Pasham Sunil Kumar: నెల్లూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కు తృటిలో ప్రమాదం తప్పింది. గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ప్రయాణిస్తున్న కారు ముందున్న వాహనాన్ని ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అందిన సమాచారం ప్రకారం.. కావలి సమీపంలోని సున్నంబట్టి ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఎమ్మెల్యే కారు బలంగా ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. ప్రమాదం తీవ్రతకు కారుకు ముందు భాగం దెబ్బతినింది. LPG…
Pawan Kalyan: పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్థులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కదిలించింది. బురద రోడ్డులో ప్రతిరోజూ స్కూలుకు వెళ్లేందుకు వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు పవన్. వెంటనే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు…
Pulicat Flamingo Festival: ప్రకృతి ఆరాధకులకు, పక్షుల ప్రేమికులకు పండుగ సమయం వచ్చేసింది. నెల్లూరు , తిరుపతి జిల్లాల సరిహద్దులోని పులికాట్ సరస్సు తీరానికి ఖండాంతరాలు దాటి వచ్చిన విదేశీ పక్షుల సందడి మొదలైంది. ఈ విశిష్ట అతిథుల రాకను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక ‘ఫ్లెమింగో ఫెస్టివల్’ (పక్షుల పండుగ) ఈ ఏడాది జనవరి 10 , 11 తేదీల్లో అత్యంత వైభవంగా జరగనుంది. ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు సరిహద్దుల్లో దాదాపు 620…
ఇన్నాళ్లు సైలెంట్ మోడ్లో ఉన్న ఆ వైసీపీ లీడర్ ఉన్నట్టుండి ఎందుకు యాక్టివ్ అయ్యారు. ఆరోగ్య సమస్యలున్నాసరే… పడుతూ లేస్తూనే… పర్యటనలు చేయడానికి కారణాలేంటి? పార్టీ అధ్యక్షుడి నుంచి ఆయనకేదైనా భరోసా దక్కిందా? ఎవరా లీడర్? ఆయన చెబుతున్న ఈక్వేషన్స్ అండ్ పొలిటికల్ కేలిక్యులేషన్స్ ఏంటి? నెల్లూరు జిల్లా పొలిటికల్ స్క్రీన్ మీది నుంచి కొన్నేళ్ళు కనుమరుగైన మాజీ ఎమ్మెల్యే తాజా కదలికలు ఆసక్తి రేపుతున్నాయి. రాజకీయ ఉనికి చాటుకోవడానికి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పట్నుంచే…
Nellore Lady Don: నెల్లూరు లేడీ డాన్ అరుణకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జైలు నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
Nellore: నెల్లూరు కార్పొరేషన్ లో హైడ్రామా కొనసాగుతుంది. డిసెంబర్ 18వ తేదీన మేయర్ స్రవంతి పై అవిశ్వాస తీర్మానం కోసం కౌన్సిల్ సమావేశానికి నిర్ణయం తీసుకుంది.
ఏపీని తుఫాన్లు వెంటాడుతున్నాయి. మొన్న ‘మొంథా’ తుఫాన్ మిగిల్చిన నష్టాలకు పరిహారం కూడా అందక మునుపే.. ‘దిత్వా’ తుఫాన్ దూసుకొచ్చింది. వాయుగుండం నుంచి అల్ప పీడనంగా బలహీనపడినప్పటికీ.. పలు జిల్లాలపై మాత్రం పెను ప్రభావం చూపింది. నవంబర్ 30న తుఫాన్ ప్రభావం మొదలైనప్పటికీ.. మొదటి మూడు రోజులు మోస్తరు వానలే పడ్డాయి. మంగళవారం (డిసెంబర్ 2) నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దిత్వా దెబ్బకు నెల్లూరు జిల్లా వణికిపోయింది. Also Read: Daily Horoscope: గురువారం…
సూది మొన దూరే సందున్నా.. పొలిటికల్ మైలేజ్ కోసం పాకులాడే సింహపురిలో…. ఇప్పుడు అంతకు మించిన కథ నడుస్తోందా? మేయర్ స్రవంతి ఇటు టీడీపీకి, అటు వైసీపీకి కాకుండా పోయారా? తిరిగి వైసీపీకి దగ్గరయ్యేందుకు ఆమె సరికొత్త ఆట ఆడుతున్నారా? అందుకు వైసీపీ రియాక్షన్ ఏంటి? తెలుగుదేశం కౌంటర్స్ ఎలా ఉన్నాయి? సింహపురి పాలిటిక్స్ ఎప్పుడూ హాటే. అంతకు మించి ఎప్పుడు ఎవరు ఎవర్ని విమర్శిస్తారో అర్థం కాని వాతావరణం ఉంటుంది. నిన్నటిదాకా… అనుబంధాలు, ఆప్యాయతలు ఒలకబోసుకున్న…
జనసేన సంస్థాగత నిర్మాణంపై పవన్కళ్యాణ్ దృష్టి పెట్టారా? అందుకే ఆ జిల్లాలో నేనే బాస్ అన్నట్టు వ్యవహరిస్తున్న నేతకు చెక్ పెట్టారా? పార్టీ లైన్లో లేనప్పుడు ఎవరైతే నాకేంటి అంటూ తోక కత్తిరించేశారా? ఏ జిల్లాలో జరుగుతోందా వ్యవహారం? ఏ నాయకుడి విషయంలో పైకి కనిపించని కత్తిరింపులు చేశారు పవన్? రాష్ట్ర మంతటా సంస్థాగతంగా బలపడే ప్రయత్నాల్లో ఉన్న జనసేనకు నెల్లూరు జిల్లాలో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయట. సొంతోళ్ళ వెన్నుపోట్లే అందుకు కారణం అన్నది పార్టీ…
Nellore: నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్లో సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు సముద్రంలో గల్లంతై మరణించారు. ఆదివారం సెలవు కావడంతో ఈతకు వెళ్లి విగత జీవులుగా మారిన ఈ ఘటన స్థానికంగా విషాదం మిగిలించింది. ఈరోజు (ఆదివారం) మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. నెల్లూరు నగరంలోని కోటమిట్ట, నారాయణరెడ్డిపేట ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులు మైపాడు బీచ్కు చేరుకున్నారు. వీరంతా ఇంటర్మీడియట్…