Onion Price Hike: పెరుగుతున్న ఉల్లి ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Onion Price Hike: ఉల్లి ధరలు రానున్న రోజుల్లో సామాన్యులకు కన్నీళ్లు తెప్పించవచ్చు. భారీగా పెరగనున్న ఉల్లిపాయల ధరల నుండి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక నగరాల్లో మొబైల్ పాన్ ద్వారా ఉల్లిపాయలను తక్కువ ధరకు విక్రయించడానికి సిద్ధమవుతున్నాయి. సెప్టెంబరు 6, 2023న, వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే NCCF మొబైల్ వ్యాన్ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. దీని ద్వారా ఉల్లిపాయలు కిలో రూ. 25కి రిటైల్ మార్కెట్లో ప్రజలకు లభిస్తాయి.
ఉల్లి ధరల పెరుగుదలను నివారించడానికి 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దాని హోల్సేల్ బఫర్ స్టాక్ నుండి 36,250 టన్నుల ఉల్లిపాయలను విడుదల చేసింది. హోల్సేల్, రిటైల్ మార్కెట్లలో బఫర్ స్టాక్ నుండి విక్రయించే బాధ్యత నాఫెడ్, ఎన్సిసిఎఫ్లకు అప్పగించబడింది. బఫర్ స్టాక్ను పెంచేందుకు వీలుగా రైతుల నుంచి అదనంగా 3 నుంచి 5 లక్షల టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేయాలని రెండు ఏజెన్సీలను కోరింది.
Also Read
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
- Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
Read Also:Rajamouli : మరోసారి తండ్రి కాబోతున్న జక్కన్న.. నిజమేంటంటే?
హోల్సేల్, రిటైల్ మార్కెట్లలో ఉల్లిపాయల బఫర్ స్టాక్ను విడుదల చేయడం ద్వారా ఉల్లి ధరల పెరుగుదలను ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. ఆగస్టు 11 నుంచి ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, చండీగఢ్, కేరళ సహా 12 రాష్ట్రాల్లో 35,250 టన్నుల ఉల్లిపాయలు హోల్సేల్ మార్కెట్లోకి విడుదలయ్యాయి.
రిటైల్ మార్కెట్లో ప్రభుత్వం రూ.25 రాయితీపై ఉల్లిని విక్రయిస్తుండగా బఫర్ స్టాక్ నుంచి ప్రస్తుత ధరకే ఉల్లి విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో మొబైల్ వ్యాన్ల ద్వారా మరిన్ని ఉల్లిని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 4, 2023న రిటైల్ మార్కెట్లో ఉల్లిపాయ సగటు ధర రూ. 33.41కి అందుబాటులో ఉంది. ఇది గతేడాది కంటే 37 శాతం ఎక్కువ. ఏడాది క్రితం కిలో ఉల్లి ధర రూ.24.37గా ఉండేది. కోల్కతాలో ఉల్లి రూ.39, ఢిల్లీలో రూ.37లకు లభిస్తోంది.
Read Also:Flipkart: నిరుద్యోగులకు ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్.. లక్ష ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..
తాజావార్తలు
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
-
AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!