Atmakur Bypoll: వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆత్మకూరు ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రైతు సోదరుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య కుమార్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, టీజీ వెంకటేష్. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీజేపీ నేతలు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో రాష్ట్ర మంత్రులు ఉండి కూడా ఏ మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ప్రాంతాన్ని ఏమీ పట్టించుకోలేదన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీకి ఓటమి భయంతో వీధికో ఎమ్మెల్యే, గ్రామానికో మంత్రితో ప్రచారం చేయిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుండి రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఇసుక మాఫియా..లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, రివర్స్ టెండరింగ్ మాఫియా, వైసీపీ ప్రభుత్వమే ఓ మాఫియా. మద్యం షాపుల్లో నగదు లావాదేవీలు ఉంటే గోల్ మాల్ చేయొచ్చని ఆన్ లైన్ పేమెంట్లు అందుబాటులో ఉంచలేదు. ఆంధ్ర ప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ లేదు,ప్రజలకు రక్షణ లేదన్నారు సీఎం రమేష్. బీజేపీ అభ్యర్థి తరఫున బీజేపీ సీనియర్ నేతలు ఆత్మకూరులో ప్రచారం నిర్వహిస్తున్నారు.
Also Read
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
- RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Mothers Day Special: మాతృత్వానికి ప్రణామం.. సృష్టికి ప్రతిరూపం.. సహనానికి నిలువుటద్దం “అమ్మ”
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్