Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Emergency Was A Black Spot On Indias Democracy Pm Modi

PM Modi: దేశ చరిత్రలో ‘ఎమర్జెన్సీ’ ఒక మచ్చ.. ఆ పొరపాటు మళ్లీ జరగొద్దు

Published Date :June 24, 2024 , 3:32 pm
By Rajesh Veeramalla
  • కొనసాగుతున్న 18వ లోక్‌సభ తొలి సమావేశాలు
  • ప్రధాని నరేంద్ర మోడీ సహా కొత్తగా ఎన్నికైన సభ్యులందరూ ప్రమాణ స్వీకారం
  • సెషన్‌కు ముందు ప్రసంగించిన ప్రధాని మోడీ
  • ఎమర్జెన్సీని ప్రస్తావించిన ప్రధాని
PM Modi: దేశ చరిత్రలో ‘ఎమర్జెన్సీ’ ఒక మచ్చ.. ఆ పొరపాటు మళ్లీ జరగొద్దు
  • Follow Us :
  • google news
  • dailyhunt

18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈరోజు (సోమవారం) ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ సహా కొత్తగా ఎన్నికైన సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. సెషన్‌కు ముందు ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. సభ్యులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు ప్రజాస్వామ్యానికి గర్వకారణమని అభివర్ణించారు. అంతేకాకుండా.. ఎమర్జెన్సీని ప్రస్తావించారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా జీవించడం గురించి మాట్లాడారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈరోజు అద్భుతమైన రోజు అని ప్రధాని మోడీ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ ప్రమాణ స్వీకారోత్సవం కొత్త పార్లమెంట్‌ భవనంలో జరుగుతోంది. కొత్తగా ఎన్నికైన ఎంపీలందరికీ ప్రధాని మోడీ హృదయపూర్వకంగా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.

Read Also: Kodanda Reddy: ఇది చారిత్రక నిర్ణయం.. మాటకు కట్టుబడి సీఎం రుణమాఫీ చేస్తున్నారు..

Also Read

  • E85 Petrol: పెట్రోల్‌లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
  • Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
  • UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్‌కు లాభం, పాకిస్తాన్‌కు నష్టం..
  • Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!

18వ లోక్‌సభ ఏర్పాటు వల్ల సామాన్య ప్రజల సంకల్పం నెరవేరుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కొత్త ఉత్సాహంతో కొత్త ఊపును, కొత్త ఎత్తులను సాధించడానికి ఇది చాలా ముఖ్యమైన అవకాశం. 2047 నాటికి మెరుగైన భారతదేశాన్ని, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో 18వ లోక్‌సభ ఈరోజు ప్రారంభమవుతుందని మోడీ తెలిపారు. ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి.. ఎందుకంటే దేశ ప్రజలు వరుసగా మూడవసారి ప్రభుత్వానికి సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారని అన్నారు. ఇది స్వతహాగా చాలా గర్వించదగ్గ విషయం. రాజ్యాంగ గౌరవాన్ని పాటిస్తూనే నిర్ణయాలను వేగవంతం చేయాలనుకుంటున్నాను. సభ్యులందరినీ కలుపుకొని 2047 వికసిత భారత్‌ సంకల్పం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా సాగుతాం. కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని మనమంతా ముందుకెళ్దాం’’ అని ఎంపీలకు పిలుపునిచ్చారు. 18వ లోక్‌సభలో యువ ఎంపీల సంఖ్య బాగానే ఉందని ప్రధాని మోడీ తెలిపారు. భారతీయ సంస్కృతి, వారసత్వంలో 18వ సంఖ్యకు గొప్ప సాత్విక విలువ ఉందని చెప్పారు.

Read Also: Renuka Swamy: రేణుకా స్వామి నాకు కూడా అసభ్యకరమైన మెసేజులు పంపాడు.. మరో కన్నడ నటి సంచలనం!

ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ‘ఎమర్జెన్సీ’ గురించి ప్రస్తావించారు. భారతదేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలపై నమ్మకం ఉన్నవారికి జూన్ 25 మరపురాని రోజు అని తెలిపారు. భారత ప్రజాస్వామ్యం జూన్ 25తో తుడిచిపెట్టుకుపోయి 50 ఏళ్లు పూర్తవుతోంది. దేశ ప్రజాస్వామ్య చర్రితలో ఎమర్జెన్సీ ఓ మచ్చలా మిగిలిపోయింది. 50ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు పునరావృతం కాకూడదు’’ అని మోడీ పేర్కొన్నారు. తమ బాధ్యతలు మూడు రెట్లు పెరిగాయి.. మూడో టర్మ్‌లో మూడు రెట్లు కష్టపడి పనిచేస్తామని దేశప్రజలకు హామీ ఇస్తున్నానని మోడీ తెలిపారు. కొత్త ఎంపీల పట్ల దేశం చాలా అంచనాలు పెట్టుకుందని ప్రధాని మోడీ చెప్పారు. ప్రజాప్రయోజనాలు, ప్రజా సేవ కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎంపీలను కోరారు. అభివృద్ధి చెందిన భారతదేశం అనే మన సంకల్పాన్ని నెరవేర్చడం మనందరి బాధ్యత. అందరూ కలిసి ఆ బాధ్యతను నిర్వర్తించాలని మోడీ తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • a black spot
  • Emergency
  • India's Democracy
  • Loksabha Sessions
  • PM Modi

తాజావార్తలు

  • Mukesh Ambani: స్టాక్ మార్కెట్‌లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?

  • E85 Petrol: పెట్రోల్‌లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..

  • Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..

  • Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!

  • UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్‌కు లాభం, పాకిస్తాన్‌కు నష్టం..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions