Virat Kohli: విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని గౌరవిస్తాం: బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్తో చివరి మూడు టెస్టు మ్యాచ్లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ముందే అనుకున్నట్లుగానే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ దూరమయ్యాడని, అతడి నిర్ణయాన్ని తాము గౌరవిస్తాం అని బీసీసీఐ తెలిపింది. మొదటి రెండు టెస్టు మ్యాచ్లకు విరాట్ ఎంపికయినా.. ఆపై తప్పుకున్న విషయం తెలిసిందే. దాంతో ఇంగ్లండ్తో ఐదు టెస్టు మ్యాచ్లకు విరాట్ దూరమయ్యాడు.
ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ జట్టుకు ఎంపికయ్యాడు. సిరీస్ ఆరంభ మ్యాచ్ కోసం హైదరాబాద్కు కూడా వచ్చాడు. అయితే అదే రోజు రాత్రి ఇంటికి తిరిగి పయనమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో విరాట్ జట్టు నుంచి తప్పుకున్నాడని బీసీసీఐ పేర్కొంది. చివరి మూడు టెస్టు మ్యాచ్లకు కూడా వ్యక్తిగత కారణాలతో కోహ్లీ దూరమయ్యాడని, అతడి నిర్ణయాన్ని బోర్డు పూర్తిగా గౌరవిస్తుందని, పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపింది. విరాట్ స్థానంలో రజత్ పటిదార్ జట్టులోకి వచ్చాడు. ఉప్పల్ టెస్టులో చోటు దక్కకపోయినా.. విశాఖ టెస్టులో అవకాశం దక్కించుకున్నాడు.
Also Read
- CM Revanth Reddy: నియామకాలను బాధ్యతగా తీసుకున్నాం.. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
- CM Revanth Reddy: రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశాం..
- Cyberabad: దారుణం.. ఆలయంలో మైనర్ బాలికపై పూజారి లైంగిక దాడి.!
- CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో చుక్క నీటినీ వదులుకోం.. గోల్కొండ కోట వేదికగా సీఎం రేవంత్ భరోసా..
Also Read: Mithun Chakraborty: గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి!
ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో నాలుగో టెస్టు, మార్చి 7 నుంచి ఐదవ టెస్టు ధర్మశాలలో జరగనుంది. తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్లో భారత్-ఇంగ్లండ్ 1-1తో సమంగా నిలిచాయి.
తాజావార్తలు
-
Bhargav BV: కన్నడ సుప్రీమ్ స్టార్ కొత్త ప్రయాణం… క్లాసిక్ టైటిల్తో హీరోగా, దర్శకుడిగా తెలుగు సినిమా
-
CM Revanth Reddy: నియామకాలను బాధ్యతగా తీసుకున్నాం.. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
-
LPG e-KYC deadline 2026: ఆగస్టు 16 తర్వాత LPG సిలిండర్ రాదా?.. e-KYC తప్పనిసరి.. పూర్తి వివరాలు
-
CM Revanth Reddy: రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశాం..
-
Cyberabad: దారుణం.. ఆలయంలో మైనర్ బాలికపై పూజారి లైంగిక దాడి.!
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!