Bandi Sanjay: డిక్లరేషన్ పేరుతో ఓట్లు దండుకుని మోసం చేసే పార్టీ బీజేపీ కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికలొస్తుంటే డిక్లరేషన్ పేరుతో ఓట్లు దండుకుని మోసం చేసే పార్టీ బీజేపీ కాదు అని బండి సంజయ్ అన్నారు. ఆచరణ సాధ్యమయ్యే హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరుస్తాం.. అందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వండి.. అట్టడుగునున్న చివరి వ్యక్తికి కూడా అంత్యోదయ ఫలాలు అందాలన్నదే బీజేపీ లక్ష్యం అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. లకిడీకాపూల్ లోని ఓ హోటల్ లో జరిగిన బీసీ మేధావుల సమావేశంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Priyank Kharge: ప్రియాంక్ ఖర్గేకు కీలక ఐటీ శాఖ కేటాయింపు.. ఎంబీ పాటిల్కు ఆ శాఖ!
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బీసీ సబ్ ప్లాన్, డిక్లరేషన్ పేరుతో ఓట్లు దండుకునే పార్టీలను, నాయకులను గుర్తించకపోతే బీసీలకు మరింత అణగారినవర్గాల వారుగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. బీజేపీ ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 27 మంది ఓబీసీలకు కేబినెట్ లో చోటు కల్పించిన చరిత్ర ఉందన్నారు. పార్టీ సంస్థాగత కమిటీల్లో బీసీలకు 30 శాతం పదవులు కేటాయించకపోతే.. వాటిని ఆమోదించే ప్రసక్తే ఉండదని ఆయన గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎప్పటికప్పుడు బీసీ మంత్రులు, ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమై బీసీల అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తారని బండి సంజయ్ చెప్పారు. బీసీల శక్తితోనే యూపీలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
Read Also: United World Wrestling: భారత రెజ్లర్లకు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ రెజ్లర్లు మద్ధతు
అణగారినవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలే అత్యధికంగా ఉన్నారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. వారిని దృష్టిలో ఉంచుకునే ప్రజా సంగ్రామ యాత్రలో ఉచిత విద్య, వైద్యం అమలు చేస్తామని, నిలువనీడ లేని వారికి ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తాను కార్యకర్త స్థాయి నుంచి వచ్చానని, అణగదొక్కితే ఆగిపోయే వ్యక్తిని కాదన్నారు. కేసీఆర్ కు తెలంగాణ ఉద్యమ నాయకత్వం అప్పగించడం వల్లే అణగారిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు నిరంతరం తపన పడుతున్నారని బండి సంజయ్ చెప్పారు. అందులో భాగంగానే ఏ పార్టీ చేయని విధంగా మేనిఫెస్టో ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్, డిక్లరేషన్ రూపకల్పన కోసం క్షేత్రస్థాయిలోకి వెళ్లి సలహాలు స్వీకరిస్తామన్నారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!