Harish Rao : ఇంత మంచి పని చేసిన కేసీఆర్ని సాదుకుందామా.. సంపుకుందమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్లో హావేలి ఘనపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 2014కి ముందు 2014 తర్వాత పరిస్థితి ఎలా ఉంది అన్నది మనం పరిశీలించుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని పని ఈ 8 ఏళ్లలో కేసీఆర్ చేసి చూపించారని, ఇంత మంచి పని చేసిన కేసీఆర్ ని సాదుకుందామా..సంపుకుందమా..? అని ఆయన ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. పంచినోడు కావాల్నా..పెంచినోడు కావాల్నా.. అని ఆయన అన్నారు. పదో తరగతి పేపర్ లీక్ చేసిన దొంగను పోలీసులు దొరకబట్టి లోపల వేశారని, దొంగతనం చేసిన దొంగను లోపల వెయ్యకపోతే ఏం చేస్తారని ఆయన అన్నారు.
Also Read : Punjab Kings: పంజాబ్ జట్టులో కీలక మార్పు.. ఆల్రౌండర్ స్థానంలో అతడు
Also Read
- Pune: పూణెలో మరో సోనమ్.. పెళ్లికి ముందే కాబోయే భర్తను పైకి పంపేసింది
- Aman Rao Perala: ఎవరయ్యా వైభవ్ సూర్యవంశీ.? 32 బంతుల్లో సెంచరీ చేసిన హైదరాబాద్ బ్యాటర్.!
- Rare Fish: అంతర్వేదిలో అరుదైన ఫిష్.. మత్స్యకారులకు అదృష్టాన్ని తెచ్చిన 'మగ కచిడి చేప'!
- Harish Rao: ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు లాక్కోవడమా? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు
ఆనాడు నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అంటే… ఇప్పుడు నేడు నేను పోతా బిడ్డ సర్కారు దవాఖానకు అంటున్నారన్నారు. 25 తేదీ నుంచి న్యూట్రిషన్ కిట్ ఇస్తామని, బీజేపీ వాళ్ళు గరిబోళ్ళ పొట్ట గొట్టి, అదానీ, అంబానీ ఆస్తులు పెంచుతున్నారన్నారు. ఢిల్లీల ఉన్నోడు పగబట్టిండు మన మీద.. మోటర్లకు మీటర్లు పెట్టలేదని 30 కోట్లు ఆపిండని, డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాల్లో కాస్త వెనుక పడ్డామని, ఈ నెలలోనే మీ సొంత స్థలాల్లో ఇల్లు కట్టిస్తామన్నారు. రైతుల కోసం 30 వేల కోట్లు వద్దనుకున్నాడు సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు వివరించారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలే అని ఆయన విమర్శించారు.
Also Read : Kim Cotton: పురుషుల క్రికెట్లో లేడీ అంపైర్.. చరిత్రలో ఇదే తొలిసారి
కేసీఆర్ అనే అద్భుత దీపం వల్ల ఇదంతా సాధ్యమయ్యిందని, 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తా అని కేసీఆర్ అంటే జానారెడ్డి అయ్యే పనేనా అన్నాడని, ఆనాడు పంటలు పండించాలంటే రైతుకు అన్ని కష్టాలే అని ఆయన గుర్తు చేశారు. ఆనాడు అన్ని తంటాలే.. ఈ నాడు ఊరి.. ఊరికి కాంటాలే అని, ఒక్క గింజ కూడా లేకుండా వడ్లు కొన్న నాయకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. సద్ది తిన్న రేవు తలవాలని, కేంద్రాన్ని వడ్లు కొనమంటే నుకలు బుక్కమని మనల్ని అవమాన పరిచారని ఆయన మండిపడ్డారు. ఆనాడు పని లేక మనం వలస బోయినం..ఈనాడు ఇతర రాష్ట్రాల నుంచి పనులు చేయడానికి ఇక్కడకు వస్తున్నారని, కాంగ్రెస్ వాళ్లు ఆనాడు ఎందుకు ఇవన్నీ ఇయ్యలే అని ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
IAF Masterstroke: రఫేల్ యుద్ధ విమానాలు సేఫ్.. ఎయిర్ఫోర్స్ రిపోర్ట్ దెబ్బకు దెయ్యం వదిలిన పాకిస్థాన్!
-
ATM Cash Van : ఏటీఎంలో డబ్బులు పెట్టాల్సినోడు.. తన జేబులో వేసుకుని జంప్.!
-
Spirit Controversy : ప్రభాస్ సినిమాను కోర్టుకు వెళ్లి ఆపిస్తా: రైతు మహిళా నిర్మాత నర్సమ్మ
-
Pune: పూణెలో మరో సోనమ్.. పెళ్లికి ముందే కాబోయే భర్తను పైకి పంపేసింది
-
Rishabh Pant: ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్వాప్ డీల్! లఖ్నవూకు రిషభ్ పంత్ గుడ్ బై.. ఏ జట్టుకు మారాడో తెలుసా?
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!