Tragedy: యూపీలో భారీ వర్షాలు.. ఇంటి పైకప్పు కూలి నలుగురు మృతి
- ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలో తీవ్ర విషాదం
- వర్షం కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలి నలుగురు మృతి
- ఒకే కుటుంబానికి చెందిన వృద్ధురాలు.. ముగ్గురు బాలికలు
- మరో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. దీంతో.. ఒకే కుటుంబానికి చెందిన వృద్ధురాలు, ముగ్గురు బాలికలు శిథిలాల కింద పడి చనిపోయారు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాలను తొలగిస్తుండగా.. 11 ఏళ్ల బాలిక తన నానమ్మకు అతుక్కుపోయి కనిపించింది. శిథిలాల నుండి బయటకు తీసి వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Read Also: Sathya 27th Showroom: ఆఫర్లే.. ఆఫర్లు.. సత్యా 27వ షోరూం అనంతపురంలో ఘనంగా ప్రారంభం
Also Read
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
ఈ ఘటన జైత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని కుప్పురా గ్రామంలో చోటు చేసుకుంది. రైతు రామ్ గోపాల్ ఇంట్లో గురువారం రాత్రి 8.30 గంటలకు జరిగింది. రామ్ గోపాల్.. అతని భార్య హాల్ లో నిద్రిస్తుండగా.. అతని తల్లి హోషియార్శ్రీ (64), ముగ్గురు కుమార్తెలు సప్న (16), జూలీ (13), అన్షిక (11)తో పాటు కుమారులు శివ, ఆనంద్ గదిలో నిద్రిస్తున్నారు. అయితే భారీ వర్షానికి రాత్రి ఒక్కసారిగా గది పైకప్పు కూలిపోయింది. పైకప్పు కూలిన వెంటనే పెద్ద ఎత్తున పేలుడు శబ్దం వినిపించడంతో గ్రామస్థులు రామ్ గోపాల్ ఇంటి వైపు పరుగులు తీశారు. అక్కడి దృశ్యాన్ని చూసి జనం వణికిపోయారు. వెంటనే శిథిలాల తొలగింపు ప్రారంభించారు.
Read Also: Rohit Sharma: ‘నేను మీ కెప్టెన్ రోహిత్ని’.. అభిమానులకు హిట్ మ్యాన్ సందేశం
శిథిలాల కింద రామ్గోపాల్ తల్లితో పాటు అతని ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సమాధి అయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. అక్కడి చేరుకున్న పోలీసులు, గ్రామస్థుల సహకారంతో శిథిలాలను తొలగించారు. శిథిలాల కింద ఒకే మంచంపై అమ్మమ్మ, అన్షిక మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరూ ఒకరికొకరు అతుక్కుపోయారు. అమ్మమ్మ తనని రక్షించడానికి కౌగిలించుకున్నట్లు అనిపించింది. ఇద్దరు కుమారులతో పాటు సప్న, జూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తీసుకెళుతుండగా సప్న, జూలీ మృతి చెందారు. శివ, ఆనంద్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజావార్తలు
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
-
Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!