Governor Tamilisai: వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్, హనుమకొండ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించారు. తొలుత నగరానికి చేరుకున్న ఆమె.. శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం హనుమకొండలోని హంటర్ రోడ్డులో వరద ముంపునకు గురైన ఎన్టీఆర్ నగర్, ఎన్ఎన్ నగర్ ప్రాంతాల్లో బాధితులను ఆమె పరామర్శించారు. రెడ్ క్రాస్ సొసైటీ సమకూర్చిన హెల్త్ కిట్స్, నిత్యావసరాలను వరద బాధితులకు గవర్నర్ తమిళిసై పంపిణీ చేశారు. వరద బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని.. సాయమందేలా చూస్తానని తమిళిసై హామీ ఇచ్చారు.
Read Also: Guntur Kaaram: మళ్లీ మొదలవనున్న షూటింగ్…
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఈ సందర్భంగా భద్రకాళి చెరువు కట్ట మరమ్మతుల పనులను గవర్నర్ తమిళిసై పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వరద ప్రభావం వరంగల్ లో దారుణంగా ఉంది.. భారీ వరదలు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపాయి. వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టాలి అని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.. సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని తమిళిసై అన్నారు.
Read Also: Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. వచ్చే వారం నుంచే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ?
ప్రకృతి ప్రకోపం కంటే ఆక్రమణల వల్లే ఎక్కువ నష్టం జరిగింది అని గవర్నర్ తమిళిసై అన్నారు. వర్షంతో పాటు ఆక్రమణల కారణంగా ఎక్కువ ముంపు జరిగింది.. స్వచ్ఛమైన తాగునీరు, మెడికల్ కిట్స్ ప్రభుత్వం అందించాలి అని ఆమె అన్నారు. కేంద్ర బృందం పర్యటిస్తూ వరద నష్టాన్ని అంచనా వేస్తోంది.. బాధితులకు నిత్యావసర సరుకులు అందించినందుకు రెడ్ క్రాస్ సంస్థకు ధన్యవాదాలు అని గవర్నర్ తమిళిసై చెప్పారు.
తాజావార్తలు
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
-
Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
-
Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
-
Peddi : ‘పెద్ది’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!