాడడం లేదని తెలుస్తోంది. ఆర్థిక రాజధాని ముంబైలోని బడా బాబులు రూ. 2వేల నోట్లు ఇచ్చి బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న గోల్డ్ షాపు యజమానులు అధిక ధరకు బంగారాన్ని విక్రయిస్టున్నట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం బంగారాన్ని అనధికారిక మార్కెట్ లో పది గ్రాముల బంగారం దాదాపు రూ. 67వేలకు కొందరు గోల్డ్ వ్యాపారులు విక్రయాలు చేశారు. బంగారం ధర అధికారికంగా ముంబైలో రూ. 63,800 (జీఎస్టీతో కలిపి) ఉంది. రెండు వేల నోట్లు పెద్ద మొత్తంలో దాచిన ధనవంతులు బ్యాంకులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే పన్ను కట్టాల్సి వస్తుందని ఇతర మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే గోల్డ్ తరువాత.. రియల్ ఎస్టేట్ రంగంలోనూ, దేవాలయాలు, మత సంస్థల ద్వారా నగదును మార్పిడి చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
Read Also: Narsingi accident: మితిమీరిన వేగంతో ఆటోను ఢీకొట్టిన కారు.. స్పాట్ లోనే నలుగురు మృతి
తాజావార్తలు
-
Pawan Kalyan: పవన్ కల్యాణ్కు తెలంగాణ పోలీసుల షాక్.. నో పర్మిషన్..
-
Vaibhav Vs Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. ‘ఎంత పని చేశావ్ వైభవ్ సూర్యవంశీ’..
-
Oats Roti Recipe: గోధుమ రోటీ బోర్ కొట్టిందా..? ఓట్స్ రోటీ ట్రై చేయండి.. ఆరోగ్యానికి మేలు, రుచిలోనూ సూపర్!
-
Iran Military Power: అమెరికానే వణికించేలా ఇరాన్ మిలిటరీ పవర్.. 2,100 క్షిపణులు, వేలాది డ్రోన్లతో యుద్ధానికి సై!
-
Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!