Kishan Reddy: మోడీ ప్రభుత్వం ప్రాంతీయ భాషల ప్రోత్సాహానికి కృతనిశ్చయంగా పనిచేస్తోంది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- మోడీ ప్రభుత్వం ప్రాంతీయ భాషల ప్రోత్సాహానికి కృతనిశ్చయంగా పనిచేస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇందులో భాగంగా.. మోడీ ప్రభుత్వం ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తోందని, భారత్ భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యంతో గొప్పదని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంత వైవిధ్యత ఉన్న దేశం మరొకటి లేదని, మన దేశంలో 121 భాషలు ఉన్నాయని తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే, భారతదేశం భాషలలో గొప్ప వైవిధ్యాన్ని కలిగి ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మన రాజ్యాంగంలో 14 అధికార భాషలు ఉండేవి. కానీ, మోదీ ప్రభుత్వం వచ్చాక 21 భాషలకు అధికారిక స్థానం దక్కిందని కిషన్ రెడ్డి చెప్పారు.
Also Read: Daikin: ఏపీలో ‘డైకిన్’ భారీ పెట్టుబడులు.. శ్రీసిటీలో ఏసీల తయారీ యూనిట్!
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
భాషలు మన సంస్కృతి, వారసత్వం, జ్ఞాన సంపదకు నిలయాలు అని కిషన్ రెడ్డి చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం, వాజ్ పేయి నేతృత్వంలో ప్రాంతీయ భాషలకు సరైన ప్రాధాన్యత ఇచ్చిందని, భాష మన సంస్కృతికి ఆత్మ వంటిదని వాజ్ పేయి చెప్పారని ఆయన పేర్కొన్నారు. భారత శాస్త్రీయ భాషల ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం 1835లో మెకాలే ద్వారా జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. 1956లో భాషా ఆధారిత రాష్ట్రాల పునర్నిర్మాణం జరిగినపుడు, భాష ఒక కీలక అంశంగా మారిందని కిషన్ రెడ్డి తెలిపారు.
Also Read: Vemulawada: దారుణ హత్య.. రహదారిపై వ్యక్తిని నరికి చంపిన దుండగులు
పాలనాపరమైన సౌలభ్యం కోసం మూడు భాషల ఫార్ములాను రూపొందించారు. అయితే, ప్రజలు ఈ ఫార్ములా వినియోగంలో సంతృప్తిగా లేని కారణంగా, మార్పులు తీసుకురావాలనే డిమాండ్ పెరిగిందని ఆయన వివరించారు. 2020లో మోడీ NEP-2020 నూతన జాతీయ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా విద్యార్థులు కనీసం రెండు ప్రాంతీయ భాషలను నేర్చుకునేలా ప్రోత్సాహం ఇచ్చారని కిషన్ రెడ్డి చెప్పారు. భాషల ప్రాముఖ్యతను తీసుకుని, మోడీ ప్రభుత్వం దేశంలో ప్రాంతీయ భాషలను మరింత ప్రోత్సహించడానికి కృషి చేస్తోందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!