Errabelli Dayakar Rao : కాంగ్రెస్ పాలనలో ధర్నా చేయని రోజు ఉందా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన వరంగల్ జిల్లాలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రైతు కాదు, బ్రోకర్, పైరవీకారుడని దేశమంతా తెలుసు అని విమర్శించారు. రైతులను అవమానపరిచినందుకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పే వరకు వదిలి పెట్టమని ఆయన అన్నారు. 8 రోజులపాటు ఉద్యమిస్తామని, రైతులకు కాంగ్రెస్ మోసాలపై అవగాహన కల్పించి గుణపాఠం చెప్పేలా చేస్తామని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించి ఘోరంగా మాట్లాడారని, రైతులంతా సమావేశమై కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలని తీర్మాణాలు చేశారన్నారు.
Also Read : Sabitha Indra Reddy : ఢిల్లీ తరహా విద్యా విధానాన్ని ఇక్కడ అమలు చేయబోతున్నాం
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి ఒక్కటే అడుగుతున్నా… టీడీపీలో ఉన్నప్పుడు నాతో పని చేశారు. కాంగ్రెస్ హాయాంలో కరెంట్ సమస్యతో ఎండిపోయిన పంటలను ప్రదర్శిస్తూ అసెంబ్లీ వద్ద ఆందోళన చేయలేదా? కాంగ్రెస్ పాలనలో ధర్నా చేయని రోజు ఉందా? కిరణ్ కుమార్ రెడ్డి కరెంట్ వైర్లపై బట్టలు ఎండవేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. ఒక గంట కరెంట్ కు ఎకరం పారుతుందని అంటున్నారు.
Also Read : Ananya Nagalla : ఆ విషయం లో తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..
కాళేశ్వరం ప్రాజెక్టు లక్షకోట్లు ఖర్చు చేశారని అబద్దాలు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తో నే భూగర్భ జలాలు పెరిగాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా 24గంటల కరెంట్ ఇస్తున్నారా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఏం చేశారో చెప్పండి.
రైతులను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు రైతుకు పిల్లను కూడా ఇవ్వని పరిస్థితి ఉండేది. కేసిఆర్ పాలనలో ఎంత భూమి ఉందని అడిగి పిల్లను ఇస్తున్నారు. కేసిఆర్ కృషి తో రైతుల ఆస్తుల విలువ పెరిగింది. రైతు రాజ్యం కేసిఆర్ దయవల్ల వచ్చింది.’ అని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!