Onion Price Hike: పెరుగుతున్న ఉల్లి ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Onion Price Hike: ఉల్లి ధరలు రానున్న రోజుల్లో సామాన్యులకు కన్నీళ్లు తెప్పించవచ్చు. భారీగా పెరగనున్న ఉల్లిపాయల ధరల నుండి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక నగరాల్లో మొబైల్ పాన్ ద్వారా ఉల్లిపాయలను తక్కువ ధరకు విక్రయించడానికి సిద్ధమవుతున్నాయి. సెప్టెంబరు 6, 2023న, వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే NCCF మొబైల్ వ్యాన్ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. దీని ద్వారా ఉల్లిపాయలు కిలో రూ. 25కి రిటైల్ మార్కెట్లో ప్రజలకు లభిస్తాయి.
ఉల్లి ధరల పెరుగుదలను నివారించడానికి 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దాని హోల్సేల్ బఫర్ స్టాక్ నుండి 36,250 టన్నుల ఉల్లిపాయలను విడుదల చేసింది. హోల్సేల్, రిటైల్ మార్కెట్లలో బఫర్ స్టాక్ నుండి విక్రయించే బాధ్యత నాఫెడ్, ఎన్సిసిఎఫ్లకు అప్పగించబడింది. బఫర్ స్టాక్ను పెంచేందుకు వీలుగా రైతుల నుంచి అదనంగా 3 నుంచి 5 లక్షల టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేయాలని రెండు ఏజెన్సీలను కోరింది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also:Rajamouli : మరోసారి తండ్రి కాబోతున్న జక్కన్న.. నిజమేంటంటే?
హోల్సేల్, రిటైల్ మార్కెట్లలో ఉల్లిపాయల బఫర్ స్టాక్ను విడుదల చేయడం ద్వారా ఉల్లి ధరల పెరుగుదలను ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. ఆగస్టు 11 నుంచి ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, చండీగఢ్, కేరళ సహా 12 రాష్ట్రాల్లో 35,250 టన్నుల ఉల్లిపాయలు హోల్సేల్ మార్కెట్లోకి విడుదలయ్యాయి.
రిటైల్ మార్కెట్లో ప్రభుత్వం రూ.25 రాయితీపై ఉల్లిని విక్రయిస్తుండగా బఫర్ స్టాక్ నుంచి ప్రస్తుత ధరకే ఉల్లి విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో మొబైల్ వ్యాన్ల ద్వారా మరిన్ని ఉల్లిని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 4, 2023న రిటైల్ మార్కెట్లో ఉల్లిపాయ సగటు ధర రూ. 33.41కి అందుబాటులో ఉంది. ఇది గతేడాది కంటే 37 శాతం ఎక్కువ. ఏడాది క్రితం కిలో ఉల్లి ధర రూ.24.37గా ఉండేది. కోల్కతాలో ఉల్లి రూ.39, ఢిల్లీలో రూ.37లకు లభిస్తోంది.
Read Also:Flipkart: నిరుద్యోగులకు ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్.. లక్ష ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
FIFA World Cup 2026: హోరాహోరీ పోరులో.. ఫ్రాన్స్పై 6-4తో ఇంగ్లండ్ ఘన విజయం.. కాంస్య పతకం కైవసం
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!