Council Chairman: కేటీఆర్ రైతు దీక్షపై గుత్తా సుఖేందర్ కౌంటర్..
- కేటీఆర్ రైతు దీక్షపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్
- రాజకీయ ప్రయోజనాల కోసం రైతు దీక్షలు చేశారు- గుత్తా
- ప్రభుత్వం 100 శాతం కులగణన సర్వే పర్ఫెక్ట్ చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాసన మండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. కేటీఆర్ రైతు దీక్షపై కౌంటర్ ఎటాక్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతు దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. కరెంట్ కట్ అయినా.. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన రైతులే రోడ్డెక్కుతారు.. రాజకీయ పార్టీలు చెబితే రైతులు ధర్నాలు చేయరని దుయ్యబట్టారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వం 100 శాతం కులగణన సర్వే పర్ఫెక్ట్ చేసిందని తెలిపారు. అసలు కులగణన మీద బీసీల జనాభాపై లెక్క ఎక్కడ ఉంది.. దేశంలోనే ఇదే మొదటిసారి కదా బీసీ కులగణ చేసిందని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఆఫిషియల్ రికార్డు లేదు.. బీసీ కులగణన సర్వే సరైనదని తెలిపారు.
Read Also: Satyendra Jain: ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రిపై విచారణకు రాష్ట్రపతి అనుమతి
Also Read
- Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్గా ఉంటాయి
- IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
నాయకుడికి కులం, మతంతో సంబంధం ఉండదు.. ప్రజలతో మమేకమైన వాడే నాయకుడు అవుతాడని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మరోవైపు.. బీజేపీ బీసీ కులగణకు వ్యతిరేకమని అందరికి తెలిసిందే.. వ్యవస్థలపై గౌరవం తగ్గుతున్న మాట వాస్తవమే.. రాజకీయం, ప్రభుత్వ సంస్థలు ఇతర వ్యవస్థలపై సైతం నమ్మకం తగ్గుతుందని ఆయన ఆరోపించారు. కాగా.. ఉచితలపై ఒక కఠినమైన చట్టం రావాల్సిందేనని అన్నారు. కేసీఆర్ త్యాగాలు చేసింది నిజమే.. తెలంగాణ ఉద్యమం నడిపించింది వాస్తవమే.. కానీ 4 కోట్ల ప్రజలు హీరో అంటే.. మరి ఎన్నికల్లో 4 కోట్ల ప్రజలు ఓట్లు వేయలేదు కదా…! అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నువ్వు నేను కోరుకుంటే ఎన్నికలు రావు.. ప్రభుత్వం పడిపోతుంది అంటే అది అధికారం కోల్పోయిన బాధలో మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటారు.. ఈ ప్రభుత్వ పాలన పర్వాలేదని గుత్తా తెలిపారు.
Read Also: Hyderabad: నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు..
జమిలి ఎన్నికలపై గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కలిసి వస్తే పార్టీలపై, ప్రభుత్వంపై, అభ్యర్థులపై భారం తగ్గుతుందని అన్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీకి ఎన్నిక జరుగుతుందని చెప్పారు. ఉన్న ఓటర్లే తక్కువ.. ఎన్నికల కోడ్, ప్రభుత్వ పరిపాలనపై ప్రభావం చూపిస్తోందని తెలిపారు. కోడ్ ప్రభావం చూపకుండా చర్యలు తీసుకోవాలని ఈసీకి లేఖ రాశానని చెప్పారు.
తాజావార్తలు
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
-
Best Crime Thriller Movies: కేతన్ అగర్వాల్ కేసును గుర్తు చేసే థ్రిల్లర్లు.. ఈ సినిమాల ట్విస్టులు చూస్తే షాక్ అవుతారు!
-
Jananayagan Censor : జననాయగన్ కు సెన్సార్ షాక్
-
Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
-
Microsoft Layoffs: ఐటీ ఉద్యోగులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్లో 5,000 మంది అవుట్! ఎవరెవరి ఉద్యోగాలు ఊడనున్నాయంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?