Bhumana Karunakara Reddy: తొక్కిసలాట ఘటనపై టీటీడీ మజీ ఛైర్మన్ రియాక్షన్..
- స్పందించిన టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకరరెడ్డి
- టీటీడీ, పోలీసులు, టీటీడీ నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్న భూమన
- పవన్ కళ్యాణ్ ఎక్కడని ప్రశ్నించిన మాజీ ఛైర్మన్
- బాధితులకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. “నెల రోజులుగా రోజుకో సమీక్ష పేరుతో వైకుంఠ ఏకాదశికి చేశారు.. పనిచేసేవాళ్ళు తక్కువై పోయారు. పర్యవేక్షించే వారు ఎక్కువై పోయారు. వ్యవస్థను పూర్తి గా వైఫల్యం చెందించారు. టీటీడీ, పోలీసులు, టీటీడీ నిఘా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందారు. క్రైమ్ డీఎస్పీ పద్మావతి పార్క్ లో పశువులు మంద తోలినట్లు భక్తులను తోలారు. గత ప్రభుత్వం హయంలో ఎంతో సమర్థవంతంగా పనిచేశాం. ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా అద్భుతంగా నిర్వహించాం. టీటీడీని రాజకీయ క్రీడా మైదానం గా మార్చారు. మీరు చేస్తున్న తప్పులతో భక్తులకు కష్టాలు తలెత్తాయి. టీటీడీ ఛైర్మన్ను కనీసం ఈవో, అడిషనల్ ఈవో పట్టించుకునే పరిస్థితి లేదు. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరీకి చంద్రబాబు సేవ తప్పా, భక్తులు సేవ లేదు. బ్రేక్ దర్శనాలు 7 వేలకు పైగా ఇస్తున్నారు. అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి దీనికి పూర్తి బాధ్యత వహించాలి.” అని భూమన వెల్లడించారు.
READ MORE: TTD EO Shyamala Rao: “ఆ వ్యక్తి వల్లే ఘటన జరిగింది?” తొక్కిసలాట ఘటనపై ఈవో క్లారిటీ..
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
భక్తులు సేవకు 15 మంది పోలీసులు లేరని.. సీఎం చంద్రబాబు వస్తున్నాడు అంటే 2వేలకు పైగా పోలీసులు మోహరించారని భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. “వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులును ఏవిధంగా అరెస్టు చేయించాలి అనే కుట్రలు చేస్తున్నారు. మేము వైకుంఠ ఏకాదశి దర్శనం రెండు రోజులు నుంచి పది రోజులకు పెంచి భక్తులకు అందుబాటులోకి తెచ్చాం. తమిళనాడు శ్రీరంగంలో పదిరోజులు దర్శనం తరహాలో తిరుమలలో అమలు చేశాం. భక్తులకు మేలైన నిర్ణయాలే తీసుకున్నాం. వాటిని మార్చలేరు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి. ఎస్పీ దగ్గర నుంచి కింది స్థాయిలో పోలీసులు, అడిషనల్ ఈవో వెంకన్న చౌదరీన లను సస్పెండ్ చేయాలి.” అని తెలిపారు.
READ MORE: KTR : ఏసీబీ కార్యాలయంకు వెళ్లేముందు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
“సనాతన ధర్మం పరిరక్షిస్తాను అని చెప్పిన పవనానందం స్వామి వారు మాట్లాడాలి. సనాతన ధర్మం కాపాడుత అని చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమి చేస్తున్నారు.గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్ కు వెళ్లి వస్తూ తిరుగు ప్రయాణంలో ఇద్దరు అభిమానులు చనిపోయారు.. రోడ్డు బాలేదని మమ్మల్ని విమర్శిస్తున్నారు. దేవుతో పెట్టుకుంటే ఆయనే చూస్తాడు అంటూ చంద్రబాబు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అదే జరిగింది. లడ్డు ప్రసాదంతో రాజకీయ ఆటలు అదితే స్వామి చూస్తారు. ఈరోజు శ్రీవారి లడ్డు ప్రసాదంలో అపవాదులు జరగడం, రాజకీయ పావుగా వాడుకుంటున్నారు. అందుకే ఈ ఘోరాలు జరుగుతున్నాయి. తిరుమల పవిత్రతను మేము కాపాడినట్లు, ఎవరు చేయలేదు. జగన్ మోహన్ రెడ్డి పై ఏడుపే తప్ప, పాలన లేదని కరుణాకరరెడ్డి అన్నారు. టీటీడీ ఈవోను బదిలీ చేయాలి. ఎస్పీ బదిలీ చేయాలి. చనిపోయిన. బాధితులకు కోటి రూపయలు, బాధితులకు 20 లక్షలు ఇవ్వాలి. ప్రభుత్వం బాధ్యత రాహిత్యంకు నిదర్శనం. క్యులైన్ పర్యవేక్షణ అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి ది , ఆయన్ను అరెస్టు చేయాలి. టీటీడీ ఈవో స్థాయి నుంచి ఎస్పీ అందరిపైనా వేటు వేయాలి.” అని టీటీడీ మాజీ ఛైర్మన్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!