Kisan Reddy : మోడీ వచ్చాక ఐఎస్ఐ దాడులు లేవు, మత కల్లోల్లాలు లేవు : కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kisan Reddy : పార్లమెంటు ఎన్నికలు బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని కమలం పార్టీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా 400 ప్లస్ సీట్లు టార్గెట్గా పెట్టుకోగా తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలవాలని భావిస్తోంది. అందుకుగాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ప్రచారంలో జోరు పెంచారు. వరుసగా ఖైరతాబాద్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి కిషన్ రెడ్డి ప్రచార యాత్ర ప్రారంభమైంది. ఎన్బీటీ నగర్ లో కార్నర్ మీటింగ్ లో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. దేశం కోసం, మన భవిష్యత్తు కోసం, మన రక్షణ కోసం ఓటెయ్యాలన్నారు. దేశం కోసం, మన కోసం సమర్థవంతంగా మోడీ పని చేస్తున్నాడని.. ఆయన వచ్చిన తర్వాత ఐఎస్ఐ దాడులు లేవు, మత కల్లోల్లాలు లేవన్నారు. భారత దేశంలో డాక్టర్లు తక్కువ కరోనా వస్తే అందరూ చనిపోతారని అన్నారు. కనిపించని మృత్యువు కరోనా మందును కనుగొన్నాం మనం.. కరోనా వ్యాక్సిన్ ఇచ్చి మన అందరి ప్రాణాలు కాపాడాడు మోడీ. కరోనా వచ్చినప్పుడు లాక్ డౌన్ ఉంటే ఆకలితో ఉండొద్దు అని ఉచిత రేషన్ బియ్యం ఇచ్చాడని తెలిపారు.
Read Also:Manchu Lakshmi: మంచు లక్ష్మి కొత్త ఇంటిని చూశారా?.. అదిరిపోయింది అంతే..
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
కరోనా పోయిన కూడా మరో ఐదేళ్లు ఉచిత రేషన్ ఇవ్వాలని చెప్పాడు. పేదలకు ఐదులక్షల రూపాయలు వైద్యం కోసం ప్రధాని ఇస్తున్నారు. హైదరాబాద్ లో గతంలో ISI దాడులు జరిగేవి. మత కల్లోల్లాలు, కర్ఫూలు ఉండేవి. ఇప్పుడు అవి మచ్చుక కూడా లేవు. అందరిని ఒప్పించి, మెప్పించి రాముడి గుడి కట్టాడు మోడీ.. ఆయన లేకపోతే కరోనా పెద్దది అయ్యేది.. పాకిస్థాన్ ఉగ్రవాదం తగ్గేది కాదన్నారు. తెలంగాణను తండ్రి, బిడ్డ, కొడుకు దోచుకున్నారు. తెలంగాణలో దోచుకున్నది సరిపోక ఢిల్లీలో లిక్కర్ బీర్ వ్యాపారం చేసి జైలుకు పోయింది. అధికారం పోయిన అహంకారం తగ్గలేదు.. జనాలకు బుద్ధి లేక ఒడగొట్టారని అంటున్నారు. కాంగ్రెస్ వచ్చిన వందరోజుల్లో హామీలు అమలు చేస్తామని అన్నది. ఇంకా ఎటువంటి హామీ అమలు చేయలేదన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అంటే స్కామ్స్, దోచుకోవడం.. స్వాత్యంత్రం వచ్చిన తరువాత తొలి బీసీ ప్రధాని మోడీ. ఓటేసి గెలిపించాలని కోరుతున్నట్లు కిషన్ రెడ్డి కోరారు.
Read Also:Patanjali Honey : తేనె నమూనా పరీక్షలో విఫలమైన పతాంజలి.. రూ.లక్ష జరిమానా
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..