HYDRA : మరోసారి రంగంలోకి హైడ్రా.. ఈ సారి కూకట్పల్లిలో
- కూకట్పల్లి డైమండ్ ఎస్టేట్లో 9 ఎకరాల అక్రమ లేఅవుట్పై హైడ్రా చర్యలు
- పుప్పాలగూడ డాలర్ హిల్స్లో పార్కులు, రహదారులపై ఆక్రమణల తొలగింపు
- కోర్టు తీర్పులపై కూడా ఖచ్చితంగా అమలు చేస్తోన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA : హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లోని ఆక్రమిత నిర్మాణాలను తొలగిస్తూ చర్యలు చేపట్టారు. మొదటగా కూకట్పల్లి నియోజకవర్గం హైదర్నగర్ పరిధిలోని డైమండ్ ఎస్టేట్ లేఅవుట్లోని అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు ధర్మయుద్ధం ప్రారంభించారు. సర్వే నంబర్ 145లో ఉన్న 9 ఎకరాల లేఅవుట్ను అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఆధారంగా ఆక్రమించారని, స్థానికులు ఆరోపించారు. ఈ ప్రాంతంలో మొత్తం 79 ప్లాట్లు, వాటికి సంబంధించిన పార్కులు, రహదారులు కబ్జాకు గురైనట్లు ప్లాట్ యజమానులు ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేశారు.
ఈ ప్లాట్లు 2000లో మధ్యతరగతి కుటుంబాలకు అమ్ముడైపోయినవే. అయితే ఆ స్థలంపై శివ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి హక్కు చూపిస్తూ అక్రమంగా కబ్జా చేశారని, దీనికి సంబంధించి 2024లో హైకోర్టు బాధితుల అనుకూలంగా తీర్పునిచ్చినా చర్యలు లేకపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక, ఆ స్థలాన్ని దశాబ్దాలుగా ఇతరులకు అద్దెకు ఇచ్చి నెలకు రూ.50 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నాడంటూ ప్లాట్ యజమానులు ఆరోపించారు.
Also Read
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
Shashi Tharoor: కాంగ్రెస్కు తలనొప్పిగా మారిన శశిథరూర్! వేటుపై తర్జనభర్జనలు
ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ. రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. గత బుధవారం ఆయన సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. పరిశీలనలో హెచ్ఎండీఏ లేఅవుట్లో పార్కులు, రహదారులు ఆక్రమించబడ్డట్లు తేలింది. వెంటనే బుల్డోజర్ల సహాయంతో సోమవారం ఉదయం పోలీసు బందోబస్తు మధ్య నిర్మాణాలను కూల్చివేశారు.
ఇక మరోవైపు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలోని డాలర్ హిల్స్ లేఅవుట్లో కూడా హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలు చేపట్టారు. అక్కడ రోడ్లు, పార్కులు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు ఆరోపణలు రావడంతో కమిషనర్ రంగనాథ్ బుధవారం అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు.
ఇటీవలి కాలంలో పాత లేఅవుట్ను రద్దు చేసి వ్యవసాయ భూమిగా మార్చి ఎన్సీసీ సంస్థకు అప్పగించినట్లు సమాచారం. విచారణ సందర్భంగా ఇరుపక్షాల నుంచి వివరాలు సేకరించిన హైడ్రా, పార్క్ స్థలం, రహదారులు అక్రమంగా ఆక్రమించబడ్డాయని నిర్ధారించింది. ఇక అక్కడ అనుమతుల్లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నట్లు స్పష్టమైన నేపథ్యంలో, తాత్కాలికంగా పనులను నిలిపివేసి, నిర్మాణాలను కూల్చివేసింది.
Viral News : పుటాణీ హీరోలు.. మానవత్వాన్ని కదిలించిన ఇద్దరు చిన్నారుల కథ..!
తాజావార్తలు
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!