Shashi Tharoor: కాంగ్రెస్కు తలనొప్పిగా మారిన శశిథరూర్! వేటుపై తర్జనభర్జనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హస్తం పార్టీకి శశిథరూర్ తలనొప్పిగా మారారు. కాంగ్రెస్లో ఉంటూ ప్రత్యర్థి పార్టీ బీజేపీని ప్రశంసిస్తున్నారు. ఇక పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికపై వినిపించేందుకు ఏర్పాటు చేసిన ఏడు బృందాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్కు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్తో సంబంధాలు బీటలు వారుతున్నట్లు తెలుస్తోంది. ఇక కేంద్రం కూడా శశిథరూర్కు కీలక బాధ్యతలు అప్పగించడం కాంగ్రెస్కు మింగుడుపడటం లేదు. తాము పేరు ప్రతిపాదించకుండా ఎలా తీసుకుంటారని ఆగ్రహంగా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనపై వేటు వేయాలా? వద్దా అన్న అంశంపై హస్తం నేతలు తర్జనభర్జన పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Bihar: రీల్స్ చేస్తుందని కోడలిపై మామ దారుణం.. చివరకు ఏమైందంటే?
Also Read
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
- West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
దౌత్య బృందంలోకి పేర్లు తెలియజేయాలని కేంద్రం కాంగ్రెస్ను కోరింది. కానీ ఇంతలోనే పార్టీతో సంబంధం లేకుండా కేంద్రమే నేరుగా శశిథరూర్ పేరును ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇదొక్కటే కాదు.. ఇటీవల కేరళ పర్యటనలో మోడీతో శశిథరూర్ కలిసి తిరిగారు. కేంద్రమంత్రి పీయూస్ గోయల్తో సెల్పీ దిగారు. ఇలా కేంద్ర పెద్దలతోనే ఎక్కువగా సంబంధాలు కలిగి ఉన్నారు. కాంగ్రెస్లో ఉంటూ.. బీజేపీ పెద్దలతో కలిసి తిరగడం హస్తం నేతలకు మింగుడుపడడం లేదు. ఇదిలా ఉంటే 2026లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలకు ముందే ఏదొక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నేతలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి సాహించలేకపోతున్నారు.
ఇది కూడా చదవండి: Jyoti Malhotra: జ్యోతి యూట్యూబ్ ఛానల్లో పహల్గామ్ వీడియోలు.. డానిష్తో ఎన్క్రిప్టెడ్ సంబంధాలు!
కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలోని బృందం.. అమెరికా, పనామా, గయానా, కొలంబియా, బ్రెజిల్కు వెళ్లనుంది. పాక్ తీరును ఆయా దేశాల నేతలకు వివరించనున్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి.. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఉగ్రవాదులు చనిపోతే.. పాకిస్థాన్ ప్రభుత్వ పెద్దలు హాజరు కావడం వంటి విషయాలు వివరించనున్నారు.
తాజావార్తలు
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
-
Trump – Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్తో నెతన్యాహు ఫైర్!
-
Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!