Crime: డీజిల్ మాఫియా గుట్టు రట్టు.. రూ.35 లక్షల విలువైన ఇంధనం స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: రాష్ట్రంలో డీజిల్ మాఫియా రోజు రోజుకూ చెలరేగుతోంది.దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. దానికి అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఓటీ అధికారులు రంగంలోకి దిగారు. తెలంగాణలో అక్రమంగా డీజిల్ అమ్ముతున్న ముఠా గట్టు రట్టు చేశారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో డీజిల్ రేటు తక్కువగా(రూ.9 వ్యత్యాసం) ఉండటంతో అక్కడి నుంచి అక్రమంగా తీసుకువచ్చి హైదరాబాదులో విక్రయిస్తున్న ముఠాను పట్టకున్నారు. వట్టినాగులపల్లి లో తనిఖీలు నిర్వహించిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు రూ.35 లక్షలు విలువచేసే డీజిల్ ని పట్టుకున్నారు. కర్ణాటక నుండి తెలంగాణకు డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న7 మందిని అరెస్టు చేసి.. వారి నుంచి డీజిల్, ఫిలింగ్ మోటర్, జనరేటర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మాఫియాకు సంబంధించి ప్రధాన నిందితుడు రాధాకృష్ణ కోసం రాష్ట్రంలో గాలింపు చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో డీజిల్ మాఫియాకి కీలక సూత్రధారిగా ఉన్న రాధాకృష్ణ.. గతంలో చాలా సార్లు పోలీసులకు పట్టుబడ్డట్లు విచారణలో తేలింది.
READ MORE: UPSC: కేంద్ర సాయుధ బలగాల్లో 506 పోస్టులకు నోటిఫికేషన్.. డిగ్రీ ఉంటే చాలు..
Also Read
- 705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
- అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
నిందితుడు రాధాకృష్ణ కోట్ల రూపాయల డీజిల్ ను కర్ణాటక నుంచి తెలంగాణకు స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ స్మగ్లింగ్ ద్వారా నెలకు రూ.కోట్లలో తెలంగాణా రాష్ట్ర ఖజానాకు గండ్డి పడుతోంది. నిందితుడు రాధాకృష్ణ హైదరాబాద్ లో ఉన్న డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ నడుపుతున్న మరో స్మగ్లర్ సూర్య అలియాస్ సాయి రామ్ సూర్యకు సప్లయి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ యజమాని తన మేనేజర్ అయిన రితేష్ ద్వారా చిన్న చిన్న టాంకర్లకు మార్చి స్థానికంగా ఉన్న ఇసుక లారీలకు, క్వారీ లారీలకు, డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ యాప్ ద్వారా సంప్రదించిన కన్జూమర్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. గత నెలలో కూడా రాధాకృష్ణ ఇదే ప్లేస్ లో 18000 లీటర్స్ డీజిల్ అఫిషియల్ ట్యాంకర్ ద్వారా సప్లయి చేస్తూ.. సైబరాబాద్ ఎస్ఓటీ అధికారులకు చిక్కాడు. ప్రస్తుతం పరారిలో ఉన్న నిందితుడిపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో సైతం కేసులు ఉన్నాయి.
తాజావార్తలు
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!