Jakkampudi Raja: ఎన్ని కుయుక్తులు పన్నినా.. జగన్ ప్రవాహాన్ని అడ్డుకోలేరు!
- రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందింది
- జనాన్ని చూసి ఓర్వలేక ఆంక్షలు
- గతంలో ఎవరు ఇన్ని ఆంక్షలు పెట్టలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా అన్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేక పోలీసులు ఆంక్షలు విధించారని మండిపడ్డారు. ఎన్ని కుయుక్తులు పన్నినా.. జగన్ ప్రవాహాన్ని అడ్డుకోలేరన్నారు. గతంలో ఎవరు ఇన్ని ఆంక్షలు పెట్టలేదని ఫైర్ అయ్యారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అవసరం వచ్చినప్పుడు సరైన గుణపాఠం చెబుతారు అని జగ్గంపూడి రాజా పేర్కొన్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో మాజీ సీఎం వైఎస్ పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ కాన్వాయ్తో పాటు మూడు వాహనాలు, వంద మందికి మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందింది. రాష్ట్రంలో వైఎస్ జగన్కు వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేక పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్ ప్రవాహాన్ని అడ్డుకోలేరు. గతంలో ఎవరు ఇన్ని ఆంక్షలు పెట్టలేదు. మీ పరామర్శలకు ఇన్ని ఆంక్షలు ఉన్నాయో ఓసారి గుర్తుచేసుకోండి’ అని అన్నారు.
Also Read
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
- New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
Also Read: YS Jagan: రెంటపాళ్లకు మాజీ సీఎం జగన్.. అడుగడుగునా నీరాజనం!
‘కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో సంక్షేమ పథకాలను తెప్ప తగలేశారు.సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం డబ్బులు ఏవి?. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఈనెల 23న రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళన చేస్తాం. వాలంటీర్లు నెత్తిన శఠగోపం పెట్టారు. ఎండీయూ వాహనాలను తొలగించి రేషన్ కోసం ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు’ అని జగ్గంపూడి రాజా మండిపడ్డారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!