Raghunandan Rao : రాహుల్ గాంధీకి HCU కనిపించడం లేదా
- హెచ్సీయూ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ధర్నా
- ప్రభుత్వ భూముల అమ్మకం ఆపాలని డిమాండ్
- HCU భూముల అమ్మకం.. పర్యావరణ పరిరక్షణలో ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghunandan Rao : ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ధర్నా నిర్వహించారు. HCU భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. HCU భూముల వేలాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ఎకరా భూమి 80 – 100 కోట్ల రూపాయలు ఉందన్నారు బీజేపీ ఎంపీలు. విద్యార్దులు ఉద్యమాలు చేస్తుంటే పోలీసులను ఉసి గోల్పి జైళ్ళ పాలు చేస్తుందని, విశ్వ విద్యాలయ భూమిని నాశనం చేస్తూ పర్యావరణానికి నష్టం కలగజేస్తున్నారని బీజేపీ ఎంపీలు వ్యాఖ్యానించారు.
ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. హెచ్సీయూకి ఇందిరమ్మ ఇచ్చిన 2400 ఎకరాల భూమిలో 400 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డికి అమ్ముకునే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. హైడ్రా పేరుతో పర్యావరణాన్ని కాపాడుతామని హెచ్సీయూ భూముల విషయంలో పర్యావరణానికి నష్టం చేస్తున్నారని, పర్యావరణ పరిరక్షణ కు ఎన్జీటి లో పిటిషన్ వేస్తామన్నారు. హైకోర్టు లో పిల్ పై విచారణ జరగబోతుందని, రాహుల్ గాంధీకి HCU కనిపించడం లేదా అని ఆయన మండిపడ్డారు. జంతర్ మంతర్ లో ధర్నా ముగిసిన తరువాత రాహుల్ గాంధీ హెచ్సీయూకి రావాలన్నారు. 2024లో ప్రైవేట్ వ్యక్తుల భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని, భూముల అమ్మకాన్ని ఆపేందుకు పోరాడుతామని రఘునందర్ రావు తెలిపారు.
Also Read
- Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
- PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
- Towel Cleaning Tips: టవల్ ఉతికినా దుర్వాసన పోవట్లేదా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్
- Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ "పన్నీర్ టిక్కా"ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేశారని బీఆర్ఎస్ను కాంగ్రెస్ విమర్శించి, ఇప్పుడు భూములు అమ్ముతూ అదే తప్పు చేస్తున్నారని, విశ్వవిద్యాలయ భూములు అమ్ముతూ పర్యావరణానిక నష్టం చేస్తున్నారన్నారు. విద్యార్ధులపై కేసులు తొలగించాలని, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ ను కలిసి పరిస్థితి వివరించామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి అయితే ఏదైనా చేయొచ్చా అని ఆయన వ్యాఖ్యానించారు. భూముల వేలాన్ని ఆపుతామని, అవసరమైతే కోర్టుకు వెళతామని ఆయన తెలిపారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హెచ్సీయూ భూముల వేలాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరా భూమి 80 – 100 కోట్ల రూపాయలు ఉందని, విద్యార్దులు ఉద్యమాలు చేస్తుంటే పోలీసులను ఉసి గోల్పి జైళ్ళ పాలు చేస్తుందన్నారు ఈటల రాజేందర్. విశ్వ విద్యాలయ భూమిని నాశనం చేస్తూ పర్యావరణానీకి నష్టం కలగజేస్తున్నారని, ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని రియల్ ఎస్టేట్ చేస్తున్నారని, భూములను అమ్మితే ఊరుకోం ఖబడ్దార్ అని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్ధులకు అండగా బీజేపీ ఉంటుందని, విద్యార్ధుల పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.
Arya2 : ఆర్య 2 రీరిలీజ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్
తాజావార్తలు
-
Jung Ho-Yeon: ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన తొలి కొరియన్ నటి.. ‘స్క్విడ్ గేమ్’ స్టార్ మరో అరుదైన ఘనత
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
-
RAAKA: ‘రాకా’లో తెలుగు బ్యూటీ ఎంట్రీ…. అల్లు అర్జున్ సినిమాతో సిరి హనుమంతుకు బిగ్ బ్రేక్!
-
Towel Cleaning Tips: టవల్ ఉతికినా దుర్వాసన పోవట్లేదా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్
ట్రెండింగ్
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!