Raghunandan Rao : రాహుల్ గాంధీకి HCU కనిపించడం లేదా
- హెచ్సీయూ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ధర్నా
- ప్రభుత్వ భూముల అమ్మకం ఆపాలని డిమాండ్
- HCU భూముల అమ్మకం.. పర్యావరణ పరిరక్షణలో ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghunandan Rao : ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ధర్నా నిర్వహించారు. HCU భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. HCU భూముల వేలాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ఎకరా భూమి 80 – 100 కోట్ల రూపాయలు ఉందన్నారు బీజేపీ ఎంపీలు. విద్యార్దులు ఉద్యమాలు చేస్తుంటే పోలీసులను ఉసి గోల్పి జైళ్ళ పాలు చేస్తుందని, విశ్వ విద్యాలయ భూమిని నాశనం చేస్తూ పర్యావరణానికి నష్టం కలగజేస్తున్నారని బీజేపీ ఎంపీలు వ్యాఖ్యానించారు.
ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. హెచ్సీయూకి ఇందిరమ్మ ఇచ్చిన 2400 ఎకరాల భూమిలో 400 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డికి అమ్ముకునే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. హైడ్రా పేరుతో పర్యావరణాన్ని కాపాడుతామని హెచ్సీయూ భూముల విషయంలో పర్యావరణానికి నష్టం చేస్తున్నారని, పర్యావరణ పరిరక్షణ కు ఎన్జీటి లో పిటిషన్ వేస్తామన్నారు. హైకోర్టు లో పిల్ పై విచారణ జరగబోతుందని, రాహుల్ గాంధీకి HCU కనిపించడం లేదా అని ఆయన మండిపడ్డారు. జంతర్ మంతర్ లో ధర్నా ముగిసిన తరువాత రాహుల్ గాంధీ హెచ్సీయూకి రావాలన్నారు. 2024లో ప్రైవేట్ వ్యక్తుల భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని, భూముల అమ్మకాన్ని ఆపేందుకు పోరాడుతామని రఘునందర్ రావు తెలిపారు.
Also Read
కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేశారని బీఆర్ఎస్ను కాంగ్రెస్ విమర్శించి, ఇప్పుడు భూములు అమ్ముతూ అదే తప్పు చేస్తున్నారని, విశ్వవిద్యాలయ భూములు అమ్ముతూ పర్యావరణానిక నష్టం చేస్తున్నారన్నారు. విద్యార్ధులపై కేసులు తొలగించాలని, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ ను కలిసి పరిస్థితి వివరించామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి అయితే ఏదైనా చేయొచ్చా అని ఆయన వ్యాఖ్యానించారు. భూముల వేలాన్ని ఆపుతామని, అవసరమైతే కోర్టుకు వెళతామని ఆయన తెలిపారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హెచ్సీయూ భూముల వేలాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరా భూమి 80 – 100 కోట్ల రూపాయలు ఉందని, విద్యార్దులు ఉద్యమాలు చేస్తుంటే పోలీసులను ఉసి గోల్పి జైళ్ళ పాలు చేస్తుందన్నారు ఈటల రాజేందర్. విశ్వ విద్యాలయ భూమిని నాశనం చేస్తూ పర్యావరణానీకి నష్టం కలగజేస్తున్నారని, ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని రియల్ ఎస్టేట్ చేస్తున్నారని, భూములను అమ్మితే ఊరుకోం ఖబడ్దార్ అని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్ధులకు అండగా బీజేపీ ఉంటుందని, విద్యార్ధుల పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.
Arya2 : ఆర్య 2 రీరిలీజ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!