Rohit Sharma: ‘నేను మీ కెప్టెన్ రోహిత్ని’.. అభిమానులకు హిట్ మ్యాన్ సందేశం
- భారత క్రికెట్ అభిమానులందరికీ రోహిత్ శర్మ ప్రత్యేకమైన.. భావోద్వేగ సందేశం
- బార్బడోస్లో రోహిత్ కెప్టెన్సీ షూట్ నుండి మెరైన్ డ్రైవ్ దగ్గర విజయ పరేడ్..
- వాంఖడే స్టేడియంలో ప్రతిష్టాత్మకమైన సన్మాన కార్యక్రమం వరకు వీడియో షేర్
- భారత్కు పొట్టి ఫార్మాట్లో ఆడాలనే కోరిక నాకు ఇంకా ఉంది- రోహిత్ శర్మ
- గత నెల రోజులు నాకు చాలా ప్రత్యేకమైనవని.. జ్ఞాపకాలతో నిండిపోయాయి- రోహిత్
- గత నెల జ్ఞాపకాలతో నిండిన నెల.. చరిత్రలో నిలిచిపోయింది- రోహిత్ శర్మ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్లో కొత్త శకం మొదలైంది. రాహుల్ ద్రవిడ్ నిష్క్రమణ, ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ నియామకం తర్వాత శ్రీలంకతో టీ20 సిరీస్లో టీమిండియా ప్రదర్శన కొత్త ఆశలను రేకెత్తించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ అద్భుత ప్రదర్శన చూపి 3-0తో సిరీస్ని కైవసం చేసుకుంది. టీ20 ఫార్మాట్ తర్వాత ఇప్పుడు వన్డే ఫార్మాట్ వంతు వచ్చింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 50 ఓవర్ల ఫార్మాట్లో శ్రీలంకను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే టీ20తో పోలిస్తే వన్డేల్లో భారత జట్టులో చాలా తేడా ఉంది. చాలా మంది అనుభవజ్ఞులు టీమిండియాకు తిరిగి వచ్చారు. భారత క్రికెట్లోని ఇద్దరు దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎనిమిది నెలల తర్వాత వన్డేల్లో పునరాగమనం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా 50 ఓవర్ల ఫార్మాట్లో ఆధిపత్యం చెలాయించిన ఈ జోడీ.. గుర్తిండిపోయేలా పునరాగమనం చేయాలనే లక్ష్యంతో ఉంది. వీరిద్దరూ టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఇద్దరూ వన్డేలు, టెస్టులపైనే పూర్తిగా దృష్టి సారించారు. గతేడాది వన్డే ప్రపంచకప్లో ఫైనల్లో ఎదురైన ఓటమిని మరిచిపోయి కొత్త శుభారంభం చేయాలని వీరిద్దరూ భావిస్తున్నారు. వీరిద్దరితో పాటు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ కూడా వన్డే జట్టులోకి తిరిగి వచ్చారు.
Read Also: Sanjay Raut: రాహుల్ గాంధీపై దాడి జరగొచ్చు.. పరాయి దేశంలో కుట్ర..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
సిరీస్ ప్రారంభానికి ముందు.. రోహిత్ భారత క్రికెట్ అభిమానులందరికీ ప్రత్యేకమైన, భావోద్వేగ సందేశాన్ని ఇచ్చాడు. బీసీసీఐ (BCCI) షేర్ చేసిన వీడియో కొన్ని వారాల క్రితం అభిమానులు.. ఆటగాళ్లు పంచుకున్న అన్ని చిరస్మరణీయ క్షణాలను సంగ్రహించింది. బార్బడోస్లో రోహిత్ కెప్టెన్సీ షూట్ నుండి మెరైన్ డ్రైవ్ దగ్గర విజయ పరేడ్.. వాంఖడే స్టేడియంలో ప్రతిష్టాత్మకమైన సన్మాన కార్యక్రమం వరకు ఈ వీడియోలో చూపిస్తుంది.
Read Also: Sathya Kumar: తొందరలోనే రాష్ట్రంలో అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తాం..
భారత్కు పొట్టి ఫార్మాట్లో ఆడాలనే కోరిక తనకు ఇంకా ఉందని రోహిత్ వీడియోలో చెప్పాడు. అభిమానులను ఉద్దేశించి కెప్టెన్ మాట్లాడుతూ, గత నెల రోజులు తనకు చాలా ప్రత్యేకమైనవని.. జ్ఞాపకాలతో నిండిపోయాయని అన్నాడు. గత నెల జ్ఞాపకాలతో నిండిన నెల.. చరిత్రలో నిలిచిపోయింది.. అది ఎప్పటికీ తనతో నిలిచిపోయే క్షణం అని తెలిపాడు. ఈ సిరీస్ కొత్త, పాత ప్రతిభతో కొత్త శకానికి నాంది పలుకుతుందని రోహిత్ చెప్పాడు. ‘కొత్త శకానికి నాంది పలికి మళ్లీ మైదానంలోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త కోచ్తో కొత్త ప్రారంభం.. భారత క్రికెట్కు అత్యంత ప్రాధాన్యతనిచ్చే భాగస్వామ్యం.. రీసెట్ బటన్ను నొక్కడానికి ఇది మంచి సమయం.. నేను మళ్లీ మైదానంలోకి రావాల్సిన సమయం వచ్చింది. అదే శక్తి, ఉత్సాహంతో టీమ్ ఇండియా కొంత మంది కొత్త, మరికొంత పాత ముఖాలతో మైదానంలోకి దిగనుంది. ఇది టీమ్ ఇండియా, ఇది మీ కెప్టెన్ రోహిత్ శర్మ.’ అని అన్నాడు. ఆగస్టు 2 నుంచి మూడు వన్డేల సిరీస్లో శ్రీలంకతో భారత్ ఆడనుంది. సిరీస్లో చివరి మ్యాచ్ ఆగస్టు 7న జరగనుంది.
𝙏𝙝𝙞𝙨 𝙞𝙨 𝙮𝙤𝙪𝙧 𝘾𝙖𝙥𝙩𝙖𝙞𝙣 𝙍𝙤𝙝𝙞𝙩 𝙎𝙝𝙖𝙧𝙢𝙖 𝙨𝙥𝙚𝙖𝙠𝙞𝙣𝙜!🎙️ 🫡#TeamIndia | #SLvIND | @ImRo45 pic.twitter.com/jPIAwcBrU4
— BCCI (@BCCI) August 2, 2024
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!