Lakshmi Narayana: భారత్ అనే పేరు మార్చినంత ఈజీగా దేశంలో సమస్యలు పోవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యాంగంలో ఇండియాతో పాటు భారత్ అని ముందే ఉంది అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. ఇండియా అని బ్రిటీష్ వాళ్ళు ఇచ్చిన పేరు.. దేశం పేరు భారత్ గా మారుస్తున్నారని ప్రచారం జరుగుతుంది.. భారత్ గా మార్చటం తప్పేం కాదు.. ఇందుకు రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. అయితే, భారత్ గా మార్చినంత మాత్రాన దేశంలో సమస్యలు పోవు అని సీబీఐ మాజీ జెడీ లక్ష్మినారాయణ తెలిపారు.
Read Also: Vijay Deverakonda: విజయ్ ఇచ్చే లక్ష కావాలంటే ఆ పని చేయాల్సిందే..
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
పేరు విషయం వల్ల అసలు విషయాలు పక్క దారి పట్టకుండా చూడాలి అని సీబీఐ మాజీ జెడీ లక్ష్మినారాయణ చెప్పుకొచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్, ఎయిమ్స్ ఇలా అనేక వారి పేర్లను ఎలా మారుస్తరనేది చూడాలన్నారు. భారత్ గా పేరు మార్పుకు ప్రజాభిప్రాయం అవసరం లేదు.. ప్రజలతో ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ఆమోదం తప్పనిసరిగా సవరణ సమయంలో ఉంటుంది.. ప్రతిపక్షాల కూటమి పేరు ఇండియా కాబట్టి భారత్ పేరు పెడుతున్నారని రాజకీయ విమర్శలు వస్తున్నాయ్ అని ఆయన తెలిపారు.
Read Also: Bihar: దేశానికి ప్రధాని ఎలా ఉండాలి, నితీష్ కుమార్లా ఉండాలి…! బీహార్లో విద్యార్థులు నినాదాలు
ఈ సందర్భంగా తెలుగు భాష గురించి సీబీఐ మాజీ జెడీ లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. మా చిన్నతనంలో చదువు చెప్పిన గురువుగారిని కలిసి వచ్చాను.. 30 సంవత్సరాల తరువాత తెలుగు ఎవరైనా మాట్లాడతారా అనే భయం ఉంది.. ఆంగ్లభాష వల్ల మాత్రమే ఉద్యోగాలు రావడం లేదు.. ఆ ధోరణి మారాలి అని ఆయన పేర్కొన్నారు. తెలుగు భాషను ఎలా రక్షించాలో అన్నదానిపై మాట్లాడాలి.. శ్వాసించినంత వరకే మనం, భాషించినంత వరకే మన భాష అని మాజీ జెడీ పేర్కొన్నారు.
Read Also: Kottu Satyanarayana: చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం.. తండ్రి బ్రోకర్.. కొడుకు జోకర్..
మనకు వంద విశ్వనాథ సత్యనారాయణలు, వంద కందుకూరి వీరేశలింగంలు కావాలి అని లక్ష్మినారాయణ అన్నారు. చైనా వాళ్ళకి ఇంగ్లీషు రాదు… అయినా వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు.. 90శాతం నోబుల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు మాతృభాషలో మాట్లాడేవాళ్ళు.. వాడుకే మనం భాషకు చేసే వేడుక.. ఇంగ్లీషు భాషను కాటుక లాగా మాత్రమే వాడాలి.. విజ్ఞాన వేత్తల ఆలోచనలను పాలకులు తెలుసుకోవాలి అని సీబీఐ మాజీ జెడీ లక్ష్మినారాయణ అన్నారు.
తాజావార్తలు
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!