Shashi Tharoor: కాంగ్రెస్కు తలనొప్పిగా మారిన శశిథరూర్! వేటుపై తర్జనభర్జనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హస్తం పార్టీకి శశిథరూర్ తలనొప్పిగా మారారు. కాంగ్రెస్లో ఉంటూ ప్రత్యర్థి పార్టీ బీజేపీని ప్రశంసిస్తున్నారు. ఇక పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికపై వినిపించేందుకు ఏర్పాటు చేసిన ఏడు బృందాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్కు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్తో సంబంధాలు బీటలు వారుతున్నట్లు తెలుస్తోంది. ఇక కేంద్రం కూడా శశిథరూర్కు కీలక బాధ్యతలు అప్పగించడం కాంగ్రెస్కు మింగుడుపడటం లేదు. తాము పేరు ప్రతిపాదించకుండా ఎలా తీసుకుంటారని ఆగ్రహంగా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనపై వేటు వేయాలా? వద్దా అన్న అంశంపై హస్తం నేతలు తర్జనభర్జన పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Bihar: రీల్స్ చేస్తుందని కోడలిపై మామ దారుణం.. చివరకు ఏమైందంటే?
Also Read
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
దౌత్య బృందంలోకి పేర్లు తెలియజేయాలని కేంద్రం కాంగ్రెస్ను కోరింది. కానీ ఇంతలోనే పార్టీతో సంబంధం లేకుండా కేంద్రమే నేరుగా శశిథరూర్ పేరును ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇదొక్కటే కాదు.. ఇటీవల కేరళ పర్యటనలో మోడీతో శశిథరూర్ కలిసి తిరిగారు. కేంద్రమంత్రి పీయూస్ గోయల్తో సెల్పీ దిగారు. ఇలా కేంద్ర పెద్దలతోనే ఎక్కువగా సంబంధాలు కలిగి ఉన్నారు. కాంగ్రెస్లో ఉంటూ.. బీజేపీ పెద్దలతో కలిసి తిరగడం హస్తం నేతలకు మింగుడుపడడం లేదు. ఇదిలా ఉంటే 2026లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలకు ముందే ఏదొక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నేతలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి సాహించలేకపోతున్నారు.
ఇది కూడా చదవండి: Jyoti Malhotra: జ్యోతి యూట్యూబ్ ఛానల్లో పహల్గామ్ వీడియోలు.. డానిష్తో ఎన్క్రిప్టెడ్ సంబంధాలు!
కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలోని బృందం.. అమెరికా, పనామా, గయానా, కొలంబియా, బ్రెజిల్కు వెళ్లనుంది. పాక్ తీరును ఆయా దేశాల నేతలకు వివరించనున్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి.. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఉగ్రవాదులు చనిపోతే.. పాకిస్థాన్ ప్రభుత్వ పెద్దలు హాజరు కావడం వంటి విషయాలు వివరించనున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!