Venkaiah Naidu: నేటి యువత సిద్ధాంతపర రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి..
- మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి శివాజీని పరామర్శించిన వెంకయ్య నాయుడు
- యువత సిద్ధాంతపర రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
Venkaiah Naidu: మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి శివాజీని ఆయన స్వగృహంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పరామర్శించారు. ఆంధ్ర ఉద్యమంలో ప్రజా ఉద్యమంలో యలమంచిలి శివాజీతో కలిసి పని చేశానని ఆయన తెలిపారు. సిద్ధాంతపర రాజకీయలు చేయకుండా కుల రాజకీయాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారని.. రాజకీయాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని వెంకయ్యనాయుడు అన్నారు. శాసనసభకి రూ. 30 కోట్లు ఖర్చు చేస్తున్నారని.. తాను రాజకీయాల్లో ఉన్నపుడు ప్రజలే డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారని ఆయన వెల్లడించారు. తనకు 500 రూపాయలు ఇచ్చి ఎన్నికల ఖర్చుకు వినియోగించండి అని ప్రజలే డబ్బులు ఇచ్చే వాళ్లని వెంకయ్య తెలిపారు. సిద్ధాంతపర రాజకీయాలు ఇప్పుడు ఉన్న సమాజంలో కరువు అయ్యాయన్నారు.
Read Also: Bulldozer Action: బహ్రైచ్ నిందితులపై బుల్డోజర్ యాక్షన్.. యోగి సర్కార్కి సుప్రీంకోర్టు వార్నింగ్..
Also Read
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
- Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
- Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
- PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్కు డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
నేటి యువత సిద్ధాంతపర రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. శాసనసభలో జరిగే విషయాలపై గ్రామాల్లో చర్చలు జరగడం లేదన్నారు. సోషల్ మీడియాలో కొంత మంచి కొంత చెడు జరుగుతుందని.. సమాచారాన్ని ఆయుధంగా వాడడం లేదన్నారు. ప్రసార సాధనాలకు, పత్రికలకు స్వేచ్ఛ నిజాయితీ ఉండాలని అన్నారు. అందుకే నేటి యువతకు అవగాహన చేయడానికే విద్యార్థులతో కాలేజీలకు వెళ్లి మాట్లాడుతున్నానని తెలిపారు. విలువలతో కూడిన రాజకీయాలు, శాసనసభలో మాట్లాడే భాషలో మార్పు రావాలన్నారు. బూతులు తిట్టే రాజకీయ నాయకులకు బూత్లోనే సమాధానం చెప్పాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
-
Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
-
Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!