Suryakumar Yadav: చెలరేగిన సూర్యకుమార్, మెరిసిన తిలక్.. మూడో టీ20లో భారత్ ఘన విజయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav and Tilak Varma Shine as India keep Series Alive vs West Indies: ప్రావిడెన్స్ మైదానంలో మంగళవారం రాత్రి విండీస్తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. కరేబియన్ జట్టు నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ (83; 44 బంతుల్లో 10×4, 4×6) సూపర్ హాఫ్ సెంచరీతో మెరవగా.. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ (49 నాటౌట్; 37 బంతుల్లో 4×4, 1×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-1తో నిలిచింది. ఇక నాలుగో టీ20 శనివారం జరుగుతుంది.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రెండన్ కింగ్ (42; 42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), కైల్ మేయర్స్ (25; 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) శుభారంభం అందించారు. వీరిద్దరు 50 పరుగులు జత చేశారు. అక్షర్ పటేల్ ఈ జోడీని విడదీశాడు. చార్లెస్ (12), పూరన్ (20) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. కింగ్,హెట్మైర్ (9) కూడా ఔట్ అయ్యారు. అయితే పావెల్ (40 నాటౌట్; 19 బంతుల్లో1 ఫోర్, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో ఇన్నింగ్స్ చివరలో విండీస్ 150కి పైగా రన్స్ చేసింది. కుల్దీప్ యాదవ్ (3/28) మూడు వికెట్స్ పడగొట్టాడు.
Also Read
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
Also Read: Guntur Kaaram: లుంగీ లో మహేష్ బాబు.. సంక్రాంతికి వచ్చేస్తున్నాడోచ్..
లక్ష్య ఛేదనలో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. తొలి అంతర్జాతీయ టీ20 ఆడుతున్న యశస్వి జైస్వాల్ (1) త్వరగా పెవిలియన్ చేరగా.. శుభమాన్ గిల్ (6) పేలవ ఫామ్ కొనసాగించాడు. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడాడు. ఫోర్స్, సిక్సులు బాదుతూ విండీస్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. అతడికి తిలక్ వర్మ కూడా జాతవ్వడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 23 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న సూర్య సెంచరీ కోల్పోయాడు. సూర్య అనంతరం హార్దిక్ పాండ్యా (20 నాటౌట్)తో కలిసి తిలక్ పని ముగించాడు.
తాజావార్తలు
-
Viral News: చెప్పులు చేతిలో పట్టుకుని పరుగెత్తింది.. కూతుళ్ల చదువు కోసం మారథాన్ గెలిచిన తల్లి కథ!
-
Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్తో సరికొత్త లైనప్
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్సైడ్ ఉందంటున్న నోమురా!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!