Onion Price Hike: పెరుగుతున్న ఉల్లి ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Onion Price Hike: ఉల్లి ధరలు రానున్న రోజుల్లో సామాన్యులకు కన్నీళ్లు తెప్పించవచ్చు. భారీగా పెరగనున్న ఉల్లిపాయల ధరల నుండి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక నగరాల్లో మొబైల్ పాన్ ద్వారా ఉల్లిపాయలను తక్కువ ధరకు విక్రయించడానికి సిద్ధమవుతున్నాయి. సెప్టెంబరు 6, 2023న, వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే NCCF మొబైల్ వ్యాన్ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. దీని ద్వారా ఉల్లిపాయలు కిలో రూ. 25కి రిటైల్ మార్కెట్లో ప్రజలకు లభిస్తాయి.
ఉల్లి ధరల పెరుగుదలను నివారించడానికి 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దాని హోల్సేల్ బఫర్ స్టాక్ నుండి 36,250 టన్నుల ఉల్లిపాయలను విడుదల చేసింది. హోల్సేల్, రిటైల్ మార్కెట్లలో బఫర్ స్టాక్ నుండి విక్రయించే బాధ్యత నాఫెడ్, ఎన్సిసిఎఫ్లకు అప్పగించబడింది. బఫర్ స్టాక్ను పెంచేందుకు వీలుగా రైతుల నుంచి అదనంగా 3 నుంచి 5 లక్షల టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేయాలని రెండు ఏజెన్సీలను కోరింది.
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
Read Also:Rajamouli : మరోసారి తండ్రి కాబోతున్న జక్కన్న.. నిజమేంటంటే?
హోల్సేల్, రిటైల్ మార్కెట్లలో ఉల్లిపాయల బఫర్ స్టాక్ను విడుదల చేయడం ద్వారా ఉల్లి ధరల పెరుగుదలను ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. ఆగస్టు 11 నుంచి ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, చండీగఢ్, కేరళ సహా 12 రాష్ట్రాల్లో 35,250 టన్నుల ఉల్లిపాయలు హోల్సేల్ మార్కెట్లోకి విడుదలయ్యాయి.
రిటైల్ మార్కెట్లో ప్రభుత్వం రూ.25 రాయితీపై ఉల్లిని విక్రయిస్తుండగా బఫర్ స్టాక్ నుంచి ప్రస్తుత ధరకే ఉల్లి విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో మొబైల్ వ్యాన్ల ద్వారా మరిన్ని ఉల్లిని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 4, 2023న రిటైల్ మార్కెట్లో ఉల్లిపాయ సగటు ధర రూ. 33.41కి అందుబాటులో ఉంది. ఇది గతేడాది కంటే 37 శాతం ఎక్కువ. ఏడాది క్రితం కిలో ఉల్లి ధర రూ.24.37గా ఉండేది. కోల్కతాలో ఉల్లి రూ.39, ఢిల్లీలో రూ.37లకు లభిస్తోంది.
Read Also:Flipkart: నిరుద్యోగులకు ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్.. లక్ష ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!