Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Jp Nadda Criticizes Congress Accuses Revanth Reddy Government Of Failing To Fulfill Promises

JP Nadda: తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం

Published Date :December 7, 2024 , 8:08 pm
By Mahesh Jakki
  • కాంగ్రెస్ ఏడాది పాలనలో హామీలు అమలు చేయకుండా మోసం చేసింది..
  • ప్రజల వికాసానికి బీజేపీ పనిచేస్తుంది..
  • కాంగ్రెస్ పార్టీ వాళ్ల స్వలాభం కోసం పని చేస్తుంది
  • తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం
  • బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు
JP Nadda: తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం
  • Follow Us :
  • google news
  • dailyhunt

JP Nadda: కాంగ్రెస్ ఏడాది పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ప్రజల వికాసానికి బీజేపీ పనిచేస్తుందని.. కాంగ్రెస్ పార్టీ వాళ్ల స్వలాభం కోసం పని చేస్తుందని అన్నారు. 70 ఏళ్లుగా ప్రభుత్వ వ్యతిరేకత గురించి విన్నామని.. మోడీ ప్రధాని అయ్యాక ప్రభుత్వ అనుకూలత గురించి వింటున్నామన్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా ప్రసంగించారు. బీజేపీ ఒంటరిగా 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని.. ఎన్డీఏ కూటమి మరో 6 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రాంతీయ పార్టీల సహకారంతోనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంటుందన్నారు. ఇరు పార్టీల బలహీనతలే కాంగ్రెస్ బలమని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.

Read Also: CM Revanth Reddy: జనవరిలో రైతు భరోసా.. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

కర్ణాటక, హిమాచల్, తెలంగాణలో అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని.. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమన్నారు. రేవంత్ ప్రభుత్వం మాయలఫకీర్‌లా మోసం చేస్తోందని విమర్శించారు. మూడో సారి వరుసగా ప్రధాని అయిన వ్యక్తి మోడీ అని, జవహర్ లాల్ నెహ్రూ అయినప్పుడు ప్రతిపక్షాలు లేవన్నారు. ప్రభుత్వాలపై సానుకూలతతో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ వరసగా అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరితో కలిస్తుందో వారిని కూడా ముంచుతుందని ఆరోపించారు. ఇతర ప్రాంతీయ పార్టీల పుణ్యాన కాంగ్రెస్ పార్టీకి సీట్లు వస్తున్నాయన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పథకం అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. ఇంకా చేయలేదని విమర్శించారు. 5 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు.. ఇవ్వలేదన్నారు. హిమాచల్‌లో రూ.1,500 మహిళలకి ఇస్తామని హామీ ఇచ్చారు … ఒక్కరికీ ఇవ్వలేదన్నారు. అక్కడ ఉచిత కరెంట్ అన్నారు.. అసలు కరెంట్ కూడా ఇవ్వలేక పోతున్నారన్నారు. కర్ణాటకలోనూ అదే పరిస్థితి ఉందన్నారు.

రేవంత్ రెడ్డి సర్కార్ పేదలను మోసం చేసిందని మండిపడ్డారు. ఆటో డ్రైవర్‌లకి 12 వేలు ఇస్తామని అన్నారని.. ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ఇంద్రజాలం తమాషా చేస్తుందన్నారు. తన మీద తనకే భరోసా లేదు… విద్యా భరోసా కార్డు ఎక్కడ నుంచి ఇస్తారని ప్రశ్నించారు. “నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. రుణమాఫీ చేయలేదు. వ్యవసాయ కార్మికులకు డబ్బులు ఇవ్వలేదు. రైతు భరోసా ఇవ్వలేదు… ఇది రేవంత్ రెడ్డి రిపోర్ట్ కార్డు. రేవంత్ రెడ్డి డోక చేశారు. ఇది జాదుగిరి చేసే సర్కార్.”అంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.

 

Read Also: Minister Ponnam Prabhakar: ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి పొన్నం సీరియస్

నిరుపేద వర్గాలకు కూడా అన్యాయం చేశారని అన్నారు. మహాత్మా జ్యోతిభా పూలే ఆశయాలను నెరవేరుస్తామని అవాస్తవాలు మాట్లాడాలన్నారు. రూ. 2 లక్షలు యాదవ, కురుమ సంఘాలకు వృత్తి అభివృద్ధికి ఇస్తామన్నారని కానీ ఇచ్చారా? ని ప్రశ్నించారు. రైతులు, మహిళలు, యువత, తెలంగాణ ప్రజల వ్యతిరేక పార్టీయే కాంగ్రెస్​ అన్నారు. అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​ పార్టీ నాలుగు వ్యాఖ్యల సిద్ధాంతాన్ని పాటిస్తుందన్నారు. ఎన్నిరోజులైతే అధికారంలో ఉంటామో అప్పులతో నడిపిద్దామని, ఆ తరువాత ప్రభుత్వాన్ని అడిగే వారే ఉండరని, ప్రభుత్వం మనుగడలో ఉంటుందో లేదో ? తెలియదనే విధానంలో ఉంటుందని అన్నారు. అప్పులు చేస్తూ మనుగడ సాగించే ప్రభుత్వాలు ఎక్కువకాలం మనుగడ సాగించలేవన్నారు. మోదీ నేతృత్వంలో మూడో ఆర్థిక దిశగా వెళుతున్నామన్నారు. తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రాధాన్యతనిచ్చారన్నారు. సబ్​ కా సాత్​, సబ్​ కా వికాస్‌తో అందరికీ న్యాయం చేశారన్నారు.

తెలంగాణకు 1.60 లక్షల కోట్లు, గ్రాంట్​ 1.12 లక్షల గ్రాంట్లు, వరంగల్​ కు రూ. 27 కోట్లు, టెక్స్​ టైల్​, రైల్వేకు 20 రెట్లు బడ్జెట్​, వందేభారత్​ మూడు వందేభారత్​, ఐదు భారత్​ మాలా ప్రాజెక్టు కింద హైదరాబాద్​ ఇండోర్​, సూరత్​ చెన్న, హైదరాబాద్​ విశాఖపట్నం లాంటి జాతీయ రహదారులు, బీబీనగర్​ లోనూ ఎయిమ్స్​ నిర్మాణం లాంటి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారన్నారు. బీజేపీ హామీ ఇవ్వనివి కూడా ఇచ్చి చూపెడుతుందని కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేక చతికిలపడుతుందని జేపీ నడ్డా విమర్శించారు. తెలంగాణ బీజేపీ కాంగ్రెస్​ అవాస్తవాలపై చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని జేపీ నడ్డా అన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BJP In Telangana
  • Congress Criticism
  • farmer welfare
  • jp nadda

తాజావార్తలు

  • Tamil Nadu: “పోలీసమ్మ నీకు సెల్యూట్”.. 9 మంది తోటి సిబ్బందికే ఉరిశిక్ష పడేలా చేసిన హెడ్‌ కానిస్టేబుల్..

  • RK Roja: రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు..!

  • Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ట్రైలర్ డేట్ ఫిక్స్!

  • Story Board: ఇరాన్‌ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • RR vs MI: “వైభవ్ vs బుమ్రా”.. తొలిసారి యంగ్ సెన్సేషన్, యార్కర్ కింగ్ మధ్య అసలైన ఫైట్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions