Tragedy: యూపీలో భారీ వర్షాలు.. ఇంటి పైకప్పు కూలి నలుగురు మృతి
- ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలో తీవ్ర విషాదం
- వర్షం కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలి నలుగురు మృతి
- ఒకే కుటుంబానికి చెందిన వృద్ధురాలు.. ముగ్గురు బాలికలు
- మరో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. దీంతో.. ఒకే కుటుంబానికి చెందిన వృద్ధురాలు, ముగ్గురు బాలికలు శిథిలాల కింద పడి చనిపోయారు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాలను తొలగిస్తుండగా.. 11 ఏళ్ల బాలిక తన నానమ్మకు అతుక్కుపోయి కనిపించింది. శిథిలాల నుండి బయటకు తీసి వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Read Also: Sathya 27th Showroom: ఆఫర్లే.. ఆఫర్లు.. సత్యా 27వ షోరూం అనంతపురంలో ఘనంగా ప్రారంభం
Also Read
- Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
- Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ల పెళ్లి తేదీ ఫిక్స్..!
- China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
ఈ ఘటన జైత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని కుప్పురా గ్రామంలో చోటు చేసుకుంది. రైతు రామ్ గోపాల్ ఇంట్లో గురువారం రాత్రి 8.30 గంటలకు జరిగింది. రామ్ గోపాల్.. అతని భార్య హాల్ లో నిద్రిస్తుండగా.. అతని తల్లి హోషియార్శ్రీ (64), ముగ్గురు కుమార్తెలు సప్న (16), జూలీ (13), అన్షిక (11)తో పాటు కుమారులు శివ, ఆనంద్ గదిలో నిద్రిస్తున్నారు. అయితే భారీ వర్షానికి రాత్రి ఒక్కసారిగా గది పైకప్పు కూలిపోయింది. పైకప్పు కూలిన వెంటనే పెద్ద ఎత్తున పేలుడు శబ్దం వినిపించడంతో గ్రామస్థులు రామ్ గోపాల్ ఇంటి వైపు పరుగులు తీశారు. అక్కడి దృశ్యాన్ని చూసి జనం వణికిపోయారు. వెంటనే శిథిలాల తొలగింపు ప్రారంభించారు.
Read Also: Rohit Sharma: ‘నేను మీ కెప్టెన్ రోహిత్ని’.. అభిమానులకు హిట్ మ్యాన్ సందేశం
శిథిలాల కింద రామ్గోపాల్ తల్లితో పాటు అతని ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సమాధి అయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. అక్కడి చేరుకున్న పోలీసులు, గ్రామస్థుల సహకారంతో శిథిలాలను తొలగించారు. శిథిలాల కింద ఒకే మంచంపై అమ్మమ్మ, అన్షిక మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరూ ఒకరికొకరు అతుక్కుపోయారు. అమ్మమ్మ తనని రక్షించడానికి కౌగిలించుకున్నట్లు అనిపించింది. ఇద్దరు కుమారులతో పాటు సప్న, జూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తీసుకెళుతుండగా సప్న, జూలీ మృతి చెందారు. శివ, ఆనంద్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజావార్తలు
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్పాల్ యాదవ్పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!