Crime: డీజిల్ మాఫియా గుట్టు రట్టు.. రూ.35 లక్షల విలువైన ఇంధనం స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: రాష్ట్రంలో డీజిల్ మాఫియా రోజు రోజుకూ చెలరేగుతోంది.దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. దానికి అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఓటీ అధికారులు రంగంలోకి దిగారు. తెలంగాణలో అక్రమంగా డీజిల్ అమ్ముతున్న ముఠా గట్టు రట్టు చేశారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో డీజిల్ రేటు తక్కువగా(రూ.9 వ్యత్యాసం) ఉండటంతో అక్కడి నుంచి అక్రమంగా తీసుకువచ్చి హైదరాబాదులో విక్రయిస్తున్న ముఠాను పట్టకున్నారు. వట్టినాగులపల్లి లో తనిఖీలు నిర్వహించిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు రూ.35 లక్షలు విలువచేసే డీజిల్ ని పట్టుకున్నారు. కర్ణాటక నుండి తెలంగాణకు డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న7 మందిని అరెస్టు చేసి.. వారి నుంచి డీజిల్, ఫిలింగ్ మోటర్, జనరేటర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మాఫియాకు సంబంధించి ప్రధాన నిందితుడు రాధాకృష్ణ కోసం రాష్ట్రంలో గాలింపు చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో డీజిల్ మాఫియాకి కీలక సూత్రధారిగా ఉన్న రాధాకృష్ణ.. గతంలో చాలా సార్లు పోలీసులకు పట్టుబడ్డట్లు విచారణలో తేలింది.
READ MORE: UPSC: కేంద్ర సాయుధ బలగాల్లో 506 పోస్టులకు నోటిఫికేషన్.. డిగ్రీ ఉంటే చాలు..
Also Read
- Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
నిందితుడు రాధాకృష్ణ కోట్ల రూపాయల డీజిల్ ను కర్ణాటక నుంచి తెలంగాణకు స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ స్మగ్లింగ్ ద్వారా నెలకు రూ.కోట్లలో తెలంగాణా రాష్ట్ర ఖజానాకు గండ్డి పడుతోంది. నిందితుడు రాధాకృష్ణ హైదరాబాద్ లో ఉన్న డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ నడుపుతున్న మరో స్మగ్లర్ సూర్య అలియాస్ సాయి రామ్ సూర్యకు సప్లయి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ యజమాని తన మేనేజర్ అయిన రితేష్ ద్వారా చిన్న చిన్న టాంకర్లకు మార్చి స్థానికంగా ఉన్న ఇసుక లారీలకు, క్వారీ లారీలకు, డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ యాప్ ద్వారా సంప్రదించిన కన్జూమర్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. గత నెలలో కూడా రాధాకృష్ణ ఇదే ప్లేస్ లో 18000 లీటర్స్ డీజిల్ అఫిషియల్ ట్యాంకర్ ద్వారా సప్లయి చేస్తూ.. సైబరాబాద్ ఎస్ఓటీ అధికారులకు చిక్కాడు. ప్రస్తుతం పరారిలో ఉన్న నిందితుడిపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో సైతం కేసులు ఉన్నాయి.
తాజావార్తలు
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!