Champions Trophy 2025: పాకిస్థాన్ ఔట్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడంటే?
- ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ
- పాకిస్థాన్ వద్ద ఆతిథ్య హక్కులు
- దక్షిణాఫ్రికాలో ఛాంపియన్స్ ట్రోఫీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ వద్ద ఉన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీ జరగనుంది. కరాచీ, లాహోర్, రావల్పిండి నగరాల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ను సిద్ధం చేసిన పీసీబీ.. ఐసీసీకి పంపింది. బీసీసీఐ కారణంగా కారణంగా ఐసీసీ ఇంకా షెడ్యూల్ను రిలీజ్ చేయని విషయం తెలిసిందే. అయితే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికి పీసీబీ అంగీకరించకపోతే.. టోర్నీ మొత్తాన్ని దక్షిణాఫ్రికాలో నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్కు వెళ్లి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత జట్టు సిద్ధంగా లేదు. టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తేనే పాల్గొంటామని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పింది. టీమిండియా ఆడే మ్యాచ్లను యూఏఈలో నిర్వహించాలని పీసీబీని ఐసీసీ కోరింది. ఐసీసీ ప్రతిపాదనకు పీసీబీ అంగీకరించలేదని తెలుస్తోంది. తమ ఆతిథ్య హక్కులను తగ్గిస్తే.. ఏకంగా టోర్నీని వీడాలని పాకిస్తాన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఇరు దేశాల మధ్య వివాదాలు పరిష్కారమయ్యే వరకు భారత్లో జరిగే ఏ ఐసీసీ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదని పాక్ భావిస్తోందట.
Also Read
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
Also Read: Satyadev-RRR: ఏంటి.. ‘ఆర్ఆర్ఆర్’లో సత్యదేవ్ నటించాడా! జక్కన్న ఎంతపని చేసే
ప్రస్తుత పరిస్థితులను చూస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి పాకిస్థాన్ వైదొలిగే అవకాశం ఉంది. హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికి పీసీబీ అంగీకరించకపోతే.. టోర్నీ మొత్తాన్ని దక్షిణాఫ్రికాలో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం, పీసీబీ మధ్య చర్చలు జరుగుతున్నాయని.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బోర్డు పనిచేస్తుందని ఓ పీసీబీ అధికారి తెలిపారు. 2012 నుండి దాయాది దేశాలు ద్వైపాక్షిక సిరీస్లు ఆడలేదు. భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్తాన్ ఆడిన విషయం తెలిసిందే. ఆసియా కప్ను పాకిస్థాన్లో ఆడేందుకు భారత్ నిరాకరించడంతో.. టీమిండియా మ్యాచులు శ్రీలంకలో జరిగాయి.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..