Onion Price Hike: పెరుగుతున్న ఉల్లి ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Onion Price Hike: ఉల్లి ధరలు రానున్న రోజుల్లో సామాన్యులకు కన్నీళ్లు తెప్పించవచ్చు. భారీగా పెరగనున్న ఉల్లిపాయల ధరల నుండి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక నగరాల్లో మొబైల్ పాన్ ద్వారా ఉల్లిపాయలను తక్కువ ధరకు విక్రయించడానికి సిద్ధమవుతున్నాయి. సెప్టెంబరు 6, 2023న, వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే NCCF మొబైల్ వ్యాన్ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. దీని ద్వారా ఉల్లిపాయలు కిలో రూ. 25కి రిటైల్ మార్కెట్లో ప్రజలకు లభిస్తాయి.
ఉల్లి ధరల పెరుగుదలను నివారించడానికి 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దాని హోల్సేల్ బఫర్ స్టాక్ నుండి 36,250 టన్నుల ఉల్లిపాయలను విడుదల చేసింది. హోల్సేల్, రిటైల్ మార్కెట్లలో బఫర్ స్టాక్ నుండి విక్రయించే బాధ్యత నాఫెడ్, ఎన్సిసిఎఫ్లకు అప్పగించబడింది. బఫర్ స్టాక్ను పెంచేందుకు వీలుగా రైతుల నుంచి అదనంగా 3 నుంచి 5 లక్షల టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేయాలని రెండు ఏజెన్సీలను కోరింది.
Also Read
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
- DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
Read Also:Rajamouli : మరోసారి తండ్రి కాబోతున్న జక్కన్న.. నిజమేంటంటే?
హోల్సేల్, రిటైల్ మార్కెట్లలో ఉల్లిపాయల బఫర్ స్టాక్ను విడుదల చేయడం ద్వారా ఉల్లి ధరల పెరుగుదలను ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. ఆగస్టు 11 నుంచి ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, చండీగఢ్, కేరళ సహా 12 రాష్ట్రాల్లో 35,250 టన్నుల ఉల్లిపాయలు హోల్సేల్ మార్కెట్లోకి విడుదలయ్యాయి.
రిటైల్ మార్కెట్లో ప్రభుత్వం రూ.25 రాయితీపై ఉల్లిని విక్రయిస్తుండగా బఫర్ స్టాక్ నుంచి ప్రస్తుత ధరకే ఉల్లి విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో మొబైల్ వ్యాన్ల ద్వారా మరిన్ని ఉల్లిని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 4, 2023న రిటైల్ మార్కెట్లో ఉల్లిపాయ సగటు ధర రూ. 33.41కి అందుబాటులో ఉంది. ఇది గతేడాది కంటే 37 శాతం ఎక్కువ. ఏడాది క్రితం కిలో ఉల్లి ధర రూ.24.37గా ఉండేది. కోల్కతాలో ఉల్లి రూ.39, ఢిల్లీలో రూ.37లకు లభిస్తోంది.
Read Also:Flipkart: నిరుద్యోగులకు ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్.. లక్ష ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..
తాజావార్తలు
-
West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
-
Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
-
Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
-
Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో “కాక్రోచ్” పేరుతో కొత్త పార్టీలు..
-
DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!