Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఈ యుద్ధం కేవలం యూఎస్-ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య మాత్రమే కాకుండా మధ్యప్రాచ్యంలోని అన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం ‘‘ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జుడా’’ పేరుతో ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇతర నగరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు ప్రారంభించింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రైయిన్, జోర్డాన్ లోని అమెరిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది.
Read Also: Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్పై చాగంటి ఫైర్..
ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ తన దాడుల తర్వాత ఇరాన్ ప్రజలకు బహిరంగ సందేశాన్ని పంపింది. ఇజ్రాయిల్ గూఢచార సంస్థ ‘‘మొసాద్’’ ఇరాన్పై ఇజ్రాయిల్ సైనిక చర్యని ప్రశంసించింది. ఈ దాడులు ఇరాన్కు ‘‘వైభవ దినాలనున తీసుకువస్తుంది’’ అని చెప్పింది. మొసాద్ తన అధికారిక సోషల్ మీడియా ఛానెల్లో పర్షియన్, హిబ్రూ భాషల్లో పోస్ట్ చేసింది. ‘‘మేము మీతో ఉన్నారు. కలిసి ఇరాన్ను దాని వైభవ దినాలకు తిరిగి తీసుకువస్తాము, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి’’ అని పోస్ట్ చేసింది.
ఇరాన్పై దాడి వివరాలను పోస్ట్ చేయడానికి మొసాద్ ఫార్సీ భాషలో టెలిగ్రామ్ ఛానెల్ ప్రారంభించింది. ‘‘మేము మీ కోసం సూపర్ సెక్యూర్ మరియు ప్రత్యేకమైన టెలిగ్రామ్ ఛానెల్ను ప్రారంభించాము. కలిసి మేము ఇరాన్ను దాని వైభవ దినాలకు తిరిగి తీసుకువస్తాము’’ అని మొసాద్ రాసింది. ఇరాన్ సోదరులు, సోదరీమణులు మీరు ఒంటరివారు కాదు అని అన్నారు. ఇరాన్ను అద్భుతమైన రోజుల్లోకి తీసుకెళ్తామని ఇజ్రాయిల్ శపథం చేసింది.