బాబూ జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ వారసత్వాన్ని పుణిపుచ్చుకుని దేశ అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు జగజ్జీవన్ రామ్.. అట్టడుగు వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకే చంద్రబాబు పి 4 పథకం ప్రవేశ పెట్టారు..గత ప్రభుత్వం బాబూ జగజ్జీవన్ రామ్ విషయంలో చిన్న చూపు చూసింది.. దళితులు అంటేనే జగన్మోహన్ రెడ్డికి చులకన.. అందుకే…
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి, వైసీపీపైన ఆయన విరుచుకుపడ్డారు. కూటమి లక్ష్యం వైసీపీని ఖాళీ చేయడం.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20శాతం ఓట్లు రాకుండా చేయడమే మా లక్ష్యమని అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమక్షంలో పలువురు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు 150మందికి పైగా బీజెపీలో చేరారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. 60 అసెంబ్లీ సీట్లు వచ్చినప్పుడు సభకు వెళ్ళలేదు.. ఇప్పుడు ప్రజలు ఇవ్వకపోతే.. ప్రతిపక్ష…
తిరుమల శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో నిన్న జరిగిన తోపులాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో ఆరుగురు భక్తులు చనిపోయారు.మరికొందరు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు... అసలు ఏ సమయానికి ఏం జరిగింది. ఎలా జరిగింది... రెప్పపాటులో అంత ఘోరం ఎలా జరిగిపోయింది. ఘటన గురించి పూర్తిగా తెలుసుకుందాం..
ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి తొక్కిసలాట ఘటన బాధాకరమన్నారు. మృతుల సంఖ్యపై క్లారిటీ ఇచ్చారు. "చిన్న చిన్న దెబ్బలు తగిలిన అందరూ కోలుకుంటున్నారు.. ఒక వ్యక్తి కి ఫాక్చర్ గాయాలు ఉన్నాయి.. తొక్కిసలాట లో ఐదుగురు చనిపోయారు.. క్యూ లైన్ లో అస్వస్థత కు గురై ఒకరు చనిపోయారు..
తిరుమల చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం చూశామని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు అసమర్థత ఈ ఘటనతో స్పష్టమైందని విమర్శిచారు.. ఘటనకు కారణమెవరో కనుక్కోకుండా నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.. అధికారులను, టీటీడీ బోర్డును ఎవరు పెట్టారని ప్రశ్నించారు.. భక్తులకు సర్వీస్ చేయాలన్న ఉద్దేశ్యం ఎవరికి లేదన్నారు.. అధికారులు చంద్రబాబు దగ్గర భజన చేస్తూ తిరుగుతూ భక్తులను గాలికి వదిలేశారని విమర్శించారు.. గత ఏడాది వైసీపీ హయాంలో ఎలా చేశామో అందరూ చూశారన్నారు.…
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో నిన్న జరిగిన తోపులాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైంది.
తిరుమల శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో నిన్న జరిగిన తోపులాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో ఆరుగురు భక్తులు చనిపోయారు. మరికొందరు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు... అసలు ఏ సమయానికి ఏం జరిగింది. ఎలా జరిగింది? అనే పూర్తి వివరాలతో నివేదికను జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని అందులో పేర్కొన్నారు.
తిరుమల తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజులుగా రోజుకో సమీక్ష పేరుతో వైకుంఠ ఏకాదశికి చేశారు.. పనిచేసేవాళ్ళు తక్కువై పోయారు. పర్యవేక్షించే వారు ఎక్కువై పోయారు. వ్యవస్థను పూర్తి గా వైఫల్యం చెందించారు. టీటీడీ, పోలీసులు, టీటీడీ నిఘా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందారు. క్రైమ్ డీఎస్పీ పద్మావతి పార్క్ లో పశువులు మంద తోలినట్లు భక్తులను తోలారు. గత ప్రభుత్వం హయంలో ఎంతో సమర్థవంతంగా పనిచేశాం.
తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. క్షతగాత్రులు పద్మావతి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. వారిని ఈవో శ్యామలరావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారని.. 41 మందికి గాయాలయ్యాయని తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీకి సంబంధించి టీటీడీ తోపాటు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిందని... అయినా అనుకోకుండా ఈ ఘటన జరిగిందని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు.