Tragedy: యూపీలో భారీ వర్షాలు.. ఇంటి పైకప్పు కూలి నలుగురు మృతి
- ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలో తీవ్ర విషాదం
- వర్షం కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలి నలుగురు మృతి
- ఒకే కుటుంబానికి చెందిన వృద్ధురాలు.. ముగ్గురు బాలికలు
- మరో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు.
ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. దీంతో.. ఒకే కుటుంబానికి చెందిన వృద్ధురాలు, ముగ్గురు బాలికలు శిథిలాల కింద పడి చనిపోయారు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాలను తొలగిస్తుండగా.. 11 ఏళ్ల బాలిక తన నానమ్మకు అతుక్కుపోయి కనిపించింది. శిథిలాల నుండి బయటకు తీసి వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Read Also: Sathya 27th Showroom: ఆఫర్లే.. ఆఫర్లు.. సత్యా 27వ షోరూం అనంతపురంలో ఘనంగా ప్రారంభం
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఈ ఘటన జైత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని కుప్పురా గ్రామంలో చోటు చేసుకుంది. రైతు రామ్ గోపాల్ ఇంట్లో గురువారం రాత్రి 8.30 గంటలకు జరిగింది. రామ్ గోపాల్.. అతని భార్య హాల్ లో నిద్రిస్తుండగా.. అతని తల్లి హోషియార్శ్రీ (64), ముగ్గురు కుమార్తెలు సప్న (16), జూలీ (13), అన్షిక (11)తో పాటు కుమారులు శివ, ఆనంద్ గదిలో నిద్రిస్తున్నారు. అయితే భారీ వర్షానికి రాత్రి ఒక్కసారిగా గది పైకప్పు కూలిపోయింది. పైకప్పు కూలిన వెంటనే పెద్ద ఎత్తున పేలుడు శబ్దం వినిపించడంతో గ్రామస్థులు రామ్ గోపాల్ ఇంటి వైపు పరుగులు తీశారు. అక్కడి దృశ్యాన్ని చూసి జనం వణికిపోయారు. వెంటనే శిథిలాల తొలగింపు ప్రారంభించారు.
Read Also: Rohit Sharma: ‘నేను మీ కెప్టెన్ రోహిత్ని’.. అభిమానులకు హిట్ మ్యాన్ సందేశం
శిథిలాల కింద రామ్గోపాల్ తల్లితో పాటు అతని ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సమాధి అయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. అక్కడి చేరుకున్న పోలీసులు, గ్రామస్థుల సహకారంతో శిథిలాలను తొలగించారు. శిథిలాల కింద ఒకే మంచంపై అమ్మమ్మ, అన్షిక మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరూ ఒకరికొకరు అతుక్కుపోయారు. అమ్మమ్మ తనని రక్షించడానికి కౌగిలించుకున్నట్లు అనిపించింది. ఇద్దరు కుమారులతో పాటు సప్న, జూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తీసుకెళుతుండగా సప్న, జూలీ మృతి చెందారు. శివ, ఆనంద్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!