Tragedy: యూపీలో భారీ వర్షాలు.. ఇంటి పైకప్పు కూలి నలుగురు మృతి
- ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలో తీవ్ర విషాదం
- వర్షం కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలి నలుగురు మృతి
- ఒకే కుటుంబానికి చెందిన వృద్ధురాలు.. ముగ్గురు బాలికలు
- మరో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. దీంతో.. ఒకే కుటుంబానికి చెందిన వృద్ధురాలు, ముగ్గురు బాలికలు శిథిలాల కింద పడి చనిపోయారు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాలను తొలగిస్తుండగా.. 11 ఏళ్ల బాలిక తన నానమ్మకు అతుక్కుపోయి కనిపించింది. శిథిలాల నుండి బయటకు తీసి వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Read Also: Sathya 27th Showroom: ఆఫర్లే.. ఆఫర్లు.. సత్యా 27వ షోరూం అనంతపురంలో ఘనంగా ప్రారంభం
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ఈ ఘటన జైత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని కుప్పురా గ్రామంలో చోటు చేసుకుంది. రైతు రామ్ గోపాల్ ఇంట్లో గురువారం రాత్రి 8.30 గంటలకు జరిగింది. రామ్ గోపాల్.. అతని భార్య హాల్ లో నిద్రిస్తుండగా.. అతని తల్లి హోషియార్శ్రీ (64), ముగ్గురు కుమార్తెలు సప్న (16), జూలీ (13), అన్షిక (11)తో పాటు కుమారులు శివ, ఆనంద్ గదిలో నిద్రిస్తున్నారు. అయితే భారీ వర్షానికి రాత్రి ఒక్కసారిగా గది పైకప్పు కూలిపోయింది. పైకప్పు కూలిన వెంటనే పెద్ద ఎత్తున పేలుడు శబ్దం వినిపించడంతో గ్రామస్థులు రామ్ గోపాల్ ఇంటి వైపు పరుగులు తీశారు. అక్కడి దృశ్యాన్ని చూసి జనం వణికిపోయారు. వెంటనే శిథిలాల తొలగింపు ప్రారంభించారు.
Read Also: Rohit Sharma: ‘నేను మీ కెప్టెన్ రోహిత్ని’.. అభిమానులకు హిట్ మ్యాన్ సందేశం
శిథిలాల కింద రామ్గోపాల్ తల్లితో పాటు అతని ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సమాధి అయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. అక్కడి చేరుకున్న పోలీసులు, గ్రామస్థుల సహకారంతో శిథిలాలను తొలగించారు. శిథిలాల కింద ఒకే మంచంపై అమ్మమ్మ, అన్షిక మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరూ ఒకరికొకరు అతుక్కుపోయారు. అమ్మమ్మ తనని రక్షించడానికి కౌగిలించుకున్నట్లు అనిపించింది. ఇద్దరు కుమారులతో పాటు సప్న, జూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తీసుకెళుతుండగా సప్న, జూలీ మృతి చెందారు. శివ, ఆనంద్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..